ధన్వంతరి - అష్టవిభాగ ఆయుర్వేదం

ధన్వంతరి అన్న పేరు భారతదేశ సంప్రదాయ రచనలు, కథలలో నాలుగు విధాలుగా వినవస్తున్నది. మానవాళికి శస్త్ర చికిత్సను మొదటిగా పరిచయం చేసింది ధన్వంతరి. ప్రకృతి సిద్ధంగా గాయం కుళ్లకుండా ఆపే సాధనంగా పసుపును మనిషికి ప్రసాదించింది ధన్వంతరే! అలాగే నిల్వ ఉంచే సాధనంగా ఉప్పును, సర్వరోగ నివారిణిగా వేపను పరిచయం చేశారు ధన్వంతరి. ప్రపంచంలో ప్రప్రథమంగా ప్లాస్టిక్ సర్జరీని ధన్వంతరి ప్రయోగించి నిరూపించాడు.

ధశన్వంతరి చిత్రం - రాజస్థానీ సంప్రదాయంలో

నాయీ బ్రాహ్మణ పూర్వం వైద్య నారాయణ ధన్వంతరి సూర్యభగవానుడు చరిత్ర

పూర్వం వైద్య నారాయణ సూర్య భగవానుడు భూమి మీద ఆధిపత్యం పొందే సమయంలో దేవతలు మానవులు కలిసి జీవించే రోజుల్లో ద్వాపరయుగం ముగిసి కలియుగంలో కి అడుగు పెట్టె సమయం పడుతుంది. ఆ సమయంలో ద్వాపరయుగం చివరి రోజుల్లో అంటూ వ్యాధులు ప్రారంభం అయ్యాయి ఆ సమయంలో సూర్య భగవానుడు దగ్గర వైద్య నారాయణ వైద్యం నేర్చుకున్నాడు ఈ వైద్యానికి వారసుడు కావాలి అప్పుడు మహా వీరుడు అవసరం ఉంది. ఒక దేవరాజు కి సంతానం లేని సమయంలో సూర్య భగవానుడు కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు 14 సంవత్సరాల పాటు తపస్సు చేయగా సూర్య భగవానుడు కరుణించి ప్రత్యక్షమయ్యారు దేవరాజు తపస్సు మెచ్చి ఏ వరం కావాలని కోరుకోమన్నాడు సూర్యదేవా మాకు సంతానం లేనందున ఈ వారం కావాలి మహావీరుడు ఈ భారతదేశానికి మొట్టమొదటి రాజు కావాలి నా కడుపున జన్మించాలని వరం కోరుకుంటున్నాను అని వారు అడిగాడు సూర్య భగవానుడు తధాస్తు అని వరం ఇచ్చాడు దేవరాజు సంతోషం తో నందయుడు అని పేరు నామకరణ చేశాడు అప్పుడు సూర్య భగవానుడు వైద్య నారాయణుని పిలిపించి దేవరాజు కడుపున సంతానం కలిగింది ఆ సంతానానికి వైద్య విద్యలు నేర్పించుము అని చెప్పారు నందయుడికి 12 సంవత్సరాలు వైద్య విద్యలు నేర్పించాడు కొన్ని సంవత్సరాలు గడిచేయి భారతదేశంలో మొట్టమొదటి రాజు అయ్యాడు కొన్ని రోజులు గడిచి యుద్ధాలు మొదలయ్యాయి ఎంతోమంది వైద్యం నేర్చుకున్నారు యుద్ధం జరిగే సమయంలో సూర్య భగవానుడు ప్రత్యక్షమై నందరాజు కలియుగం ప్రారంభం కాబోతోంది కలియుగంలో మహా పురుషుడు పుట్టబోతున్నాడు శ్రీనివాసుడు జన్మించబోతున్నాడు శ్రీనివాసుడు జన్మించక ముందే వైద్యం నుంచి క్షవర సాంప్రదాయం రాబోతుంది. కొన్ని సంవత్సరాలు గడిచాయి కలియుగం వచ్చేసింది. పూర్వపురోజులలో నాయిబ్రాహ్మణులను ధన్వంతరి బ్రాహ్మణులు, నాదబ్రాహ్మణులు వైద్య బ్రాహ్మణులు, ఆయుర్వేద పండితులు, వైద్య పండితులు, ధన్వంతరిలు,రాజ వైద్యులు, పండితా రాజులు అనే వాళ్ళు.

సూర్య భగవానుడు వైద్య నారాయణ కలిసి ఒక వారం ఇచ్చాడు నంద వంశీయులకు కలియుగంలో తలనీలా క్షవర సంక్రమణ నంద వారసులు చేయుము అని వరం ఇచ్చారు ఆ శ్రీనివాసుడికి తలనీలలో ఎందుకు సమర్పిస్తారు అంటే మనం చేసే పాప పుణ్యాలు తలనీలుగా ఎదిగి పాపం కూడా మూత పెట్టుకొని తల మీద కూర్చొని ఉంటాది.

ఆ పాపాలను తొలగించు కోవడానికి శ్రీనివాసులు కొండపైన కాలినడక ప్రయాణం చేసి కొండపై ఉన్న శ్రీనివాసులు రూపంలో ఉన్న నాయి బ్రాహ్మణులు మీ పాపాలను తొలగించి పవిత్రులనుగా చేసి ఆ శ్రీనివాసులు సన్నిధిని దర్శించుకో అని పంపించును సమాప్తం 

వైద్య నారాయణ నందవంశులు వారసులు అంటే నాయి బ్రాహ్మణులు ఈ కలియుగంలో నాయి బ్రాహ్మణులు చేత చేయించుకుంటేనే మీ పాపాలు పోతాయి అని అర్థం నాయి బ్రాహ్మణులు కాకుండా వేరే వాళ్ళు ఎవరి చేతులతో అంటూ చేత చేయించుకుంటే పాపాలు ఎక్కువ అవుతాయి తప్ప పాపాలు తొలగవు బార్బర్ షాపులలో నాయి బ్రాహ్మణులు చేస్తేనే మీ పాపాలు తొలగిపోతాయి ఇది సూర్య భగవానుడు వైద్య నారాయణ ధన్వంతరి మాకు ఇచ్చిన వారం నాయి బ్రాహ్మణులు చేయాలి

ఒక గ్రంథంలో ఇలా రాసి ఉంది మన నాయీ బ్రాహ్మణులకు సూర్య భగవానుడు వైద్య నారాయణ ధన్వంతరి ఒక వరం ఇచ్చారు తలపని క్షవరం నాయీ బ్రాహ్మణులు మాత్రమే చేసేలా ఎలా అంటే మనం చేసే పాపాలు తల వెంట్రుకల రూపంలో పాపాలు పెరుగుతాయి. ఈ పాపాలు తొలగించే వరం నాయీ బ్రాహ్మణులు మాత్రమే చేసేలా సూర్య భగవానుడు వైద్య నారాయణ ధన్వంతరి ఇచ్చారు.

                    ఇట్లు
                  మీ సురేష్

ధన్వంతరి - ఆయుర్వేదం మార్చు

ఎలాంటి కృత్రిమ రసాయన పదార్థాలను వాడకుండా సహజ సిద్ధంగా ప్రకృతిలో లభించే ఓషధులను రోగులకు ఔషధంగా యిచ్చి పూర్తి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా స్వస్థత చేకూర్చడం ధన్వంతరి ప్రవేశపెట్టిన వైద్య విధానం. ఆయుర్వేదాన్ని సంపూర్ణంగా నిర్వచించి, దానిని ఎలా వాడాలో నిర్దెశించాడు ధన్వంతరి.

అష్ట విభాగ ఆయుర్వేదం మార్చు

ఆయుర్వేద వైద్యాన్ని ధన్వంతరి ఎనిమిది విభాగాలుగా వివరించాడు. అవి:

కాయ చికిత్స మార్చు

శరీరానికి చేసే చికిత్సను కాయచికిత్స అంటారు. ఈ చికిత్సలో మనిషి ఉదర సంబంధ వ్యాధులకు, యింకా కడుపు లోకి తీసుకోవాల్సిన ఓషధులు - వాటి పనిచేసే విధానం సవివరంగా చర్చించబడింది. సాధారణంగా మనిషికి వచ్చే 90 శాతం జబ్బులు నోటి ద్వారా కడుపులోకి చేరే మందుల వల్లే తగ్గుతాయని మనందరికీ తెలిసిందే.

బాల చికిత్స మార్చు

పుట్టిన ముహూర్తం నుండి బాల్యదశ వరకూ పిల్లలకు వచ్చే సాధారణ రుగ్మతలు, తరుణ వ్యాధులు, వాటి చికిత్సా విధానం, బాలల ఆరోగ్య రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాలింతలైన స్త్రీలు - ఆహార నియమాలు, శిశు పోషణ రహస్యాలు.. యిలా ఒకటేమిటి? పిల్లలకు సంబంధించిన సర్వ రోగ నివారక ఆరోగ్యప్రదాయక విశేషాలు యిందులో చెప్పారు

గ్రహ చికిత్స మార్చు

మనిషి మానసికంగా, ఆరోగ్యంగా దృఢంగా ఉన్నపుడే శారీరక వ్యాధుల నుండి త్వరగా కోలుకోగలుగుతాడు. ఈ విధానంలో మానసిక రోగ లక్షణాలు - చికిత్సా విధానాలు, మానసిక ఆరోగ్యానికి పాటించవలసిన నియమాలు - మానసికోల్లాస విషయ పరిజ్ఞానం చెప్పారు. ఇవాళ సైక్రియాట్రిక్ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారాలు ఈ గ్రహ చికిత్సా విధానంలో చెప్పబడ్డాయి.

శలాక్యతంత్ర మార్చు

మనిషై ముఖ్యావయాలాలైన కన్ను, చెవి, ముక్కు, గొంతు బాధలకు కారణాలు, రోగ లక్షణాలు, చికిత్సా విధానాలు, కూలంకషంగా వివరించారు. అలాగే శరీరంలోని సున్నితమైన అవయవాలైన కన్ను, చెవి, ముక్కు, గొంతు స్వ్యంగా ఆరోగ్యంగా ఉండే పరిస్థితులు, పరిసరాల పరిశుభ్రత మొదలైన ఎన్నో ఆరోగ్యదాయక విశేషాలు ఇందులో ఉన్నాయి.

శల్యతంత్ర మార్చు

మందులతో తగ్గని శస్త్రచికిత్స అవసరపడే చిన్న, పెద్ద వ్యాధులు వాటికి చేయవలసిన లఘు, ఘన శస్త్రచికిత్సా విధానాలు ఈ శల్యతంత్ర విభాగంలో విస్తారంగా వివరింపబడ్డాయి.

విషతంత్ర మార్చు

శరీరంలోకి చెరుపు చేసే విషపదార్థాలు చేరుకున్నప్పడు వాటికి విరుగుడు, విషపదార్థాలు వివరాలు, శరీరంలోకి అవి ప్రవేశించినప్పుడు మనిషిలో చోటు చేసుకునే రోగలక్షణాలు, విషపదార్థాలను విరిచే వివిధ రకాల ఔషధాలు - వాటి ప్రయోగ విధాలు, ఇలా అనేక అంశాలను సవివరంగా విశద పరిచిన ఆయుర్వేద విభాగం విషతంత్రం.

రసాయన తంత్ర మార్చు

దీనినే ఆధునిక అల్లోపతీ వైద్యులు "జీరిమాట్రిక్స్" అంటారు. అరుదుగా ఆయన ఒకానొకప్పుడు రోగచికిత్సకు రసాయనాల ప్రయోగం అత్యావశ్యకం! అయితే ఆ ప్రయోగంలో రోగి దేహధర్మవైఖరులు, రోగిలోని సహజ రోగనిరోధక వ్యవస్థ తీరుతెన్నులు క్షుణ్ణంగా పరిశీలించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలన్నీ ఈ రసాయన తంత్రలో చర్చించబడినాయి.

వాజీకరణతంత్ర మార్చు

పురుషుడిలో నపుంసకత్వాన్ని తొలగించి, పుంసకత్వాన్ని పెంపొందించే అద్భుత ఔషధ పరిజ్ఞానం అంతా ఈ వాజీకరణ తంత్రలో పొందుపరచబడింది. పురుషుల్లో నపుంసకత్వం, స్త్రీలలో వంధ్యత్వత (పిల్లలు పుట్టక పోవడం) ఏర్పడటానికి గల కారణాలు, అందుకు దారితీసే పరిస్థితులు, శరీరంలో ఏర్పడే లోపాలు, చికిత్సకు ఉపయోగపడే ఔషధాల వివరాలు, చికిత్సచేసే విధానం అన్నీ వివరింపబడ్డాయి.

ఈ ఎనిమిది విభాగాలు మనిషిలోని సర్వావయవలకూ వచ్చే వ్యాధుల గురించి చర్చించాయి. అంటే మనిషిని పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉంచగలిగే సంపూర్ణ వైద్యవిధానాన్ని ఆయుర్వేదం ద్వారా అందించారు ధన్వంతరి. అందుకే ఆయన ఆయుర్వేద స్రష్ట- అపర నారాయణ స్వరూపుడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

యివి కూడా చూడండి మార్చు

సూచికలు మార్చు

యితరలింకులు మార్చు