నెల్లూరు చేపల పులుసు

నెల్లూరు చేపల పులుసు ఒక వంటకం. ఇది చేపల పులుసు అయినప్పటికీ నెల్లూరు చేపల పులుసు పేరుతో ప్రసిద్ధమైనది.[1] ఇది రంగు, రుచి, వాసనలు పెట్టింది పేరు అని ప్రసిద్ధి చెందినది. ఇది మామిడి కాయలనుపయోగించి తయారుచేస్తారు. ఈ కూర కోసం మనకు నచ్చిన ఏ రకం చేపలైనా ఉపయోగించవచ్చు. కానీ మామిడికాయ మాత్రం పచ్చిగా పుల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. మామూలు చేపల కూర కోసం మనం సుమారుగా ఒక 50 గ్రాములు చింతపండు తీసుకుంటే, ఈ కూరకి ఒక 30 గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుంది.మిగిలిన పులుపు మామిడికాయ నుంచి వస్తుంది.[2]

నెల్లూరు చేపల పులుసు చేయుటకు కావల్సిన వస్తువులు[3] మార్చు

  1. కొరమీను చేపలు.....................................1 కె.జి
  2. చింతపండు...........................................200 గ్రా.
  3. మిరప పొడి......................................... 100 గ్రా..
  4. పసుపు పొడి...................................... 1.5 టి స్పూను
  5. ఉప్పు............................................ ...తగినంత
  6. ఆవాలు............................................. 1 స్పూను
  7. మెంతులు...........................................1 స్పూను
  8. వుల్లిపాయలు...................................... 2 పెద్దవి
  9. దనియాలు, జీలకర్ర............................... 1 స్పూను
  10. నూనె............................................... 50 గ్రా.
  11. కర్రివేపాకు......................................... కొద్దిగా.
  12. టమెటాలు........................................ .2 పెద్దవి
  13. పచ్చి మిరపకాయలు ............................ .3
  14. మామిడి కాయ.................................... .1 పెద్దది
  15. మిరియాలు......................................... కొద్దిగా
  16. వెల్లుల్లి............................................. 5 రెబ్బలు

చేసె విధానము[4] మార్చు

  • చేపలను శుభ్రం చేసుకొని, ముక్కలు చేసుకొని, ప్రక్కన పెట్టుకోవాలి.
  • చింత పండును తగినంత నీటిలో నాన బెట్టుకొని, బాగా పిండి రసము తీయాలి. దానికి మిరప పొడి, పసుపు పొడి, ఉప్పు, కలిపి చిక్కటి పులుసును సిద్ధం చేసుకొవాలి.
  • స్టౌ మీద బాణలి పెట్టి నూనె లేకుండా అందులో మెంతులు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెసి మంచి సువాసన వచ్చే వరకు వేయించి, దానిని, మెత్తని పొడిగా కొట్టి పెట్టుకోవాలి.
  • మరలా బాణలి పెట్టి నూనెను పొసి బాగా కాగనిచ్చి, అందులో ఆవాలు, పొడుగ్గా తరిగిన పచ్చి మిరపకాయలు, కర్రివేపాకు, వుల్లిపాయలు, టమోటాలు, వేసి బాగా వేగనిచ్చి ఆందులో ముందుగా కలిపి పెట్టుకొన్న పులుసు పొసి, మామిడి ముక్కలు వేసి బాగా తెర్ల నివ్వాలి, పులుసు తెర్లెటపుడు, ముందుగా పొడి చెసిపెట్టుకొన్న మసాలపొడిని వేసి బాగా కలపాలి.
  • ఆ తరువాత చేపముక్కలను వేసి బాగా వుడక నివ్వాలి, ముక్కలు వుడికిన తరువాత, వెల్లుల్లి వేసి కాసేపు వుంచి, దించేయాలి.
  • దీనిని చల్లారిన తరువాత తిన్నచో చేప ముక్కలలోకి పులుసు ఇంకి రుచిగా వుంటుంది.

మూలాలు మార్చు

  1. "Spicy Nellore Chepala Pulusu - Fish Lovers Cannot Miss This!! - KostaLife". KostaLife. 2016-05-31. Archived from the original on 2018-02-01. Retrieved 2018-01-23.
  2. "Nellore Chepala Pulusu recipe in Telugu - నెల్లూరు చేపల పులుసు తయారీ విధానం | Maatamanti". Maatamanti. 2017-04-24. Archived from the original on 2018-05-02. Retrieved 2018-01-23.
  3. "Nellore Fish Curry - How to make Andhra Mango fish Curry - Foodvedam". Foodvedam. 2017-04-24. Retrieved 2018-01-23.
  4. "Spicy Nellore Chepala Pulusu, Chepala Pulusu - Andhra Fish Curry". Kannamma Cooks. 2015-04-12. Retrieved 2018-01-23.

ఇతర లింకులు మార్చు