ఇందిరా నాథ్

(ఇందిరానాథ్ నుండి దారిమార్పు చెందింది)

ఇందిరా నాథ్ (Indira Nath) (జ. 14 జనవరి, 1938) సుప్రసిద్ధ భారతీయ శాస్త్రవేత్త. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం బ్రాహ్మణకోడూరు గ్రామానికి చెందిన వెంకటరావు,నాగరత్నమ్మ తల్లిదండ్రులు.

Indira Nath
జననం (1938-01-14) 1938 జనవరి 14 (వయసు 86)/జనవరి 14. 1938
నివాసంNew Delhi, India
పౌరసత్వంIndia
జాతీయతIndian
జాతిHindu
రంగములుImmunology
వృత్తిసంస్థలుAll India Institute of Medical Sciences
ముఖ్యమైన పురస్కారాలుPadma Shri

జీవిత విశేషాలు మార్చు

గుంటూరులో ఎన్.వి. రావు, లకు జన్మించింది. కొత్తఢిల్లీలోని భారత వైద్య శాస్త్ర సంస్థలో (AIIMS) 1963లో M.B.B.S, 1969లో M.D పట్టాలు పొందింది. ఇంగ్లాండ్ లో 1983 లో M.R.C.P (Pathology) పట్టా పొందింది.ఆ తర్వాత ఎం.ఎన్.ఎ.ఎమ్‌ . ఎస్. ఎఫ్.ఎ.సి.ఐ; ఎఫ్.ఎన్.ఎస్.సి డిగ్రీలను కూడా పొందారు.. .

ఉద్యోగాలు మార్చు

తొలుత లండన్ నగరములోని ఈస్ట్ సఫొల్క్ వైద్యశాలలో (1963-64), తరువాత కార్డిఫ్ నగరములోని వైద్య కళాశాలలో (1964), లండన్ లోని రాష్ట్రీయ హృదయ వైద్యశాలలో (1965) పనిచేసింది. 1965లో సెయింట్ ఆండ్రూస్ వైద్యశాలలో రిజిస్ట్రార్ గా నియమించబడింది. 1967లో స్వదేశము వచ్చి AIIMS లో బయోటెక్నాలజీ విభాగానికి అచార్య పదవి (1967 - 71) చేబట్టారు. సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సంస్థలోప్రొఫెసర్ గా ఉంటూ (1999) ఎంతో మంచి వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఊతమిచ్చారు.

పరిశోధనలు మార్చు

వ్యక్తులలో తీవ్ర ఆరోగ్య నష్టాలకు దారితీసే క్లిష్టమైన సమస్యలను కనుగొనడంలో, సునాయాసంగా, ముదస్తుగా కుష్టువ్యాధిని గుర్తించేందుకు రెండు "ఎం లెఫ్రాయ్" ప్రోటీను అన్వేషించి కనుగొనడాంలో ఈమె పరిశోధనలు ఎంతో మార్గదర్శకం వహించాయి. మూడు నుంచి ఆరు వారాల లోపుగానే లెప్రా బాలిల్లి (శరీరమంతా వ్యాపించిన లెప్రొమా కంతులు) ని సూక్ష్మ దర్శిని ద్వారా కనుగొనడాన్ని వివరించారు. వంశపారంపర్యంగా తలెత్తు శోష రస కణముల అసాధారన అభివృద్ధిని, వాటి పనితీరును తన పరిశోధనల ఫలితాల ద్వారా వెల్లడించారు. ఉత్తమ స్థాయి ఔషధాల ద్వారా కూడా సాధించలేని వ్యాధి నివారణకు మూలములను కనుగొన్నారు.. కుష్టువ్యాధి బయల్పడక పూర్వమే, దాని ఆనుపానులను కనుగొని మూలములను నశింపజేయటానికి అవసరమైన చికిత్సలను కనుగొని, మన దేశములో కుష్టువ్యాధి వ్యాపించకుండా ఉండటానికి తమ వంతు కృషి చేసి విజేత కాగలిగారు.

కుష్టు వ్యాధి మీద ఈమె చేసిన పరిశోధనలు ప్రపంచ ప్రసిద్ధమైనవి. ఈమె ప్రస్తుతం అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలోని బయోటెక్నాలజీ విభాగానికి అధిపతిగా ఎస్.ఎన్.బోస్ కేంద్రంలో పరిశోధకులుగా చిరకాలంగా పనిచేస్తున్నారు. ప్రొఫెసర్ నాథ్ కుష్టు వ్యాధి మీదనే కాకుండా మానవులలో వ్యాధి నిరోధక ప్రక్రియ (ఇమ్యునాలజీ) మీద జరిపిన పరిశోధనలు వైద్యంలోను, కొత్తగా వ్యాధులగురించి చేసే పరీక్షలు అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తాయి.

సంపాదకులుగా మార్చు

ఈమె "ఇండియన్ జర్నల్ ఆఫ్ లెప్రసీ", "ఆసియన్ ఫసిఫిక్ జర్నల్ ఆఫ్ ఎలర్జీ అండ్ ఇమ్యూనిటీ" పత్రికలకు సహాయ సంపాదకులుగా పనిచేశరు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వారి ప్రచురనల సంపాదక మండలికి ఛైర్ పర్సన్ గా కూడా వ్యవహరించారు.

వివిధ పదవులు మార్చు

పరిశోధనా రంగంలో ఎంతో కృషి చేసిన డాక్టర్ ఇందిర ఇండియన్ అకాడామీ ఆఫ్ సైన్సెస్, కాలేజీ ఆఫ్ అలర్జీ అండ్ అప్లైయడ్ ఇమ్యూనాలజీ సంస్థలలో ఫెలోషిప్ అందుకుని పరిశోధనలు సల్పారు. పలు ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థలలో వివిధ పదవులను అందుకుని, ఆయా సంస్థల అభివృద్ధికి కృషిచేసరు. నేషనల్ అకాడామీ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ ఇమ్యూనాలజీ సొసైటీ, ఇండియన్ అసోషియేషన్ ఆఫ్ పాథాలజిస్ట్స్ అండ్ మైక్రో బయోజజిస్ట్స్ మొదలగు సంస్థలలో బాధ్యతాయుత పదవులను నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లెప్రొలాజిస్ట్స్ జీవిత సభ్యులుగా ఉన్నారు.

వ్యక్తిగత జీవితం మార్చు

వైద్య విద్యాభ్యాసం నుండి ఈమెకు పెథాలజీ మీద ముఖ్యంగా పరిశోధన మీద మక్కువ ఎక్కువ. ఈమె భర్త కూడా వైద్యుడు. ఇద్దరిదీ ప్రేమ వివాహం. ఇద్దరూ పాశ్చాత్యదేశాలకు చదువుకోసం వెళ్ళినా, 1980 ప్రాంతంలో స్వదేశానికి తిరిగివచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించారు. మనదేశంలో వ్యాధినిరోధక శాస్త్రం అంతగా అభివృద్ధిచెందని సమయంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో బయోటెక్నాలజీ విభాగాన్ని 1986 సంవత్సరంలో ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ఎందరో శాస్త్రవేత్తలకు ఈ విభాగంలో శిక్షణ ఇచ్చారు.దీనికి గాను 2002 సంవత్సరంలో ఈమెకు "ఎల్ ఓరియల్ యునెస్కో 2002 మహిళా శాస్త్రవేత్త అవార్డు"ను తెచ్చిపెట్టింది. ఈ బహుమతి కోసం జరిగిన పోటీలో 100 మందిలోనుండి ప్రపంచవ్యాప్తంగా సుమారు 800 మంది శాస్త్రజ్ఞుల చేత ఎన్నుకోబడ్డారు.

అవార్డులు మార్చు

  • 1981 : ట్రస్ట్ ఫండ్ ఓరేషన్ అవార్డ్
  • 1983 : శాంతి స్వరూప్ భట్నాగర్ ప్రైజ్
  • 1985 : క్షణీక ఓరేషన్ అవార్డు (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)
  • 1987 : నిత్యానంద ఎండోమెంట్ లెక్చర్
  • 1990 : శ్రీ ఓం ప్రకాశ్ భాసిన్ ఫౌండేషన్ అవార్డు.
  • 1995 : ఇండియన్ కౌన్సిల్
  • 1999 : వ్యాధి నిరోధక శాస్త్రంలో ఈమె జరిపిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చి సత్కరించినది.

ఈమెకు మరుగుజ్జు వృక్షాలు (బోన్సాయి మొక్కలు) పెంచటం అన్నా, ఈతకొట్టడం అన్నా చాలా ఇష్టం.

బయటి లింకులు మార్చు