శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''శ్యామశాస్త్రి''' ( ఏప్రిల్ 26 , 1762 - ఫిబ్రవరి 06 , 1827 ) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విధ్వాంసులు మరియు వాగ్గేయకారులు.
==బాల్యం==
{{కర్ణాటక సంగీతం}}
ఈయన అసలు పేరు "వేంకట సుబ్రహ్మణ్యము". ఈయన [[తంజావూరు]] జిల్లాలోని [[తిరువారూరు]] గ్రామంలో [[ఏప్రిల్ 26]] , [[1762]] న కృత్తికా నక్షత్రమున విశ్వనాధ అయ్యరు గారికి జన్మించిరి. వీరిని తల్లిదండ్రులు "శ్యామకృష్ణా" యని ముద్దుగా పిలిచేవారు. అదే ఈయన కృతుల లో ఈయన ముద్ర అయినది. ఈయన బంగారు [[కామాక్షి]] ఉపాసకుడు. అమ్మపై తప్ప వేరొకరి పై రచనలు చేయలేదు. ఈయన కలగడ, మాంజి, చింతామణి మొదలగు అపూర్వ రాగములను కల్పించాడు. [[త్యాగరాజు|త్యాగరాజా]]దులచే కొనియాడబడిన ఈయన లయజ్ఞానము శ్లాఘనీయమైనది. [[ఆనంద భైరవి]] రాగమన్న ఈయనకు చాల యిష్టమని చెప్తారు. ఆంధ్ర గీర్వాణ భాషా కోవిదుడై ఈయన కృతులలో ముఖ్యమైనవి: ఓ జగదంబా, హిమాచలతనయ, మరి వేరే గతి యెవ్వరమ్మా, హిమాద్రిసుతే పాహిమాం, శంకరి శంకురు, సరోజదళనేత్రి, పాలించు కామాక్షి, కామాక్షీ ([[స్వరజతి]]), కనకశైలవిహారిణి, దేవీ బ్రోవ సమయమిదే, దురుసుగా, నన్ను బ్రోవు లలిత, మొదలగునవి. ప్రఖ్యాత వాగ్గేయకారుడైన [[సుబ్బరాయశాస్త్రి]] ఈయన కుమారుడే.
 
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు