బ్రహ్మచర్యం పాటించే వ్యక్తిని బ్రహ్మచారి అంటారు. మనస్సూ, శరీరం ఆరోగ్యంగా ఉంచి ఉన్నత శిఖరాలకు అధిరోహింపజేసేది బ్రహ్మచర్యం. కనుకనే మానవులు ఆచరింపవలసిన చతుర్విధ కర్మలలో బ్రహ్మచర్యాన్ని మొదట చెబుతారు. బ్రహ్మచర్యం స్త్రీ పురుష సంబంధానికి మాత్రమే చెందినది కాదు. బ్రహ్మచర్యమనేది ఒక జీవన విధానం. తమ ఎనిమిదో ఏట ఆచార్యుని ఉపదేశం పొందినప్పటి నుంచి బాలకుల్ని బ్రహ్మచారులుగా, బాలికలని బ్రహ్మచారిణులుగా పిలుస్తారు. వారు గురుకులంలో ఉన్న మొదటి మూడు రోజులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. బ్రహ్మచర్యాశ్రమంలో అమ్మాయి బాగా చదువుకొని యువావస్థను పొందిన తర్వాతే యువకుణ్ణి వివాహమాడాలి. అబ్బాయి కూడా బ్రహ్మచర్యాన్ని పాటించి, సుశీల అయిన యువతిని వివాహమాడాలి.
బ్రహ్మచారి దినచర్య కఠినమైనది. అతడు సూర్యోదయానికి తర్వాతగానీ, సూర్యాస్తమయానికి ముందుగానీ నిద్రించరాదు. బ్రహ్మచర్యం ఎనిమిదో ఏట మొదలై వివాహం వరకు ఉంటుంది. ఈ కాలంలో విద్యాబోధన ప్రధాన కార్యక్రమంగా ఉంటుంది. విద్యలో గొప్పవాడై సమాజానికి ఉపయోగపడే విధంగా రూపుదిద్దుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మచర్యం సమయంలో ఇంద్రియ నిగ్రహం కావాలి. అందుకు తగ్గటు ఆహారాది నియమాలను పాటించాల్సి ఉంటుంది. బ్రహ్మచర్య సమయంలో ఆరోగ్యవంతంగా, శక్తివంతంగాను, పుష్టిగానూ ఉండాలి. తల్లి, తండ్రి, ఆచార్యుడు ఎంత కష్ట స్థితిలో ఉన్నా వారిని ఆదుకోవాలిగానీ వారిని నిందించరాదు. ఆచార్యుడు బ్రహ్మకు ప్రతిరూపం. బ్రహ్మ ఏవిధంగా తన శిష్యులకు వేదాన్ని బోధించాడో, అదే విధంగా ఆచార్యుడు వేదోపదేశం చేస్తాడు కాబట్టి అతడిని బ్రహ్మలాగా గౌరవించాలి. తల్లి తనను నవమాసాలు గర్భంలో ధరించి రక్షిస్తుంది కనుక ఆమెను పృథ్విలాగా గౌరవించాలి. ఆచార్యునితో పాటు తల్లితండ్రులకు బ్రహ్మచారులెప్పుడూ ప్రియమే ఆచరించాలి. వారు ముగ్గురూ సంతోషిస్తే బ్రహ్మచారి దీక్ష ఫలించినట్లే.

కొన్ని విశేషాలు మార్చు

  • డాక్టర్ అబ్దుల్ కలాం తాను పెళ్ళి చేసుకోకపోటానికి చెప్పిన కారణం : ప్రజలు తమ భార్యాపిల్లలకు తమ పిల్లల పిల్లలకూ ఆస్తులు సంపాదించి పెట్టటం కోసమే అవినీతిపరులౌతారు.
  • శాస్త్రములో నిషేధము లేదు కాబట్టి, ఆడవాళ్లు సన్యాసము తీసుకోవడం తప్పు కాదు - రమణ గీత 13:8
  • ముక్తి, జ్ఞానములో ఆడవాళ్ళకి, మగవాళ్ళకి తేడాలేదు కాబట్టి, సన్యాసిని చనిపోయిన తరువాత శవాన్ని బూడిద చెయ్యకూడదు - అది పవిత్రమయిన గుడితో సమానం. - రమణ గీత 13:9
  • హిందూ క్రైస్తవ స్త్రీలకు నన్స్, బ్రహ్మకుమారీ పద్ధతులున్నాయి గానీ ముస్లిం స్త్రీలకు ఇలాంటి ఏర్పాట్లు లేవు. ముస్లిం స్త్రీ కచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి.
  • అవివాహిత మహిళకు ఆమె కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తిలో సమాన వాటాహక్కు ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

కార్తికేయుని కథ మార్చు

కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు. అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది. కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లావు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.

ప్రముఖ భారతీయ బ్రహ్మచారులు మార్చు

ప్రముఖ తెలుగు బ్రహ్మచారులు మార్చు

పెళ్ళిచేసుకోని నటీమణులు,గాయనీమణులు మార్చు

పెళ్ళిచేసుకోని నటులు మార్చు

ఉన్నత అధికారులు ,సంఘ సేవకులు మార్చు

కొందరు ప్రపంచ ప్రసిద్ధ ఆజన్మ-బ్రహ్మచారులు మార్చు

 
బ్రహ్మచారి ఐజాక్ న్యూటన్

మూలాలు మార్చు

ఇతర లింకులు మార్చు