ఏంమ్వీయల్(మద్దాలి వెంకట లక్శ్మీనరసింహారావు )

[[[1]]] ఏంమ్వీయల్ పూర్తిపేరు మద్దాలి వెంకట లక్శ్మీనరసింహారావు, కానీ ఆటను ఏంమ్వీయల్ గానే ప్రసిద్ధుడు. బందరు సమీపంలోని గూడూరు అతని సొంతవూరు. బందరు కళాశాలలో బీఏ,. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏం.ఏ చదివి. 1966లో ధర్మా అప్పారావు నూజివీడులో ప్రారంభించిన డి.ఏ. అప్పారావు కళాశాలలో తెలుగు శాఖ అధిపతిగా చేరి, చివరి వరకు అక్కడే పనిచేసాడు. మంచి ఆకర్షణీయమైన,రూపం. మంచి కంఠం, గొప్ప ఉపన్యాసకునికి ఉండవలసిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. వృత్తిని,ప్రవృత్తిని సమానంగా ప్రేమించాడు.1967లో వరలక్ష్మితో వివివాహం అయింది. కుమారుడు, కుమార్తె. ఏంమ్వీయల్ కవి, రచయిత, జర్నలిస్ట్, నవలాకారుడు, కథకుడు కూడా. వివిధ వార్తాపత్రికల్లో ఆతను రాసిన కథలు 18 లభించాయి. "మలుపు. మెరుపు", "నిన్నటి స్వప్నం నేటి సత్యం" రెండు నవలలు రాసాడు. మొదటి నవలలో కళాశాలలో రాజకీయాలను ఇతివృత్తంగా స్వీకరించాడు. "ఉడుగర","వయోసిలిన్" అతని కవితా సంకలనాలు. కానుక, కవితాహారతి పరిశోధన గ్రంథాలు. అతని రచనల్లో భావుకత, సామజిక ప్రయోజనం, వ్యగ్యం, హాస్యం మిళితమై వుంటాయి. విద్యార్థిగా ఉన్న రోజుల్లో నార్ల చిరంజీవి ప్రభావం తనమీద ఉంది. శాండిల్య, తదితర నక్షత్ర సప్తకం మిత్రులతో కలిసి నవత సాహిత్య పత్రిక నిర్వహించడంలో సహకరించాడు. తాను శ్రీ శ్రీ అభిమాని, శ్రీ శ్రీ ఇతరుల కవితా సంకలనాలకు రాసిన పరిచయాలను "వ్యూలు,రెవ్యూలు" పేరుతొ విద్యార్థిగా ఉండగానే అచ్చువేశాడు. తెలుగు అకాడమి ప్రచురించిన మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, పాండురంగ మాహాత్మ్యానికి సంపాదకుడుగా వ్యవహరించి మంచి ముందుమాటలు రాసాడు. 1966లోనే ఆంధ్రజ్యోతి వారపత్రికలో "యువజ్యోతి" శీర్షిక చాలాకాలం నిర్వహించి యువజనుల అభిమానాన్ని సంపాదించుకొని, యువతలో కవితాభిరుచి కలిగించాడు. యువజ్యోతి శీర్షికలో యువత వేసే ప్రశ్నలకు హాస్యం, పన్, వ్యగ్యం రంగరించి సమాధానాలిచ్చేవాడు.

ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని ఎమ్వీయల్. నరసింహారావు వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)
ఏంమ్వీయల్ గొప్పవక్త. ఆధునిక కవుల రచనలను పరిచయం చేసినా, ప్రాచీన ప్రబంధాలమీద ఉపన్యసించినా శ్రోతలను ఆకట్టుకొనేవాడు. యువకవులు అలిశెట్టి ప్రభాకర్, చంద్రసేన్, వసీరా వంటి కవులను పరిచయం చేసాడు. 

ఏంమ్వీయల్ బాపు, రమణల ఏకలవ్య శిష్యుడు, ముత్యాలముగ్గు ఏంమ్వీయల్ నిర్మాతగా, బాపు దర్శకత్వంలో గొప్ప కళాత్మక చిత్రంగా పేరు తెచ్చుకొని, ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారం పొందింది. తాను స్నేహం, గోరంతదీపం, ఓ ఇంటి భారతం సినిమాలకు మాటలు రాసాడు. సినీ గాయకుడు బాలు, బాపు, రమణలకు గొప్ప మిత్రుడు.ఏంమ్వీయల్ చతుర సంభాషణ ప్రియుడు. ఆతను ఎక్కడ వున్నా అతని చుట్టూ అభిమానులు మూగివుండేవారు. క్రమంగా చంద్రబింబంలాటి ముఖం చంద్రకళలు తరిగిపోయినట్లు తరిగిపోయి, 23-01-1986లో అకాల మరణం పొందాడు.

ఆకరాలు:1.ఏంమ్వీయల్ రచనలు, 2. ఆంధ్రజ్యోతి, ఇతర తెలుగు వార్తాపత్రికలలో తన రచనలు, 3. తెలుగు అకాడమి ఏంమ్వీయల్ సంపాదకుడుగా అచ్చువేసిన పుస్తకాలు.4.ఏంమ్వీయల్ మీద అనేక తెలుగు పత్రికల్లో వచ్చిన వ్యాసాలు, 5.ఏంమ్వీయల్ శ్రీమతి స్వర్గీయ వరలక్ష్మి, కుమారుడు స్వర్గీయ రాంప్రసాద్, బంధువు శ్రీమతి వసంత తెలియజేసిన వివరాలు, ఎం.ఏలో ఏంమ్వీయల్ సహా విద్యార్థిగా, మిత్రుడుగా ఈ రచయతకు తెలిసిన వివరాలు.

మూలాలు మార్చు

  1. దస్త్రం:Jnkhujufgc.jpg|thumb