పెనుకొండ నగరపంచాయితీ
పెనుకొండ నగర పంచాయతీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాకు చెందింది.ఈ నగర పంచాయతీ హిందూపురం లోక్సభ నియోజకవర్గం లోని పెనుకొండ శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.
పెనుకొండ | |
స్థాపన | 2022 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | నగర పంచాయతీ |
చరిత్ర మార్చు
పెనుకొండ నగర పంచాయతీ అనేది శ్రీ సత్యసాయి జిల్లాకి చెందినది. జిల్లాలో మొత్తం మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. ఈ నగర పంచాయతీని 2020లో ఏర్పాటు చేశారు. 20 వార్డులు కలిగి ఉంది. ఈ నగర పంచాయతీలో 20,409 మంది ఓటర్లు ఉన్నారు.[1].
పౌర పరిపాలన మార్చు
ఈ నగర పంచాయతి కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. నగర పంచాయతీ పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
మూలాలు మార్చు
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-07-17. Retrieved 2022-12-25.