అంగీరస మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity<!--Wikipedia:WikiProject Hindu mythology-->
{{వికీకరణ}}
| type = Hindu
అంగిరో మహర్షి
| Image =
| Caption =
| Name = అంగిరో మహర్షి
| Devanagari = अंगिरो महर्षि
| Sanskrit_Transliteration =
| Affiliation = హిందూ ఋషులు
| God_of =
| Abode =
| Mantra =
| Consort =
}}
 
శ్రీహరి బొడ్డునుండి బ్రహ్మ జన్మించాడు.ఈ బ్రహ్మ కుమారుడు అంగిరసుడు తండ్రి ఆదేశానుసారం తపస్సు ప్రారంభించాడు.అంగిరసుడు దివ్వ తేజోసంపన్నుడు తపశ్శక్తిచే ఇంకను తేజస్సు సంపాదించాడు.అంగిరసునకు సర్వశక్తులు లభించాయి.అయినా నిగర్విగానే సంచరిస్తున్నాడు.అతడు లబ్ధుడు కాదు,సర్వసంగ పరిత్యాగి.త్యాగమును సంతోఫ మున్నదని గ్రహించాడు.<ref>[http://www.sacred-texts.com/tantra/maha/maha00.htm అంగిరసుడుInhabitants కర్దమof ప్రజాపతిthe కుమార్తెయగుWorlds] శ్రద్ధనుMahanirvana వివాహంTantra, చేసికొన్నాడుtranslated by Arthur Avalon, ([[John Woodroffe|Sir John Woodroffe]]), 1913, Introduction and Preface.శ్రద్ధా అంగిరసులనుThe దేవతాగణాలుRishi ఆశీర్వదించాయిare seers who know, and by their knowledge are the makers of shastra and "see" all mantras.అత్తమామల ఆశీస్సులుThe గొనిword comes నూతనదంపతులుfrom తమthe ఆశ్రమమునకుroot వెళ్ళిపోయారుrish Rishati-prapnoti sarvvang mantrang jnanena pashyati sangsaraparangva, etc.ప్రశాంతంగా గృహస్ధThe seven great Rishi or saptarshi of the first manvantara are Marichi, Atri, Angiras, Pulaha, Kratu, Pulastya, and Vashishtha. In other manvantara there are other ''sapta-rshi''. In the present manvantara the seven are '''Kashyapa''', Atri, Vashishtha, Vishvamitra, Gautama, Jamadagni, Bharadvaja. To the Rishi the Vedas were revealed. Vyasa taught the Rigveda so revealed to Paila, the Yajurveda to Vaishampayana, the Samaveda to Jaimini, Atharvaveda to Samantu, and Itihasa and Purana to Suta. The three chief classes of Rishi are the Brah-marshi, born of the mind of Brahma, the Devarshi of lower rank, and Rajarshi or Kings who became Rishis through their knowledge and austerities, such as Janaka, Ritaparna, etc. Thc Shrutarshi are makers of Shastras, as Sushruta. The Kandarshi are of the Karmakanda, such జీవితముas గడుపుతున్నారుJaimini.</ref>
==జీవిత విశేషాలు==
ఆ అంగిరసుడు కర్దమ ప్రజాపతి కుమార్తెయగు శ్రద్ధను వివాహం చేసికొన్నాడు.శ్రద్ధా అంగిరసులను దేవతాగణాలు ఆశీర్వదించాయి.అత్తమామల ఆశీస్సులు గొని ఈ నూతనదంపతులు తమ ఆశ్రమమునకు వెళ్ళిపోయారు.ప్రశాంతంగా గృహస్ధ జీవితము గడుపుతున్నారు. కాలక్రమాన ఆ దంపతులు ఏడుగురు కుమారులను ఏడుగురు కుమార్తెలను కన్నారు.వారివల్ల అంగిరసుని వంశము పెరిగి విశ్వమంతము ప్రాకినది.దేవతలపై అగ్నిహోత్రుడు కోపించి తన విద్యుక్త ధర్మములు నిర్వర్తింపక రహస్యముగ ఏకాంత వాసం చేయసాగాడు.ఈ విషయమును దేవతలు భ్రక్ష్మ్మీకు తెలయజేయగా లంగిరసుని పిలిపించి అగ్నిహోత్రుని విధులను నిర్వహించమని ఆదేశించాడు.తండ్రి ఆజ్ఞను శిరసావహించి అంగిరసుడు అగ్నిదేవుని విధులు నిర్వర్తిస్తున్నాడు.అగ్ని లేని లోపం తీరుస్తున్నాడు.అగ్నిదేవుని మరచి అంగిరసుని పూజిస్తున్నారు.దేవతా గణాలు ఆ విసయం అగ్నిహోత్రునకు తెలియగా తనకు నామరూపాలుండవని గ్రహించి అంగిరసుని వద్దకు వచ్చి తన పనులు తానే నిర్వహించగలనని పలికాడు.అంగిరుడు అంగీకరించి అగ్నిహోత్రునే ఆ విధులు నిర్వర్తించమన్నాడు.అగ్ని సంతసించి అంగీరసునకు ద్వితీయాగ్ని స్ధానమిచ్చి సత్కరించాడు.అంతే కాదు అంగిరసుని కుమారుడగు బృహసృతికి తృతేయాగ్ని స్దానం ఏర్పరిచాడు.అది అంగిరసుని ఘనతకు నిదర్శనం.
పూర్వకాలమున చిత్రకేతుడను రాజు గలడు.అతడు శూరసేన దేశమును పాలించుచుండెను.సర్వసంపదలు గల ఆ రాజుకు సంతానము లేదు.సంతానహీనుడైన ఆ రాజు శాంతిలేక జీవిస్తున్నాడు.ఒకనాడు అంగిరసుడు ఆ రాజు సందర్శనార్ధం వచ్చాడు.చిత్రకేతుడు ఆ మహర్షిని ఆదర్శపూర్వకంగా ఆహ్వానించాడు.భార్యవహితుడై సేవించాడు.మహర్షి సంతసించి రాజు సంతానహీనుడని గ్రహించి పుత్రకామేష్టి చేయించి పట్టమహిషియగు కృతద్యుతి గర్భం దాల్చునట్లు చేశాడు.రాజు పరమానందభరితుడై అయాడు.మాసములు నిండగా ఆమె ఒక కుమారుని కన్నది కాని తక్కిన రాణులు ఈర్ష్యతో ఆ బిడ్డకు విషమిచ్చి చంపారు.రాజు దు:ఖము పెరిగింది.ఆ దంపతులు బిడ్డ మరణానికి దు:ఖించ సాగారు.
ఆ విషయము అంగిరసునకు తెలిసింది.ఆయన నారద మహర్షి వెంటబెట్టుకుని చిత్రకేతుని వద్దకు వాచ్చడు.పుత్రశోకంతో కుమిలిపోయే ఆ రాజదంపతులను సమీపించి చావు పుట్టకలు జీవికి సహజమని అందుకై విచారింపరాదని ధైర్యం చెప్పి తత్వభోద చేశాడు.అనంతరం రాజు వద్ద సెలవు తీసికొని తిన్నగా బ్రహ్మలోకం చేరుకున్నాడు. అంగిరసుడు ఒకప్పుడు కశ్యపమహర్షి వలన పుణ్యక్షేత్రముల మహిమ నెరిగి గౌతమమహర్షి వలన వాటి ప్రభావమును తెలిసికొని వరుసగా చంద్రభాగ,హిరణ్యబిందు,ఇంద్రతోయ,కరతోయ,అపాంహ్రదము,మహాశ్రయ,భృగుతుంగ,కన్యాకూప,సుందరికాహ్రద,వైమానిక,విపాశ,కాళాకాశ్రమము,ద్రోణశర్మ పదము, శరస్తంభము, దేవరారువనము, చిత్రకూటము, జన్మస్ధానము,శ్యామాశ్రము, కౌశికవాల,మతంగ వాపిక, నైమికము, ఉత్పలావనము, వైవస్వతి, లౌహిత్య, రామహ్రదము, మహాహ్రాద, నర్మద, జంబూనది, కోకాముఖ, కండులికాశ్రమము, కుల్య, ఆర్షి సేవశ్రమము,ధర్మారణ్యము, బ్రహ్మసరస్సు మొదలైన పుణ్యక్షేత్రములు తిరిగి వాటిని గురించి గౌతములను తెలిపి అంగిరసుడు ఆనందించాడు.
==సప్తర్షి పత్నులకు శాపం==
ఒకప్పుడు అగ్నిసప్తర్షి పత్నులను మోహించాడు.ఆ విషయం అంగిరసుడు గ్రహించి అగ్నిని,సప్తర్షి పత్నులను శపించాడు.అగ్నిని సర్వభక్షకుడవు కమ్మని,సప్తర్షిపత్నులను
బ్రాహ్మణుల యింట సౌందర్యవతులై జన్మించమని శపించాడు.శౌనకుడు అంగిరసుని వద్దకు వచ్చి బ్రహ్మ విద్యను బోధించమని కోరగా అంగిరసుడు సవివరముగా ఉపదేశిచాడు.ఈ విషయములు ముండకోపనిషత్తునందు ప్రతిపాదింపడ్డాయి.
అంగిరసుడు స్మతికర్తకారులో ఒకడుగా పరగణింపబడ్డాడు.ఆయన బోధించిన ధర్మవిషయాలు''అంగిరస స్మృతి''యను పేర ప్రసిద్ధికెక్కినది.అంగిరసుని మహర్షులందరు స్తుతించారు.అంగిరసులు అధర్వణ వేదద్రష్టలు.వారు ధర్మ పూర్ణమాన యజ్ఞమును చేసి స్వర్గమునందినారు.వారి యజ్ఞఫలమును భూలోకకాసులకు ధారపోసారు.అంగిరసులు దేవతాతుల్యులు,ఆదిత్యులు.అంగిరసులకు భూమిని దానం చేశారు.బ్రహ్మసృష్టిలో మొదటివారు అంగిరసులు.వారు రాజులకు,పురోహితులుగా ఉండెడివారు.ఉపనిషత్తులలో అంగిరసుల ప్రస్థాపన గలదు.ఆత్మ అవినాశియని అంగిరసులు తెలియజేశారు.ఓంకారమును గురించి వివరించి చెప్పినవారు అంగిరసులే.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
"https://te.wikipedia.org/wiki/అంగీరస_మహర్షి" నుండి వెలికితీశారు