క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనలు

అనాది నుంచీ మన దేశంలో వున్న ప్రజలు వారి మాత విశ్వాసాలనూ, ఆచారాలనూ, సంప్రదాయాలనూ ప్రచారం కోసం జానపద కళా రూపాలను బహుముఖాల ఉపయోగించు కున్నారు. అలా ఆయా మతాలు, కులాలు, జాతులు జానపద కళా రూపాలకు ఒక ఉన్నత స్థానాన్ని కల్పించారు. అలా ఆరాధించిన వారిలో క్రైస్తవులు కూడా ఉన్నారు.

క్రైస్తవ మిషనరీలు రాక మార్చు

క్రీస్తు శకం 52 లో సెయింట్ థామస్ రాకతో మనదేశానికి క్రైస్తవ మతం ప్రవేశించిందనీ, మత ప్రచారార్థం మన దేశానికి చాల మంది మిషనరీలు వచ్చారనీ, ఈ దేశ సంస్కృతికీ, మతాచారాలకు వ్వతిరేకంగా తమ మతాన్ని ప్రచారం చేయలేమని గ్రహించారనీ, కేవలం అట్టడుగున వున్న ప్రజల్ని మాత్రం ఆకర్షించ గలిగారనీ వెంకటేశ్వర యూనివర్శిటీ కాలేజి లెక్చరర్ డా|| ఆనందన్ గారు 1990 డిసెంబరు 27 వ తేదీన యస్.వి. యూనివివర్శిటీ తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్వంలో జరిగిన దక్షిణ భారత జానపద కళా ప్రదర్శనాల సెమినారు సందర్భంలో క్రైస్తవ జానపద ప్రదర్శన కళలు అనే పత్రాన్ని సమార్పిస్తూ ఈ క్రింది విధంగా వివరించారు. 17 వ శతాబ్దపు ప్రారంభంలో క్రైస్తవ మాత ప్రచారం కోసం ఒక నూతన పంధాను అనుసరించింది. దీనికి అద్యుడు రాబర్టు డి నొబిలి. ఇతను జెసూట్ పాదరీల సంఘ ప్రతినిధిగా 1606 వ సంవత్సరంలో దక్షిణ భారతదేశం మధురకు వచ్చాడు.

;వీరప్ప నాయకుని కాలంలో: మార్చు

నొబిలీకి పూర్వం మధురను పాలించిన వీరప్ప నాయకుని కాలంలో (1572 - 95) ఫాదరీ ఫెర్నాండెజ్ పద్నాలుగు సంవత్సరాలు క్రైస్తవ మాత ప్రచారం చేశాడు. ''పరవార్ లు అనే చేపలు పట్టే మత్స్య కారుల్ని మాత్రం క్రైస్తవ మతస్తులుగా మార్చగలిగాడు. కానీ అగ్ర కులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరించక పోవటానికి ఈ క్రింది కారణాలు అడ్డు వచ్చాయి. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వారు హైందవ ఆచారాల్ని విస్మరించటమూ, పరవర్ లు అనబడే మత్స్య కారులు అంటరాని వారై వుండి క్రైస్తవులు కావటమూ, క్రైస్తవ మత ప్రచారకుల్ని నీతి నియమాలూ, మానమర్యాదలూ లేని త్రాగు బోతులుగా, గోమాంస భక్షకులుగా మంచి వారిని పరంగేలుగా పిలవడం వల్ల అగ్ర కులాల వారెవ్వరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించలేదు.

మతం కోసం మార్చిన వేషం మార్చు

ఈ పరిస్థితుల్ని అర్థం చేసుకొన్న నొబిలి తన ప్రచారం కోసం తన వేష భాషల్నీ, ఆచార వ్వవహారాల్నీ మార్చి వేసి సన్యాసిగా కాషాయ వస్త్రాలను ధరించాడు. జంధ్యం వేసుకున్నాడు. ముఖానికి విభూతి రేఖలు దిద్దాడు. చేతిలో కమండలాన్ని ధరించాడు. శాఖాహారిగా ఒక చిన్న గుడిసెలో కాపరం పెట్టాడు. జగద్గురు తత్వ బోధక స్వామిగా ప్రసిద్ధి చెందాడు. బ్రాహ్మణులతో కలసి మెలిసి తిరిగాడు. ఇలా నొబలీ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయూలకు చోటు సంపాదించాడు. ఆనాటి నుంచి ఈ నాటి వరకూ క్రైస్తవ మతంలో హైందవ సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు కొన సాగుతున్నాయి. మధుర లో క్రైస్తవ వేదాంత కళాశాల క్రైస్తవ మతాన్ని పూర్తిగా హైందవీ కరణం చేయడానికి కృషి చేస్తూ వుంది. క్రైస్తవులు మన దేశ సంస్కృతికి అనుగుణంగా తమ మాతాన్ని ప్రబోధించాలను కున్నారు. తర తరాలుగా వస్తూవున్న ప్రచార సాధనాల్నేఇందుకు ఎంపిక చేసుకున్నారు. ఇలా అయితే విషయం ప్రజల్లోకి సులభంగా చొచ్చుకు పోతుందని వారి విశ్వాసం. అందుకు అనువుగా మన జానపద కళారూపాల్లో హరికథ బుర్ర కథ భజనలు కోలాటాలు వీధినాటకాలు మొదలైన వాటిని ఎంచుకున్నారు.

హరికథ మార్చు

క్రైస్తవ మతానికి చెందిన కథా రచయితలు, కథానాయకులు, దీనిని కాలక్షేప మనీ, సత్కథా గానమనీ అంటారు. బాపట్లలో ' ఇండియా బైబిల్ మిషను కు చెందిన షారోను ఆశ్రమ నిర్వాహుకులు రెవరెండు మనోహర కవి వ్రాసిన "అవతార విలాసం " 1959 లో ప్రచురింప బడింది. దీనిని ఆయన హరి కథగా పేర్కొన్నాడు. క్రైస్తవ కాథా గానాన్ని రచించిన ప్రధమ కవి "పిడతల జాన్ కవి. (1876 ... 1971) ఈయన భారత పురాణ కథల్ని వినడంవల్ల హరికథల్ని వినటం వల్ల అందు లోని మెలకువల్ని తెలుసుకుని బైబిలు లోని ఘట్టాలను అనుసరించి హరికథా కాలక్షేపాలుగా మలిచాడు. వాటిలో "ఆదాం హవ్వలు క్రీస్తు జననం " పేర్కొన దగినది. అలాగే మంద పాటి అబ్రహాం భాగవతార్ ఏసు చరితము అత్తోట రత్న కవి సంపోను దెలీలా మొదలైనవారు వ్రాసినవి మాత్రమే లభ్యమౌతున్నాయి.

హరికథలు వ్రాసిన రచయితలు మార్చు

బండారు ఇసాక్ భాగవతార్, కంబం జాకబ్, పాటి బండ్ల జాకబ్, పినపాటి జర్నియాబిరినీడి మేషే కవి, కంచం జాకబ్, చందోలు ఆనంద కవి మొదలైన వారు క్రీస్తు గాథల్ని హరికథలుగా వ్రాసున్న ప్రముఖులు. వీరు క్రైస్తవ హరి కథల్నే కాక హిందూ పురాణ గాధల్ని కూడ వ్రాయడం చెప్పుకో దగిన విషయ మంటారు ఆనందన్ గారు. అంతే కాదు మన పురాణ గాదల్ని హరి కథలుగా వ్రాసే రచయితలు క్రైస్తవ ఇథి వృతాలను కూడ హరికథలుగా వ్రాస్తున్నారు. అలాంటి వారు జిన్నా అప్పారావు, అన్నం నాగ భూషణం, చేకూరి లక్ష్మీనారయణాచార్య, పెద్దింటి సూర్య నారాయణ దీక్షితులు మొదలైన వారు రచనలు చేస్తున్నారు.

గాన విధానం మార్చు

హరికథా గానంలో మొదట దైవ ప్రార్థన వుంటుంది. కథ పాత నిభంధనకు సంబంధించిందైతే యెహోవాను, కొత్త నిబంధనకు సంబంధించిం దైతే ఏసు క్రీస్తును ప్రార్థించటం మామూలు.

ఉదాహరణలు: మార్చు

పరమపావన దేవా, దురిత భంజనా
దరనుత గుణ గణా యతి దీనావనా
వరదా నిను భజయించెద
కరుణ బ్రోవుము దేవా....................................||పరమ||

(కరుణాసాగర చరిత్ర) హనుమ గుత్తి దేవదానం.

తరువాత సభా స్తుతి ఇలా చేయ బడుతుంది.

ఆత్మాభిషేకంబు నంది సంఘోన్నతి కొరకు
శ్రమియించు సద్గురువు లార
కృస్తు నామార్చన నా గీతములో రచిచ్య్ంచి
ప్రతటించు చున్నట్టి సుకవు లార
సతతము సువార్తను చాటించి నశించు
ఆత్మను రక్షించు ఆప్తులార
కవుల గాయకుల సత్కళల బోషింప
స్వధనము వ్వయించు వదాన్యులార.

పేద సాదల ప్రేమతో నాదరించి
దైవ వాక్యాలు సారమౌ జీవితమ్ము
గడుపు చున్నట్టి భక్తాగ్ర గణ్యులార
సక్తథా గానంజు వినుడి సభ్యు లారా..

ఇలా సభాస్తుతి చేసిన తరువాత కథా గానాన్ని చేస్తాడు. కాథాంతంలో ఫల శ్రుతి, ఆ తరువాత మంగళం పాడటంతో ముగుస్తుంది.

కోలాటం మార్చు

కోలాటాన్ని డిసెంబరులో వచ్చే క్రీశ్త్ మస్ పండుగకూ, వరికోతలప్పుడూ ప్రదర్శిస్తూ వుంటారు. కోలాటంలో పాల్కొనే వారు అందరూ ఒకే రంగు గల వస్త్రాలను ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కట్టు కుంటారు. చేతిలో కోలలు ధరించి, ఇద్దరు చొప్పున సరి జోడిగా రెండు కక్ష్యలుగా నిలబడతారు. ఇలా నిలబడిన వారు కోపు ప్రారంభం కాగానే వెలుపలి కక్ష్య లోపలికి, లోపలి కక్ష్య వెలుపలికి వచ్చేలా ఆడుతూ, అటూ ఇటూ చిరుతలను తట్టుతూ అభినయిస్తారు. ఏసు క్రీసు మహిమను చాటుతూ సరెల్ల సామ్యేల్ సుబ్బయ్య వ్రాసిన కోలాటపు పాట పేర్కొనదగినది.

:కీర్థన: మార్చు

కోలలు వేయండి- ఏసుని కొనియాడను రండి
మేలులన్నిటికి మూలం బతడని చాల నుతించుచు జాలము చేయక
నృత్యము చేయండి - ఏసుని భక్తితో కొలవండి
నృత్యముగా ప్రభువు చావును గెలిచియు
నిత్యము మనతో కూడా వచ్చెనని
పొందుగ లేవండి - ఏసుని ముందర నిలవండి

వింత దేవుడని సంతరించుచు
ఎగురుచు పాడండి - ఏసుని ఎదలో నుంచండి
సొగసుగ సభలో శుభముల నొసగు
తగిన విధంబున దయ జూపును అని

ఈ విధంగా కోలాటం ద్వారా తాము వివరించా లనుకున్న భావాన్ని వ్వక్తం చేస్తారు. ప్రజల నుర్రూత లూగించే కళారూపాలలో బుర్రకథ కళారూప ప్రధానమైంది. బుర్ర కథను గురించి ఆంధ్ర దేశంలో తెలియని వారెవరూ లేరు. అలాంటి బుర్ర కథను క్రైస్తవులు కూడా వారి మత ప్రచారం కోసం వినియోగించారు. బుర్రకథ లక్షణాలను గురించి గేరా ప్రేమయ్య అనే బుర్ర కథా రచయిత తన పండిత రామాబాయి అనే బుర్ర కథలో ఇలా ఉదహరించాడు.

రగడ: మార్చు

ఘనకవి పండిత సుజనుల్లారా తందాన తాన
తోడు వంతలు జోరుగ పాడ తందాన తాన
జోడు గుమ్మెట్లు తధిమి యనంగ తందాన తాన
రాగ తాళ గీతాది వృత్యముల తంబుర కథ నేడు వినుడీ

క్రైస్తవ బుర్రకథా రచయితల్లో గేరా ప్రేమయ్య పేర్కొన తగిన వాడు. ఆయన నలబై బుర్ర కథల్ని రచించాడు. ఇంకా చిన్నా బత్తిని మైకేల్ కవి, జొన్న కూటి ప్రకాశం, వలుకూరి సత్యానందం, ఈదుల మూడి ఐజాక్, తోట శౌరి మొదలైన వారు రచయితలుగా కథకులుగా పేరు పొందారు.

బుర్ర కథలు మార్చు

అలాగే సి. బెనర్జీ, ధర్మయ్య, మస్తాన్ రావు, సత్యం బృందం, రెవరెండ్. కె.ఎస్.ప్రకాశ రావు, గంగోలు మోజెస్, తల తోటి ఏసేపు, బుద్దాడ జోసప్, సి.హె.పాలస్, పి. ఐజక్, సాధు తోమాన్ సుబ్బయ్య, వి. రత్నం., బి. జాన్ మొదలైన వారు బుర్ర కథలు చెపుతూ తమ జీవితాలను సాగిస్తున్నారు. క్రైస్తవ బుర్ర కథలు మూడు విధాలుగా వున్నాయి. అవి పాత నిబంధనకు చెందినవి. క్రొత్త నిబంధనకు చెందినవి. క్రైస్తవ భకుల చరిత్రకు చెందిన బుర్ర కథలు: గేరా ప్రేమయ్య వ్రాసిన నెహెమ్యా చరిత్ర, దావీదు విజయము, యేసేపు చరిత్ర, వలుకూరి సత్యానంద వ్రాసిన ఎలీషా, చిన్నా బత్తిన మైకేల్ వ్రసిన వీర సంపోను చరిత్ర మొదలగు వని పాత నిబంధనకు సంబందించిన బుర్ర కథలు. పలుకూరి సత్యానందం వ్రాసిన యేసు జన్మము, గేరా ప్రేమయ్య తప్పి పోయిన కుమారుని చరిత్ర, యోహాను శిరచ్ఛేదము, క్రీస్తు శ్రమ మరణ పునరుత్థానముల కథ, సాధు తోమాన్ సుబ్బయ్య వ్రాసిన మృత్యంజయుడు మొదలైనవి కొత్త నిబంధనకు చెందిన బుర్ర కథలు. గేరా ప్రేమయ్య గారి సాధు సుందరసింగ్, పండిత రామాబాయ్హి, చిన్నాబత్తిని మైకేల్ కవి గారి బ్రదర్ జోసఫ్ తంబి గారి చరిత్ర., ప్లీవసృఈ వ్రాసిన ఆగ్నేసమ్మ చరిత్ర సాధుతోమాన్ సుబ్బయ్య వ్రాసిన విశ్వజనని మానవుల మాత మొదలైన భక్తుల చరిత్రకు చెందిన బుర్ర కథలు.

బుర్ర కథల్లో ప్రజా సమస్యలు మార్చు

క్రైస్తవ కథలు ప్రాచీనమైనవి. వీటిని ఈనాడు కొందరు బుర్ర కథలుగా మలిచారు. అందులో ఈనాటి సమాజం లోని కుళ్ళును చెప్పడానికి ప్రయత్నించారు గేరా ప్రేమయ్య గారి యోహాను శిరచ్ఛేదము బుర్ర కథలో బ్లాకు మార్కెట్టు బంధించ బడాలని చెప్పే క్రింది ప్రబోధాన్ని చూడండి.

కట్తుకొనెడి గుడ్దకు బ్లాకు..........తందాన
పొఎట్టుకునే దీపానికి బ్లాకు......................"
తిందామంటే తిండి బ్లాకు ........................"
మగ్గిపోయిన బియ్యం బ్లాకు......................"
పప్పు పప్పులన్నియు బ్లాకు...................."
పంచదారయు బెల్లము బ్లాకు...................."
కట్టెపుల్లల కసలే బ్లాకు............................"
వీధిలో యంగళ్ళన్నీ బ్లాకండో............. తందాన.

ఇలా క్రైస్తవ బుర్ర కథలలో సామాజిక రుగ్మతలను గురించి కూడా ప్రస్తావించారు.

భజనలు మార్చు

పని పాటలు అయిపోయిన తరువాత పల్లెల్లో మామూలుగా భజనలు చేస్తూ వుంటారు. వీటిలో చెక్క భజనలు, పండరి భజనలు, హరి భజనలు , శాపమూళ్ళ భజనలు మొదలైనవి వున్నాయి. ఈ భజనలన్నీ భారత రామాయణ గాధలకు సంబంధించి భక్తి భావంతో కూడు కున్నవి. ఈ భజన పాటల్ని అనుసరించి క్రైస్తవులు కూడ భక్తితో భజన కీర్థనలు వ్రాశారు.

పండరి పురానికి వెళుతూ పండరి భక్తులు రంగ ఎంత దూరమో ఎరుగము పండారి అనే పాటను అనుకరిస్తూ..............

ఇక నెంత దూరమో - ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
ఎరుగను కానాన్ పురము
నడచి నడచియు కాళ్ళు - కడు బొబ్బ లెక్కెను .... కడు బొబ్బలెక్కెను

అని పాడుతూ, అలాగే మరో పాట.. ఏసుక్రీసు శ్రమావరణాల్ని గూర్చి పాడుతూ ఆయనకు జేజేలు పలికే క్రింది భజన కీర్తన కూడా ఈ కోవలో పేర్కొనదగినది.

ఏడమ్మా మన ఏసూ - ఏడనున్నాడో జై
ఏడనున్నాడో ఆ జాడ తెలియదాయొ..............................||ఏడమ్మా||
నీచిన్ని కాళ్ళల్లొ - శీలలే నాటిరిగ జై
కారినా రక్తంబూ
కాలువలై పారెను గా...................................... .........||ఏదమ్మా||

ఇలా ఏసు గాథలకు సంబంధించిన భజన పాటలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇతర కళారూపాల క్రైస్తవులు జానపద కళా ప్రదర్శనాలను శుభ సమయాలలోనూ, పెండ్లిండ్లు, సమయంలోనూ, పండుగల సమయం లోనూ, మహా మహుల స్మృత్యర్ధం జరిపే జన్మ దినోత్సవాల లోనూ, క్రైస్తవ మహా సభలు జరిగే సమయాల లోనూ, ఈ కళా ప్రదర్శనాలను ప్రదర్శిస్తారు. ఈ కళలు హిందూ క్రైస్తవుల సంస్కృతికి దర్పణాలై క్రైస్తవ సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. క్రైస్తవ సాహిత్యం జానపద కళ లన్నిటిలోనూ ఉండటం గనమించ దగిన విషయం.

మూలాలు మార్చు

యితర లింకులు మార్చు