నాస్తికధూమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
=== పురాణవైర గ్రంథమాల ===
[[పురాణవైర గ్రంథమాల]] శీర్షికన విశ్వనాథ సత్యనారాయణ రాసిన నవలల్లో '''నాస్తికధూమము''' రెండవది. భారతీయులకు చరిత్ర రచనా దృష్టి లేదని, పూర్వరాజుల పరంపర అడిగితే పుక్కిటి పురాణాలు చెప్తారని ఆంగ్లవిద్య ప్రారంభమయిన తరవాత భారత చరిత్రను రచన చేసిన పలువురు అభిప్రాయపడ్డారు. సుమారు వెయ్యేళ్ల క్రితమే, అల్ బీరూనీ (Abu al-Biruni) వంటి పండితుడే, “దురదృష్టవశాత్తు భారతీయులు చారిత్రక గతిక్రమాన్ని పట్టించుకోరు. వారి రాజుల వంశపరంపరలు నమోదు చేసుకోవడంలో వారికి ఒకరకమైన నిర్లక్ష్యభావం ఉంది. ఖచ్చితమైన సమాచారం కోసం నిలదీస్తే ఏం చెప్పాలో తెలియక కథలు కల్పించి చెప్తారు” అన్నాడు. ఇదేమాట, ఏ మార్పులు లేకుండా, వలసపాలన నాటి రచయితలు కూడా పదే పదే ఉటంకించడం మూలాన ఈనాటికీ ఒక సత్యంగా స్థిరపడిపోయింది. <ref>http://eemaata.com/em/issues/201301/2040.html</ref><br />
ఈ నేపథ్యంలో పురాణాల చారిత్రికతను తిరస్కరించిన చరిత్ర రచనా ధోరణిని విశ్వనాథ వారు పురాణవైరంగా పేర్కొన్నారు. భగవంతుని మీది పగ పుస్తకంలో [[పురాణవైర గ్రంథమాల]] '''ఉపోద్ఘాతం'''లో ఈ నవలామాలిక లక్ష్యాలను పేర్కొంటూ ''ఆ లెక్క(పాశ్చాత్య చరిత్ర కారుల లెక్క) ప్రకారము కలి ప్రవేశము మొదలు- సంయుక్తా పృథ్వీరాజుల కథ దనుక, పాశ్చాత్యులు తారుమారు చేసిరి. ఆ కాలము, అనగా సుమారు మూడువేల యేండ్ల కాలము, మహమ్మదు గోరీ వచ్చువరకు మన చరిత్రలో పాశ్చాత్యులు చేసిన అవక తవకలు కాదని నవలల రూపమున నిరూపించుటకు చేసెడి ప్రయత్న మిది. అందుచేత దీనికి '''పురాణవైరము''' అని శీర్షిక ఏర్పరుపబడినది.'' అన్నారు విశ్వనాథ సత్యనారాయణ.<ref>'''భగవంతుని మీది పగ''' నవలలో '''పురాణవైర గ్రంథమాల'''కు విశ్వనాథ సత్యనారాయణ రాసిన ''ఉపోద్ఘాతము''</ref>
 
== ఇతివృత్తం ==
"https://te.wikipedia.org/wiki/నాస్తికధూమము" నుండి వెలికితీశారు