ధర్మారం (బి) (డిచ్‌పల్లి)

నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి మండలం, బర్దీపూర్ రెవెన్యూ గ్రామనికి చెందిన శివారు గ్రామం
(ధర్మారం, డిచ్‌పల్లి మండలం నుండి దారిమార్పు చెందింది)

ధర్మారం (బి), నిజామాబాదు జిల్లా, డిచ్‌పల్లి మండలం, బర్దీపూర్ రెవెన్యూ గ్రామానికి చెందిన శివారు గ్రామం.ఈ గ్రామానికి గ్రామ పంచాయితీ పరిపాలానా వ్యవస్థ ఉంది. ఇది నిజామాబాదుకు 8 కి.మీ. దూరంలో,నిజామాబాదు నుండి హైదరాబాదు వెళ్ళే దారిలో ఉంది. వైశాల్యంలో పెద్ద గ్రామం.మేజరు గ్రామపంచాయతీ. రెవెన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని ధర్మారం (బి) అంటారు.ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడ్డారు.ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయికతో ఉంటుంది. ఈ గ్రామం గుండా నిజాంసాగర్ కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ, ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో నిజామాబాద్ జిల్లాలోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.పిన్ కోడ్:503230., ఎస్.టి.డి కోడ్:08462.

గ్రామ ప్రముఖులు మార్చు

  • మండవ వెంకటేశ్వరరావు:మాజీ మంత్రి, ప్రస్తుత నిజామాబాదు గ్రామీణ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యులు
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో ఈదర కస్తూరి, సర్పంచిగా, ఉప సర్పంచిగా ఎడెల్లి సోమనాధ్ ఎన్నికైయ్యారు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు