దొడ్డపనేని ఇందిర

రాజకీయవేత్త, మంత్రివర్యులు

డి.ఇందిర గా ప్రసిద్ధిచెందిన దొడ్డపనేని ఇందిర (ఆంగ్లం: Doddapaneni Indira) (జనవరి 7, 1937 - సెప్టెంబర్ 16, 1987) మహిళా నాయకురాలు.ఆంధ్రపదేశ్ రాష్ట్ర శాసన సభ్యురాలు. గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసారు,

దొడ్డపనేని ఇందిర
జననందొడ్డపనేని ఇందిర
జనవరి 7, 1937
మరణంసెప్టెంబర్ 16, 1987
ఇతర పేర్లుడి.ఇందిర
ప్రసిద్ధిప్రముఖ రాజకీయవేత్త, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు
భార్య / భర్తదొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్
పిల్లలువీరి కుమార్తె గోగినేని ఉమ
తండ్రిఆలపాటి వెంకటరామయ్య
తల్లిసామ్రాజ్యమ్మ

జననం మార్చు

దొడ్డపనేని ఇందిర గారు మాజీ మంత్రి ఆలపాటి వెంకటరామయ్య, సామ్రాజ్యమ్మల కుమార్తె. ఈమె జనవరి 7వ తేదీన తెనాలి సమీపంలో యడ్లపల్లి గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత చెన్నైలో బి.ఎస్.సి. (హోం సైన్స్) లో డిగ్రీ తీసుకున్నారు. 1955 జనవరి 7వ తేదీన ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్ గారిని వివాహమాడారు.

తండ్రి మరణంతో ఏర్పడిన లోటును భర్తీ చేయడానికి కామరాజ్ నాడార్, నీలం సంజీవరెడ్డి గార్ల ప్రోత్సాహంతో ఈమె రాజకీయ ప్రవేశం చేశారు.

రాజకీయ జీవితం మార్చు

దొడ్డపనేని ఇందిర గారు తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు (1967, 1972, 1978) ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. ఇందులో మొదటిసారి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా, రెండవసారి ఇండిపెండెంటుగా, మూడవసారి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి నెగ్గడం విశేషం. నాలుగవసారి 1983లో 1985లో తెలుదేశం అభ్యర్ది అన్నాబత్తుని సత్యనారాయణపై పోటీచేసి ఓడిపోయారు.

1987లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికలలో గుంటూరు జిల్లా పరిషత్ కు తొలి మహిళా అధ్యక్షురాలిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు.

మరణం మార్చు

దొడ్డపనేని ఇందిర గారు 1987 సెప్టెంబర్ 16వ తేదీన పరమపదించారు.

వీరి కుమార్తె గోగినేని ఉమ తిరిగి తెనాలి శాసనసభ నియోజకవర్గం నుండి 1999 సంవత్సరంలో ఎన్నిక కావడం విశేషం.

మూలాలు మార్చు