అబిద్ హసన్ సఫ్రాని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కొత్త పేజీ: 'జైహింద్' అనే నినాదం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంత గానో ఉత్తే... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'జైహింద్' అనే నినాదం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎంత గానో ఉత్తేజపరిచింది. ఈ నినాదాన్ని మొదటగా మేజర్ అబిద్ హసన్ సఫ్రాని గారు నినదించారు. ఈయన హైదరాబాదుకు చెందినవ్యక్తి.
==బాల్యం - కుటుంబం==
అబిద్ హసన్ హైదరాబాద్ నగరంలో ఒక ఉన్నత కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి ఫక్రున్నీసా బేగం. ఆమెకు సరోజినీ నాయుడు సాంగత్యంలో దేశభక్తికై ఉద్యమించడం అలవాటు ఐంది.విదేశి వస్త్రాలను పరశురామ ప్రీతి చేసిన హైదరాబాద్ మొదటి మహిళగా నాయకుల, ప్రజల గౌరవం ఆమె పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రు, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మా జాన్' అని పిలిచేవారు. ఆమె ముగ్గురు కుమారులూ ఉన్నత విద్యావంతులే. దేసభాక్తులే. నగరంలోని మతశక్తుల నుండి తప్పించుకోవడంలో వారెన్నో అపాయాలను గురైనారు. సోదరులలో జ్యేష్టుడైన బడరుల్ హసన్ 1925 సంవత్సరంలో గాంధీజీ నడిపిన 'యంగ్ ఇండియా' పత్రికను ఎడిట్ చేసారు.
|