భారత ఉపఖండంలో జమీందారు (జోమిందారు, జోమిదారు జోమిదారు) ఒక కులీనుడుగా గౌరవం అందుకునేవాడు. ఈ పదానికి పర్షియా భాషలో భూమి యజమాని అని అర్థం. సాధారణంగా వంశపారంపర్యంగా జమీందార్లు అపారమైన భూమిని, వారి రైతుల మీద నియంత్రణను కలిగి ఉన్నారు. వారు సామ్రాజ్య రాజాస్థానం తరపున లేదా సైనిక ప్రయోజనాల కొరకు పన్ను వసూలు చేసే హక్కును కలిగి ఉన్నారు. వారి కుటుంబాలు నామమాత్రంగా ప్రభునామాలు కలిగి ఉన్నాయి.

సర్ నవాబు ఖ్వాజా సలీముల్లా నవాబు బిరుదు కలిగిన జమీందారు. బెంగాలులో ఆయన కుటుంబం భూస్వాములు బ్రిటిషు ఇండియాలో అతిపెద్ద, ధనవంతులలో ఒకరు

19 - 20 శతాబ్దాలలో బ్రిటీషు సామ్రాజ్యవాదం రావడంతో చాలా మంది సంపన్న, ప్రభావవంతమైన జమీందార్లకు మహారాజా, రాజా, నవాబు వంటి రాచరిక, రాజ బిరుదులను ప్రదానం చేశారు. మొఘలు సామ్రాజ్యం సమయంలో జమీందార్లు ప్రభువులుగా ఉన్నారు.[1] వారు పాలకవర్గాన్ని ఏర్పాటు చేశారు. అక్బరు చక్రవర్తి వారికి మన్సాబులు అనే అధికారులను మంజూరు చేశాడు. వారి పూర్వీకుల రాజ్యాలను జాగీర్లుగా పరిగణించారు.[2] భారతదేశంలో బ్రిటీషు వలస పాలనలో శాశ్వత స్థావరం కలిగిన జమీందారీ వ్యవస్థగా పిలువబడింది. బ్రిటిషు వారు వీరిని సహాయక జమీందార్లను యువరాజులుగా గుర్తించి బహుమతి ఇచ్చారు. ఈ ప్రాంతంలోని అనేక రాచరిక రాజ్యాలు వలసరాజ్యానికి పూర్వం జమీందారు సంస్థానాలు అధికంగా రాచరికస్థాయికి పెంచబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ బ్రిటీషు వారు వలసరాజ్యానికి పూర్వం ఉన్న అనేక రాచరిక రాజ్యాలను, భూస్వామ్యవ్యవస్థకు, అధిపతి స్థాయికి తగ్గించారు. వారి స్థితిని గతంలో ఉన్నత రాజాస్థానాల నుండి జమీందారు స్థాయికి తగ్గించారు.

1950 లో భూసంస్కరణలో భాగంగా తూర్పు బెంగాలు (బంగ్లాదేశు)లో,[3] 1951 లో భారతదేశంలో [4] పశ్చిమ పాకిస్తానులో 1959 లో భూ సంస్కరణల సమయంలో ఈ వ్యవస్థ రద్దు చేయబడింది.[5] ఉపఖండంలోని ప్రాంతీయ చరిత్రలలో జమీందార్లు తరచుగా ముఖ్యమైన పాత్ర పోషించారు. భాటి ప్రాంతంలో (బారో-భూయాన్లు) 12 మంది జమీందార్లు ఏర్పాటు చేసిన 16 వ శతాబ్దపు సమాఖ్య చాలా ముఖ్యమైన ఉదాహరణలలో ఒకటిగా ఉంది. ఇది జెస్యూట్లు, రాల్ఫు ఫిచి అభిప్రాయం ఆధారంగా నావికా యుద్ధాల ద్వారా మొఘలు దండయాత్రలను వరుసగా తిప్పికొట్టడంలో ఖ్యాతిని సంపాదించింది. ఈ సమాఖ్యకు జమీందారు-రాజు ఇసా ఖాను నాయకత్వం వహించాడు. ఇందులో ముస్లింలు, ప్రతాపదిత్య వంటి హిందువులను చేర్చారు. జమీందార్లు కూడా కళలకు పోషకులుగా ఉన్నారు. ఠాగూరు కుటుంబానికి చెందిన 1913 లో భారతదేశపు మొట్టమొదటి నోబెలు గ్రహీత రవీంద్రనాథ ఠాగూరు తన సంస్థానంలో ఉండేవాడు. జమీందార్లు నియోక్లాసికలు, ఇండో-సారాసెనికు నిర్మాణాలను కూడా ప్రోత్సహించారు.

మొఘలు శకం మార్చు

 
యువకుడిగా మెహతాబు చందు (సా.శ.1820-79) (బుర్ద్వాను రాజు జమీందారు), సి. సా.శ.1840-45 ఎ.డి.

బాబరు హిందూస్థానును జయించినప్పుడు స్థానికంగా పాలకులు రాయ్, రాజా, రానా, రావు, రావతు మొదలైన బిరుదులతో పిలువబడ్డారు. వివిధ పర్షియా చరిత్రలలో వారిని జమీందార్లు, మార్జాబన్లు అని పేర్కొన్నారు. వారు ఆయా భూభాగాలను పరిపాలించిన సామంతరాజులుగా ఉన్నారు. వారు సామ్రాజ్యం ఆర్థిక వనరులలో గణనీయమైన భాగాన్ని నిర్వహించడం మాత్రమే కాకుండా సైనిక శక్తిని కూడా నిర్వహించారు. హిందుస్తాను ఆక్రమణ తరువాత, బాబరు మొత్తం ఆదాయంలో ఆరవ వంతు ముఖ్యుల భూభాగాల నుండి వచ్చినట్లు తెలియజేయబడింది. వారి రచనలలో ఇలా వ్రాయబడింది: "భీరా నుండి బీహారు వరకు ఇప్పుడు నా దగ్గర (సా.శ. 1528) ఉన్న దేశాల ఆదాయం 52 కోట్లు అని వివరించబడింది. ఇందులో 8 లేదా 9 కోట్లు వడ్లు పరగణాల నుండి, రాజా నుండి వచ్చినవి గతంలో (ఢిల్లీ సుల్తాన్లకు) సమర్పించారు. భత్యం, నిర్వహించబడింది. " [6]

అక్బరు పాలన సమకాలీన చరిత్రకారులలో ఒకరైన ఆరిఫు కంధారి అభిప్రాయం ఆధారంగా బలమైన కోటల నుండి తమ భూభాగాన్ని పరిపాలించిన సుమారు రెండు నుండి మూడు వందల మంది రాజాలు లేదా జమీందార్లు ఉన్నారు. ఈ రాజాలు జమీందారులలో ప్రతి ఒక్కరూ తమ వంశీయులతో కూడిన సైన్యానికి ఆధిపత్యం వహించారు. అబులు ఫజలు చెప్పినట్లుగా వారి దళాల మొత్తం సంఖ్య 3,84,558 అశ్వికదళం, 42,77,057 పదాతిదళాలతో కూడిన 44 లక్షలు; 1863 ఏనుగులు, 4260 తుపాకులు, 4500 పడవలు ఉన్నాయి. [7] మొఘలు యుగంలో రాచరిక రాజ్యాలు జమీందారీ సంస్థానాల మధ్య స్పష్టమైన తేడా లేదు. రాచరిక రాజ్యాల పాలక స్వయంప్రతిపత్తి కలిగిన ముఖ్యులను కూడా జమీందార్లు అంటారు. మధ్యయుగ భారతదేశంలో జమీందార్ల ప్రాముఖ్యత మీద మన దృష్టిని ఆకర్షించిన మొదటి చరిత్రకారులలో మోర్లాండు ఒకరు. అతను జమీందార్లను "సామంత అధిపతులు "గా నిర్వచించాడు. జమీందార్లు లేని మొఘలుల ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న ప్రాంతాలు ఉన్నాయని, ఆపై వారి రాజ్యం మీద స్వయంప్రతిపత్తి కలిగి ఉన్న సామంత అధిపతుల భూభాగాలు ఉన్నాయని, కాని మొఘలులకు లొంగిపోయి మొఘలు చక్రవర్తికి నివాళి / నజరానా చెల్లించారని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఇర్ఫాను హబీబు తన మొఘలు ఇండియా వ్యవసాయ వ్యవస్థలో జమీందార్లను రెండు వర్గాలుగా విభజించారు: తమ భూభాగాలలో "సార్వభౌమ అధికారాన్ని" అనుభవించిన స్వయంప్రతిపత్త ముఖ్యులు, భూమి మీద ఉన్నతమైన హక్కులను వినియోగించుకున్న భూమి ఆదాయాన్ని సేకరించిన సాధారణ జమీందార్లు.[8][9] ఈ ప్రజలను జమీందార్లు (మధ్యవర్తులు) అని పిలుస్తారు.[10] వారు ప్రధానంగా రైతుల నుండి ఆదాయాన్ని సేకరించారు.[11] భారతదేశానికి ఉత్తరాన జమీందారీ వ్యవస్థ ఎక్కువగా ఉంది ఎందుకంటే దక్షిణాదిలో మొఘల ప్రభావం తక్కువగా ఉంది.[10]

నూరులు హసను జమీందార్లను మూడు వర్గాలుగా విభజించారు: (i) స్వయంప్రతిపత్త ముఖ్యులు, (ii) మధ్యవర్తి జమీందార్లు, (iii) ప్రాథమిక జమీందార్లు. ప్రాథమిక, ద్వితీయ జమీందార్లు భూమిలో ఉన్నతమైన హక్కులతో కూడిన భూస్వామ్య తరగతి, కానీ భూమి ఆదాయాన్ని సేకరించడానికి మొఘలు పరిపాలనలో భాగంగా పనిచేసారు. స్వయంప్రతిపత్తి కలిగిన ముఖ్యులు వంశపారంపర్య పాలకులను రాయ్, రాజా, రాణా, రావలు వంటి వివిధ పేర్లతో పిలిచారు.[12][page needed][8]

బ్రిటిషు యుగం మార్చు

మొఘలు యుగంలో జమీందార్లు యజమానులు కాదు. వారు యుద్ధాలకు పాల్పడేవారు, పొరుగున ఉన్న రాజులను దోచుకునేవారు. కాబట్టి వారు తమ భూమి మెరుగుదలలను ఎప్పుడూ చూసుకోలేదు. లార్డు కార్న్‌వాలిసు ఆధ్వర్యంలోని ఈస్టు ఇండియా కంపెనీ దీనిని గ్రహించి 1793 లో జమీందారులతో శాశ్వత పరిష్కారం చేసుకుంది. స్థిర వార్షిక అద్దెకు బదులుగా వారి భూమికి వారిని యజమానులను చేసింది. ఈ శాశ్వత పరిష్కారం ఈ రోజు మనకు తెలిసిన కొత్త జమీందారీ వ్యవస్థను సృష్టించింది. 1857 తరువాత మెజారిటీ జమీందార్ల సైన్యం ఆయా ప్రాతాలలో పోలీసింగు / దిగ్వారి / కొత్వాలి వ్యవస్థకు అవసరమైన తక్కువ సంఖ్యలో దళాలను మినహాయించి రద్దు మిగిలిన సైన్యనిర్వహణ రద్దు చేయబడింది. జమీందార్లు సూర్యాస్తమయం లోపల అద్దె చెల్లించలేకపోతే వారి ఎస్టేట్లలోని భాగాలను స్వాధీనం చేసుకుని వేలం వేస్తారు. ఇది సమాజంలో జమీందార్ల కొత్త తరగతిని సృష్టించింది. మిగిలిన భారతదేశం తరువాత ఇ.ఐ.సి. నియంత్రణలోకి వచ్చినందున పాలక ముఖ్యులను లొంగదీసుకోవడానికి వివిధ ప్రావిన్సులలో వివిధ మార్గాలు అమలు చేయబడ్డాయి.

భారతదేశంలోని బ్రిటీషు వలసవాదులు సాధారణంగా దేశానికి ఉత్తరాన ఉన్న జమీందారీ ఆదాయ సేకరణ పద్ధతిని అవలంబించారు. వారు జమీందార్లను మొఘలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భూస్వాములు, యజమానులుగా గుర్తించారు. దానికి బదులుగా వారు పన్నులు వసూలు చేయవలసి ఉంది. కొంతమంది జమీందార్లు దక్షిణాదిలో ఉన్నప్పటికీ వారు పెద్ద సంఖ్యలో లేరు. బ్రిటీషు నిర్వాహకులు రైతువారీ (సాగు) సేకరణ పద్ధతిని ఉపయోగించారు. ఇందులో కొంతమంది రైతులను భూ యజమానులుగా ఎన్నుకోవడం, వారి పన్నులను నేరుగా చెల్లించాల్సిన అవసరం ఉంది.[10]

బెంగాలు అభివృద్ధిలో బెంగాలు జమీందార్ల ప్రభావం చూపారు. 1857 నాటి భారతీయ తిరుగుబాటు సమయంలో వారు కీలక పాత్ర పోషించారు.[13]

పారామౌంటుకు విధేయులుగా ఉన్న జమీందార్లకు రాచరిక, గొప్ప బిరుదులను ఇచ్చే సంప్రదాయాన్ని బ్రిటిషు వారు కొనసాగించారు. రాచరిక పాలకులకు, ఎప్పటికప్పుడు అనేక మంది జమీందార్లకు రాజా, మహారాజా, రాయ్ సాహెబు, రాయ్ బహదూరు, రావు, నవాబు, ఖాను బహదూరు అనే బిరుదులను ప్రదానం చేశారు. ఇంపీరియలు గెజిటీరు ఆఫ్ ఇండియాలో ఒక అంచనా ఆధారంగా రాజా, మహారాజా వంటి రాజ బిరుదును కలిగి ఉన్న సుమారు 2000 మంది పాలక పెద్దలు ఉన్నారు. ఇందులో రాచరిక రాజ్యాల పాలకులు, అనేక పెద్ద ప్రధాన రాజ్యాలు ఉన్నాయి. ఇతర రాజేతరులు కాని గొప్ప శీర్షికలతో జమీందారు / జాగీర్దారు ముఖ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య పదిరెట్లు పెరుగుతుంది.

అధికారస్వీకరణ మార్చు

స్వయంప్రతిపత్తి లేదా సరిహద్దు ఉన్నతాధికారుల మాదిరిగా కాకుండా జమీందారు తరగతి వంశపారంపర్య స్థితిని మొఘలులు ఉద్ధరించారు. వారసుడు అధికారం పొందడానికి సార్వభౌమాధికారిని ప్రసన్నం చేసుకోవడం మీద కొంతవరకు ఆధారపడ్డాడు.[14] వారసులను సంతతి ద్వారా లేదా మతపరమైన చట్టాల ద్వారా స్వీకరించారు.[15] బ్రిటీషు సామ్రాజ్యం ఆధ్వర్యంలో జమీందార్లు కిరీటానికి అధీనంలో ఉండాలి. వంశపారంపర్య ప్రభువులుగా వ్యవహరించకూడదు. కానీ కొన్ని సమయాల్లో కుటుంబ రాజకీయాలు వారసుని పెద్దల అభిమానపాత్రత మీద ఆధారపడి ఉంటుంది.[16] కొన్ని సమయాలలో బంధువుకు కుటుంబ బంధువులను వారసుడిగా నిర్ణయించవచ్చు.[17] పాలక జమీందారు ఆమెకు వారసురాలిగా పేరు పెడితే చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్య జమీందారిణిగా వారసత్వంగా పొందవచ్చు.[18][19]

రద్దు మార్చు

ఆర్టికలు 19 - 31 లో చూపిన విధంగా ఆస్తి హక్కును సవరించిన భారత రాజ్యాంగంలోని మొదటి సవరణతో జమీందారీ వ్యవస్థ స్వతంత్ర భారతదేశంలో అధికంగా రద్దు చేయబడింది.[20] బంగ్లాదేశులో " తూర్పు బెంగాలు స్టేట్ అక్విజిషన్ అండ్ టేనెన్సీ యాక్ట్ " 1950 లో జమిందారీ వ్యవస్థను అంతం చేయడానికి ఇదే విధమైన ప్రభావాన్ని చూపింది.[21]

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Metcalf, Barbara Daly (1984). Moral conduct and authority: the place of adab in South Asian Islam. University of California Press. p. 269. ISBN 9780520046603.
  2. Acharya, Shreya (30 అక్టోబరు 2011). "Give an account of the Ruling Classes of Mughal Empire". www.preservearticles.com. Archived from the original on 21 మే 2013. Retrieved 11 జనవరి 2020.
  3. Baxter, C (1997). Bangladesh, from a Nation to a State. Westview Press. p. 72. ISBN 0-8133-3632-5.
  4. "Abolition of Zamindari in India - General Knowledge Today". www.gktoday.in. Archived from the original on 30 నవంబరు 2016. Retrieved 11 జనవరి 2020.
  5. Newspaper, From the (11 అక్టోబరు 2010). "Land reforms in Pakistan". dawn.com. Archived from the original on 30 నవంబరు 2016.
  6. Ansari, Tahir Hussain. Mughal Administration and the Zamindars of Bihar (PDF). p. 1. Archived from the original (PDF) on 2 నవంబరు 2018. Retrieved 11 జనవరి 2020.
  7. Fazl, Abul. Ain-i-Akbari (1. Saiyid Ahmad Khan, Delhi, 1856 ed.). p. 120.
  8. 8.0 8.1 Ansari, Tahir Hussain. Mughal Administration and the Zamindars of Bihar (PDF). pp. 3–5. Archived from the original (PDF) on 2 నవంబరు 2018. Retrieved 11 జనవరి 2020.
  9. Hansen, Valerie; Curtis, Kenneth R. "The Politics of Empire in Southern and Eastern Asia". Voyages in World History, Volume 2: Since 1500. p. 461.
  10. 10.0 10.1 10.2 Jaffrelot, Christophe (సెప్టెంబరు–అక్టోబరు 2000). "Sanskritization vs. Ethnicization in India: Changing Indentities and Caste Politics before Mandal". Asian Survey. 40 (5): 756–766. doi:10.1525/as.2000.40.5.01p0100d. JSTOR 3021175.
  11. Habib, Irfan (2000) [1963]. The Agrarian System of Mughal India, 1526-1707 (2nd revised ed.). Oxford University Press. ISBN 0-19-562329-0. For the meanings of zamindar see pp. 140ff.
  12. Khan, Ahsan Raza (1977). Chieftains in the Mughal Empire during the reign of Akbar (in English). Simla.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  13. "Patriotic And Comprador Zamindars In The Great Rebellion Of 1857". pd.cpim.org. Archived from the original on 5 మే 2012. Retrieved 11 జనవరి 2020.
  14. Islam, Sirajul; Akhter, Shirin (2012). "Zamindar". In Islam, Sirajul; Jamal, Ahmed A. (eds.). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.). Asiatic Society of Bangladesh. Archived from the original on 3 జూలై 2015. Retrieved 11 జనవరి 2020.
  15. The Indian Law Reports: Madras series. Controller of Stationery and Print. 1888. p. 385.
  16. McLane, John R. (2002). Land and Local Kingship in Eighteenth-Century Bengal. Cambridge University Press. p. 223. ISBN 978-0-521-52654-8.
  17. Madras High Court Reports: 1870 and 1871. J. Higgingbotham. 1872. p. 209.
  18. Great Britain. Privy Council. Judicial Committee.; India. Courts. (1908). "Kashi Prasad v. Indar Kunwar". Allahabad Law Journal. Indian Press. 5: 596.
  19. Woodman, Joseph Vere; Monnier, Emile Henry (1902). A Digest of Indian Law Cases: Containing High Court Reports, 1862-1900, and Privy Council Reports of Appeals from India, 1836-1900, with an Index of Cases. Vol. III. Superintendent of Government Printing, India. p. 5498.
  20. Guha, Ramachandra (2011). India After Gandhi. Ecco. pp. 219–220. ISBN 978-0-330-54020-9.
  21. State Acquisition and Tenancy Act, 1950 [XXVII of 1951, Section 3]
"https://te.wikipedia.org/w/index.php?title=జమిందారు&oldid=4177132" నుండి వెలికితీశారు