మైఖేలాంజెలో

ఇటలీ కి చెందిన శిల్పి, చిత్రకారుడు మరియు వాస్తు శిల్పి (1475-1564)


మైఖేలాంజెలో (మార్చి 6, 1475ఫిబ్రవరి 18, 1564) ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు. ఇతను చేపట్టిన అన్ని రంగాలలోను అద్భుతమైన ప్రతిభ కనపరచాడు. 16వ శతాబ్దంలో ఇతనికి లభించిన ప్రాచుర్యం మరే కళాకారునికి లభించలేదు. ఇతని కృతులలో సుప్రసిద్ధమైనవి రెండింటిని - పేటా, డేవిడ్ అనే శిల్పాలను - తన 30యేళ్ళ వయసులోపే సృజించాడు. పశ్చిమ దేశాలలో అత్యంత ప్రసిద్ధమైన రెండు ఫ్రెస్కో చిత్రాలు - రోమ్ నగరంలో సిస్టేన్ చాపెల్ పైకప్పుపై సృష్టి చిత్రాలు, తుది తీర్పు . తరువాత అదే నగరంలో సెయింట్ పీటర్స్ బసిలికాకు రూప కల్పన చేసి భవన నిర్మాణ విధానంలో క్రొత్త మార్గాలకు ఆద్యుడయ్యాడు.

మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని
(Michelangelo di Lodovico Buonarroti Simoni)

డానియెల్ డ వోల్టెరా గీసిన మైఖేలాంజిలో Chalk portrait
జన్మ నామంMichelangelo di Lodovico Buonarroti Simoni
జననం (1475-03-06)1475 మార్చి 6
అరెజ్జో, కాప్రెసి, టుస్కాని
మరణం 1564 ఫిబ్రవరి 18(1564-02-18) (వయసు 88)
రోమ్
జాతీయత ఇటాలియన్
రంగం శిల్పం, చిత్రలేఖనం, భవన నిర్మాణం, కవిత్వం
శిక్షణ డొమెనికో ఘిరాల్డియో వద్ద అనుచరునిగా[1]
ఉద్యమం ఉన్నత పునరుజ్జీవనం

కొన్ని ప్రసిద్ధ కళాఖండాలు మార్చు

మూలాలు మార్చు

  1. "Web Gallery of Art, image collection, virtual museum, searchable database of European fine arts (1100–1850)". www.wga.hu. Retrieved 2008-06-13.

బయటి లింకులు మార్చు