ఆస్మాన్ ఘర్ ప్యాలెస్

ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మలక్‌పేట లో ఉన్న ప్యాలెస్. మధ్యయుగపు యురోపియన్ కోట ఆకృతిలో ఉన్న ఈ భవనం చిన్న కొండ పైన నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ పురావస్తు శేషాలని ప్రదర్శించే మ్యూజియంగా ఉపయోగించబడుతుంది.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

ఆస్మాన్ గఢ్ ప్యాలెస్
సాధారణ సమాచారం
రకంరాజభవనం
నిర్మాణ శైలిగోతిక్ రివైవల్ నిర్మాణం
ప్రదేశంమలక్‌పేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్తి చేయబడినది1885

చరిత్ర మార్చు

ఆస్మాన్ అనగా ఆకాశం, గఢ్ అనగా ఇల్లు. ఆకాశపు ఇల్లు అనిపించేలా 1885లో కొండపైన ఈ భవనం నిర్మించబడింది. 1887-1894 మధ్యకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్న పైగా వంశానికి చెందిన ఆస్మాన్ జా బషీర్-ఉద్-దౌలా ఫతేమైదాన్ వద్ద ఈ ప్యాలెస్‌ను నిర్మించాడు. పైగా కుటుంబానికి చెందిన ఆస్మాన్ జా ఆకాశంకి దగ్గరగా ఉన్న ఇంటిని నిర్మించాలన్న తన కలను నెరవేర్చుకోవడంకోసం, విశ్రాంతి తీసుకోవడంకోసం కొండపైన ఈ భవనం నిర్మించాడు.[2]

ఆస్మాన్ గఢ్ చుట్టుప్రక్కల ఉన్న అడవి ప్రాంతానికి వేటకు వచ్చిన నిజాం ఈ ప్యాలెస్ ను చూసి ముచ్చటపడి వీలున్నప్పుడల్లా సందర్శించేవాడు. దాంతో సర్ అస్మాన్ జా ఆస్మాన్ గఢ్ ప్యాలెస్ ను నిజాంకు ఇచ్చాడు. కొంతకాలం ఉపయోగించకుండా ఉన్న ఈ ప్యాలెస్ పురావస్తు మ్యూజియంగా మార్చబడింది.

నిర్మాణం మార్చు

యురోపియన్ కోట యొక్క ఆకృతిలో ఉన్న ఈ ప్యాలస్ గోతిక్ శిల్ప శైలిలో నిర్మించబడింది.

మూలాలు మార్చు

  1. The Hindu, Hyderabad (21 January 2004). "Castle of dreams". K. Venkateshwarlu. Retrieved 30 December 2018.
  2. ఆస్మాన్ గఢ్ ప్యాలెస్, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 85