తైమూర్ లంగ్
తైమూర్ లంగ్ లేక తైమూర్ (ఛగ్తాయ్: تیمور - Tēmōr, "ఇనుము") (1336 – ఫిబ్రవరి 19, 1405) . ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్ దగ్గర నున్న కెష్ గ్రామం (ప్రస్తుతము షహ్రీసబ్జ్) లో పుట్టాడు. ఈతడు స్థాపించిన తిమురిద్ రాజ్యమే తదుపరి మొఘల్ సామ్రాజ్యముగా అవతరించింది. ఈతని అసలు పేరు అమీర్ తెమూర్. ఛగతాయ్ భాషలో తెమూర్ అనగా ఇనుము. తురుష్క ప్రభావితమైన మంగోల్ తెగ బర్లాస్ కి చెందినవాడు. తైమూర్ రాజ్యము మధ్య ఆసియాలో పెక్కు దేశములలో విస్తరించింది. ఈతని రాజ్యములో తురుష్క పారశీక సంస్కృతులు మిళితమయ్యాయి. తైమూర్ హిందూదేశములో చేసిన ఆగడాలు చరిత్ర పుటలకెక్కాయి.
తర్మాషిరీన్ ఖాన్ బర్లాస్ | |
---|---|
అమీర్ | |
![]() A Timurid era illustration of Emir Timur | |
Reign | 1370–1405 |
Coronation | 1370, బల్క్ |
Predecessor | అమీర్ హుసేన్ |
Successor | ఖలీల్ సుల్తాన్ |
Born | Kesh, Chagatai Khanate (Now in Uzbekistan) | 1336 ఏప్రిల్ 9
Died | 1405 ఫిబ్రవరి 18 Otrar, Syr Darya (Now in Kazakhstan) | (వయస్సు 68)
Burial | |
Spouse | సారె ముల్క్ ఖానమ్ |
House | Barlas తైమూరిద్ |
Father | Muhammad Taraghai |
Mother | Tekina Mohbegim |
Religion | Islam |
తైమూర్లంగ్ | |
---|---|
తైమూరిద్ సామ్రాజ్యపు అమీర్ | |
షహ్రీసబ్జ్, ఉజ్బెకిస్తాన్ లో తైమూర్ విగ్రహం | |
రాజకుటుంబము | తైమూరిద్ |
ఇతడు చంగేజ్ ఖాన్ లాగా ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. అనేక దండయాత్రలు చేపట్టాడు. అనేక రక్తపాతాలు సృష్టించాడు. ఐరోపా, భారత్, చైనా, అరబ్బు రాజ్యాలపై దండయాత్రలు సాగించాడు.
భారతదేశ దండయాత్రసవరించు
భారతదేశంపై దండెత్తిన సమయాన ఢిల్లీ పై తుగ్లక్ వంశం పరిపాలించేది. చరిత్రలో ప్రసిద్ధికెక్కిన రక్త పిపాసి, హిందూ ద్వేషి, మత ఛాందసుడు. తైమూర్ తన ఆత్మకథలో హిందువులను వధించి, వారి సంపదలను కొల్లగొట్టి, ఆవిధముగా అల్లాకు ప్రీతిపాత్రుడవ్వాలని వ్రాసుకున్నాడు. ఢిల్లీలో చిట్టచివరి తుగ్లకు సుల్తాను నసీరుద్దీను మహమ్మదు బలహీనుడు. ఢిల్లీ సుల్తాను హిందువులను ఆదరించుతాడనే సాకు దొరికింది. అదే అదనుగా 1398లో తైమూర్ హిందూదేశముపై దండెత్తాడు[1].
తైమూర్ హిందూదేశము చేరకముందే అతని మనుమడు పీర్ మహమ్మదు సింధూనది దాటి ముల్తాను ముట్టడి చేశాడు. క్రీ. శ. 1398 ఏప్రిల్ లో తైమూర్ సమర్కండ్ నుండి బయల్దేరి కాబూల్-కాశ్మీరదేశము మధ్య గల కాటోర్ అను చోట ప్రజానీకాన్ని (సియాపోషు తెగ) ఊచకోతకోసి వారిపుర్రెలను గుట్టలుగా పోయించాడు. సమీపములోని కొండరాతిపై తానుచేసిన నరసంహారపు వివరాలు వ్రాయించాడు. సెప్టెంబరు 24న అట్టాక్ వద్ద సింధూ నది దాటాడు. పీర్ మహమ్మదు ముల్తానును జయించి తాతను కలిశాడు. తైమూర్ ధూల్ చంద్ అనే హిందూరాజు పాలిస్తున్న భట్నీర్ పై దాడిచేశాడు. రాజపుత్రులు వీరోచితముగా పోరాడారు. చివరకు రాజు, మిగిలిన సైనికులు, పిల్లలు, స్త్రీలు కోటలోపలికిపోయి తలుపులుబంధించారు. తైమూర్ తలుపులు బద్దలుకొట్టించి ఒక్క గంటలో 10,000మందిని నరికి, ఇస్లాము కత్తిని నెత్తురులో కడిగాడు (తైమూర్ మాటలలో). అచటనుండి సర్సుతి (సరస్వతి?) నగరానికి తరలి అక్కడనున్న హిందువులందరినీచంపాడు. కొన్నివేలమంది పిల్లలను, స్త్రీలను బంధించి ఇస్లాము మతానికి మార్చాడు.
తైమూర్ తరువాత లక్ష్యం జాట్ తెగవారు. అడవులలోనున్న జాట్ లను వెదికి వేలమందిని చంపించాడు. పిల్లలను, స్త్రీలను మహమ్మదీయులను చేశాడు. పిమ్మట పానిపట్ మీదుగా ఢిల్లీ చేరాడు. ఊరిబయట డేరావేసి అశ్వికులకు కనబడ్డ ప్రతిమనిషినీ చంపమని అదేశించాడు. వారు ఊళ్ళన్నీ లూటీ చేసి, వేలాదిని నరసంహారము చేసి ఢిల్లీలోని జహనుమా భవంతి దగ్గరకు చేరారు. మరుసటి దినము తైమూర్ యమున దాటి లోని నగరం ప్రవేశించాడు. అచటి రాజపుత్రులందరూ పిల్లలను, స్త్రీలనూ ఇళ్ళతో బాటు అగ్నికాహుతి చేసి, తైమూర్ సేనతో తలబడి వీరమరణం పొందారు. తైమూర్ కోట స్వాధీనము చేసుకొని ముస్లిములను వేరు చేసి మిగిలిన హిందువులందరి తలలునరికించాడు. ఆ సమయములో సుల్తాను మహమ్మద్ మల్లును తోడ్కొని తైమూర్ సేనలను జహనుమా వద్ద ఎదుర్కొన్నాడు ( 1398 డిసెంబరు 12). తైమూర్ సేన గెలిచింది. సుల్తాను పారిపోయాడు.
నరమేధంసవరించు
చరిత్రపుటలకెన్నిన మహా దారుణ మారణకాండ, మానవునిలోని అమానుష పైశాచిక ప్రవృత్తికి గీటురాయి అనదగిన సంఘటన ఢిల్లీ నగరం చవిచూసింది. నగరంలో 100,000 హిందువులున్నారు. తైమూర్ వారందరినీ వేరుచేసి ఒక్కరోజులో అందరినీ ఊచకోతకోయించాడు. స్త్రీలు, పిల్లలతో బాటు వారివారి ఇళ్ళలో అగ్నిప్రవేశము చేశారు. ఢిల్లీ రహదారులపై నెత్తురు వెల్లువలై పారింది. హిందువుల ఆస్తిపాస్తులు లూటీచేశారు. ఇదంతయూ 15,000 తుర్క్ సైనికుల దుష్కృత్యము. జీవితములో "పావురాయికి కూడ హాని తలపెట్టని" మౌలానా నసీరుద్దీన్ ఉమర్ అను ఇస్లాం పండితుడు కూడా తైమూర్ ఆదేశముపై 15,000 మంది హిందువులను చంపాడు. మరుసటిదినముకూడ (శనివారము) మారణకాండ కొనసాగింది. ప్రతి సైనికుడు వందలమంది బానిసలను సంపాదించాడు. లెక్కలేనంత ధనము, బంగారము, రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు, ఆభరణాలు, ముత్యాలు, వెండి బంగారు పాత్రలు, హిందూస్త్రీల పట్టువస్త్రాలు మొదలగు చెప్పనలవిగానంత సంపద కొల్లగొట్టబడింది. సయ్యదులు, ఉలేమాలు మొదలగు మహమ్మదీయులు నివసించు ప్రాంతము తప్ప నగరమంతయూ సర్వనాశముగావించబడింది. తైమూర్ తన ఆత్మకథలో ఇలా వ్రాశాడు: "ఇదంతయూ అల్లా ఆజ్ఞ ప్రకారము జరిగింది. మూడు నగరంల నాశనానికి నేను కారకుడను కాను"[2].
తిరుగు బాటసవరించు
1399 జనవరి 1న తైమూర్ ఉత్తరదిశగా గంగా, యమునల తీరాననున్న హిందువులను మట్టుపెట్టుటకు తరలాడు. తరువాత జరిగినదంతయూ మరలా ఉటంకించనవసరము లేదు. టూకీగా: మగవారిని చంపుట, పిల్లలను, స్త్రీలను బానిసలు చేసి మతము మార్చుట, స్త్రీలపై అకృత్యములు చేయుట, సంపద లూటీ చేయుట. ఇదొక బాణీ.
పల్లెప్రాంతములు నాశనము చేస్తూ శివాలిక్ పర్వతములు చేరాడు. అచట పశ్చిమదిశగా తిరిగి నాగర్ కోట్, జమ్ము లను నేలమట్టము చేశాదు. సింధూనదీ వైపుగా తరలి 1399 మార్చి 19న నది దాటాడు. తిరిగిపోవు సమయమున (మార్చి 6) ఖిజిర్ ఖానును ముల్తాను, లాహోరు, దీపాల్పూర్ లకు అధిపతిగా నియమించాడు.
ఉపసంహారముసవరించు
చరిత్రకారుల ప్రకారము హిందూదేశ చరిత్రలో ఏ ఒక్కదండయాత్రలోను ఒక్కసారిగా ఇంత ప్రాణహాని, ధననష్టము, దుష్కృత్యాలు జరగలేదు[3]. తైమూర్ నిష్క్రమణ తర్వాత ఢిల్లీ దాదాపు మృతనగరమయ్యింది. ఉత్తరభారతమంతయు అరాచకము కొనసాగింది. కరవు కాటకాలు ఎక్కువయ్యాయి. మిగిలిన ప్రజలందరూ రోగాలకు గురైయ్యారు. తుగ్లక్ సుల్తానుల పాలన అంతమైంది.
చిత్రాలుసవరించు
Timurid Mosque in Herat.
Goharshad Mosque, Timurid architecture
Green Mosque (Balkh) is a Timurid mosque that inspired Shah Jahan.
Mausoleum of Khoja Ahmed Yasawi, a prime example of Timurid architecture.
మూలాలుసవరించు
- ↑ History of Delhi Sultanate, M. H. Syed, 2005, Anmol Publications, New Delhi, pp.149-156
- ↑ Malfúzát-i Tímúrí, or Túzak-i Tímúrí: The Autobiography or Memoirs of Emperor Tímúr, Volume III: To the Year A.D. 1398, Chapter: XVIII, Page 389; http://www.infinityfoundation.com/mandala/h_es/h_es_malfuzat_frameset.htm
- ↑ The History of India, as Told by Its Own Historians. The Muhammadan Period; Sir H. M. Elliot, Edited by J. Dawson, 1867, Trubner Company,London