చంద్రశ్రీ, తెలంగాణకు చెందిన దళిత కళాకారిణి, కవయిత్రి.

జననం మార్చు

ఈమె తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలో 1966 ఫిబ్రవరి 23న సరోజిని, జయచంద్ర దంపతులకు జన్మించింది.

విద్య మార్చు

గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలో ప్రాథమిక విద్య, చీరాల మహిళా కళాశాలలో ఇంటర్‌, విఆర్ఎస్ & వైఆర్ఎన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది.

ఉద్యమంలో మార్చు

నెలపొడుపు నాడు పుట్టిందని తల్లిదండ్రులు ఈమెకు ‘చంద్రశ్రీ’ అని పేరు పెట్టారు. చంద్రశ్రీ విద్యార్థి సంఘం నాయకురాలిగా ఎన్నో సమస్యలపై ఉద్యమాలు చేసింది. అనంతరం పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. రైతు కూలీ సంఘం నాయకుడు, చీరాలకు చెందిన ఇరపని శివశంకర్ ను వివాహమాడింది. ఇతను వారి కుమారుడి జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా, ఆమెను ఎంతగానో హింసించడం వలన అతని అహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా చేరి చివరి వరకు ఒంటరి జీవితం గడిపింది. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి సంస్థలో కన్సల్టెంటుగా, సామాజిక కార్యకర్తగా దళిత ఉమెన్ థియేటర్ అద్యక్షురాలిగా అణగారిన వర్గాలలో స్త్రీలకు చివరి వరకు అండగా ఉంది. ‘ఏకలవ్య’ కళామండలి స్థాపించి దళిత, బహుజన రాజకీయ సాంస్కృతిక ఉద్యమ విస్తృతికి కృషి చేసింది. ‘దళిత మహిళా గానం’, ‘అనగనగా ఒక నేను’ 'నల్ల సూరీడు', దళిత ఆత్మకథ (శివసాగర్), ‘అంబేద్కర్‌ సుప్రభాతం’, ఆల్బమ్‌లు వెలువరించింది. సుదీర్ఘ రాగాలతో పౌరాణిక నాటక పద్యాలను హృదయరంజకంగా గానం చేసింది.

గుర్తింపు మార్చు

‘దళిత మహాసభ’ పక్షాన డా.కత్తి పద్మారావు చంద్రశ్రీకి ‘కళారత్న’ బిరుదు ప్రదానం చేశాడు. హైమావతీ భీమన్న నిర్వహించిన ప్రతిష్ఠాత్మక సాహిత్య సదస్సులో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ‘అంబేద్కర్‌ సుప్రభాతం’ ఆల్బమ్‌ను ఆవిష్కరించి చంద్రశ్రీని అభినందించాడు.

మరణం మార్చు

చివరి రోజుల్లో కేన్సర్ తో బాధపడి 7.7.2012 తేదిన చీరాల రామకృష్ణాపురంలో చనిపోయింది.

మూలాలు మార్చు