ఆకాశవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ప్రారంభం నుండి ఇప్పటి వరకు అకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం వారు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు అనేకం. శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీత కార్యక్రమాలు, ఉపన్యాసాలు, చర్చలు, గోష్టులు, పరిచయాలు, ఇంటర్వ్యూలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, గ్రామస్థులకు, స్త్రీలకు, పిల్లలకూ, విద్యార్థులకు, కార్మికులకు, యువతరానికి, కవులకూ, రచయితలకూ - అంతేకాకుండా నాటికలు, నాటకాలు, రూపకాలు, మీరుకోరిన సినిమా పాటలు, శబ్దచిత్రాలు, సినిమా నటీనటులు, దర్శకులు, నిర్మాతలు. సాంకేతికపుణుల ఇంటర్వ్యూలు, పరిచయాలు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి.
=== వార్తలు ===
1939 అక్టోబర్ 1 నాడే ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు మొదలయ్యాయి. అనంతరం ప్రారంభమయిన హైదారాబాద్, విజయవాడ కేంద్రాల వార్తా విభాగాలే నేడు తెలుగు వార్తా ప్రసారాలు చేస్తున్నాయి. ప్రాంతీయవార్తలే కాక తెలుగు వార్తాబులెటిన్లు కూడా ప్రస్తుతం హైదారాబాద్ కేంద్రం నుంచే ప్రసారమవుతున్నాయి. ఢిల్లీ నుంచి వార్తలు చదివిన తొలితరం వారిలో శ్రీశ్రీ, కొంగర జగ్గయ్య వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. కపిల కాశీపతి, శ్రీవాస్తవ, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, పన్యాల రంగనాథరావు, వనమాలి ప్రసాద్, కందుకూరి సూర్యనారాయణ, తిరుమలశెట్టి శ్రీరాములు, ఏడిద గోపాలరావు, మల్లాది రామారావు, దుగ్గిరాల పూర్ణయ్య, అద్దంకి మన్నార్, పి.ఎస్.ఆర్.ఆంజనేయశాస్త్రి, సురమౌళి, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, జోళిపాలెం మంగమ్మ, డి.వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, కొప్పుల సుబ్బారావు, ప్రయాగ రామకృష్ణ తదితరులు వార్తలు వినిపించడంలో సుప్రసిద్ధులు.
 
=== లలిత సంగీతం ===
"https://te.wikipedia.org/wiki/ఆకాశవాణి" నుండి వెలికితీశారు