విరాట్ రామాయణ్ మందిరము

విరాట్ రామాయణ్ మందిరము ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయము. దీని దేవాలయానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 2013 నవంబరు 13 బుధవారం ఆవిష్కరించారు. సుమారు 20 వేల మంది కూర్చునే సామర్ధ్యముతో త్వరలో నిర్మించబోయే ఈ దేవాలయం ఎత్తు 405 అడుగులు ఎత్తు ఉంటుంది . ద్వారక పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద సమక్షంలో విరాట్ రామాయణ్ మందిర్ కు శంకుస్థాపన చేశారు.

విరాట్ రామాయణ్ మందిరము
దస్త్రం:ViraatRamayanMandir.jpg
విరాట్ రామాయణ్ మందిరము నిర్మాణ పటము
Lua error in మాడ్యూల్:Location_map at line 391: Seconds were provided for longitude without minutes also being provided.
భౌగోళికాంశాలు:26°21′54″N 84°52′23″E / 26.365°N 84.873°E / 26.365; 84.873
పేరు
దేవనాగరి:विराट रामायण मंदिर
తమిళము:விராட் இராமாயணம் மந்திர்
మరాఠీ భాష:विराट रामायण मंदिर
బెంగాలీ:বিরাট রমযান মন্দির
స్థానం
దేశం:భారతదేశము
రాష్ట్రం:బీహార్
జిల్లా:తూర్పు చంపారన్
ప్రదేశం:కేసరియా
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:రాముడు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
21వ శతాబ్దము
నిర్మాత:మహావీర్ మందిర్ ట్రస్ట్, పాట్నా
వెబ్‌సైటు:official page

నిర్మాణము మార్చు

అత్యంత సంపన్న ట్రస్ట్ గా పేరొందిన మహావీర్ మందిర్ ట్రస్ ఈ దేవాలయ నిర్మాణాన్ని చేపట్టింది. 500 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ దేవాలయాన్ని పాట్నాకు 125 కిలో మీటర్ల దూరంలోని దక్షిణ చంపారన్ జిల్లాలోని కెసారియా సమీపంలోని జంకి నగర్ లో నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి మహావీర్ మందిర్ ట్రస్ట్ కార్యదర్శి ఆచార్య కిషోర్ కునాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంబోడియాలోని 12వ శతాబ్దంలో నిర్మించిన ఆంగ్‌కోర్ వాట్ఆలయము (215 అడుగులు) కు రెండింతలు పెద్దదిగా ఉంటుంది.ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 దేవాలయాలు ఉంటాయి. ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగాన్ని నిర్మించబోతున్నారు.