మారుతి సుజుకి ఇండియా (ఆంగ్లం: Maruti Suzuki India Limited) (హిందీ: मारुति सुज़ूकी इंडिया लिमिटेड) భారతదేశంలో కారులను రూపొందించే ఒక సంస్థ. దక్షిణ ఆసియాలో కారులను రూపొందించే సంస్థలలో ఇదే అతి పెద్దది. జపాన్ దేశపు సుజుకి మోటార్ కార్పొరేషన్ ఈ సంస్థలో అత్యధిక వాటాలు గలది. ఒక మిలియను కార్లని ఒకేసారి రూపొందించే సంస్థలలో ఇదే ఆద్యం. భారతదేశంలో ఆటోమోటివ్ విప్లవానికి ఇది నాంది పలికినది. 17 సెప్టెంబరు 2007న మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ గా మార్చారు.

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్
తరహాపబ్లిక్ లిమిటెడ్ (BSE MARUTI, NSE MARUTI)
స్థాపన1981 (as మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్)
ప్రధానకేంద్రముగుర్గావ్, భారతదేశం
కీలక వ్యక్తులుహిసాషి టకూచి
ఎండీ, సీఈవో
పరిశ్రమఆటోమోటివ్
ఉత్పత్తులుఆటోమొబైల్స్
రెవిన్యూIncreaseUS$4.8 బిలియన్ (2009)
ఉద్యోగులు6,903 [1]
మాతృ సంస్థసుజుకి మోటార్ కార్పొరేషన్
నినాదముకౌంట్ ఆన్ అజ్
వెబ్ సైటుwww.marutisuzuki.com

కెనిచి అయుకవా పదవీ కాలం 2022 మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఎండీ, సీఈవోగా హిసాషి టకూచిని నియమించింది కంపనీ. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది.[2] కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఇకపై కెనిచి అయుకవా పూర్తికాల డైరెక్టరుగా కొనసాగుతారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Maruti Udyog Ltd. Company Profile [1]
  2. "మారుతీ సుజుకీకి కొత్త ఎండీ". EENADU. Retrieved 2022-03-25.