ఈ వారపు వ్యాసం

నిస్తంత్రీ విధానంలో సమాచార ప్రసారం

రేడియో

కాంతి వేగ పౌన:పున్యాల(Frequency)తో విద్యుత్‌ అయస్కాంత(Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వ్‌లను ఉపయోగించి రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడ చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది. 1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి.వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము(బ్యాటరీ-Battery)తో కూడ పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి.ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది (ఇంకా…)


మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

కర్ణాటక లో ఓ ఆలయ గోపురం
  • శిలలపై శిల్పాలు చెక్కినారు..... సృష్టికే అందాన్ని తెచ్చారు ..... ఇది సినీగీతంలోని భావమే కావచ్చు..... కాని అది నిజము. శిల్ప కళలో లేని విద్యలేదు. గతంలో శిల్పుల చేతిలో శిలలు వెన్న ముద్దలుగా మారాయి. ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం. ఆ శిల్పాల సౌందర్యాన్ని తెలిపే వ్యాసం .......శిల్పకళాశోభిత స్తంభాలు
  • వంగారి మధాయ్ గా పేరొందిన వంగారి మట్టా మధాయ్ కెన్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యావరణవేత్త, రాజకీయవేత్త మరియు శరీర ధర్మశాస్త్ర పరిశోధకురాలు. ఈమె స్థాపించిన గ్రీన్ బెల్ట్ ఉద్యమానికి గానూ 2004 లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఈమె సాధించిన విజయాలను తెలిపే వ్యాసం......వంగారి మాథాయ్
  • యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు "మెరామిక్ జలాంతర్గత గుహలు" . ఇవి లైమ్ స్టోన్స్(సున్నపురాయి) నీటి కలయిక వలన భూ అంతర్భాగంలో రూపుదిద్దుకున్నాయి. ఆ గుహల సౌందర్యాన్ని అవి యేర్పడు విధానాన్ని తెలియజేసే వ్యాసం....మెరామిక్ జలాంతర్గత గుహలు
  • రెండవ ప్రపంచయుద్ధం చివరలో టోక్యో పై నిత్యం బాంబుల వర్షం కురిసేది. యుద్ధం కారణంగా పట్టణంలోని జంతుప్రదర్శనశాల అధికారులు అనేక జంతువులను చంపెయ్యవలసి వచ్చింది.ఆ సమయంలో యానో జంతుప్రదర్శన శాలలో చంపివేసిన మూడు ఏనుగుల విషాద కథ 'ప్రాణమిచ్చిన ఏనుగులు'. ...... ఈ కథ యొక్క పూర్తి వివరాలను తెలియజేసే వ్యాసం....ప్రాణమిచ్చిన ఏనుగులు
  • బోయ్ డే (Boide) కుటుంబానికి చెందిన విషరహిత సర్పం రెండు తలల పాము . ఇది ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్, మరియు భారత దేశం లలో కనిపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో దీన్ని బోగి అని అందురు. ఈ పామును నల్లబజారులో 3 నుండి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ పామును గూర్చి తెలియజేసే వ్యాసం.....రెండు తలల పాము

చరిత్రలో ఈరోజు

మే 24:
విక్టోరియా మహారాణి












Read in another language

ఈ వ్యాసం 284 భాషలలో లభ్యం

Last modified on 15 మార్చి 2013, at 04:47