ఖజ్రానా గణేష్ దేవాలయం

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం.

ఖజ్రానా వినాయక దేవాలయం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న వినాయకుడి దేవాలయం. ఈ దేవాలయం హోల్కర్ రాజవంశం పాలనలో నిర్మించబడింది.[1]

ఖజ్రానా గణేష్ దేవాలయం
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:మధ్య ప్రదేశ్
జిల్లా:ఇండోర్
ప్రదేశం:ఇండోర్

చరిత్ర మార్చు

1735లో హోల్కర్ రాజవంశానికి చెందిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈ దేవాలయాన్ని నిర్మించింది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నుండి సురక్షితంగా ఉంచడానికి వినాయకుని విగ్రహాన్ని బావిలో దాచిపెట్టగా తరువాత వెలికితీయబడింది.[2] భక్తులు దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి, తమ కోరికలు నేరవేరాలని ఒక దారం కడుతారు. దేవాలయంలోని పురాతన విగ్రహం స్థానిక పూజారి పండిట్ మంగళ్ భట్ కలలో కనిపించిందని చరిత్రకారుల అభిప్రాయం. ఈ దేవాలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబం నిర్వహిస్తోంది.[2]

 
ఖజ్రానా దేవాలయ భవనం

అభివృద్ధి మార్చు

చిన్న గుడి నుంచి ఆధునిక దేవాలయం వరకు ఏళ్లుగా ఇది అభివృద్ధి చెందింది. దేవాలయానికి విరాళాల రూపంలో డబ్బు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన ఆభరణాలు అందుతాయి.[3] గర్భగృహ ద్వారం, బయటి, పై గోడలు వెండితో తయారు చేయబడ్డాయి. వాటిపై వివిధ పండుగల చిత్రాలు చెక్కబడ్డాయి. ఇండోర్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త దానం చేసిన వజ్రాలతో దేవత కళ్ళు తయారు చేయబడ్డాయి.[4]

మూలాలు మార్చు

  1. Grand gate to welcome devotees to Khajrana Temple soon, 17 November 2014, The Times of India.
  2. 2.0 2.1 "Khajrana Temple". Govt of Madhya Pradesh.
  3. Rs 5.75 cr facelift for Khajrana Ganesh temple, 2 September 2013, DNA India.
  4. जहां बनाया जाता है उल्टा स्वास्तिक, 30 April 2016, Vibrant4travel.

బయటి లింకులు మార్చు