అబిద్ హసన్ సఫ్రాని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
==బాల్యం - కుటుంబం==
అబిద్ హసన్ హైదరాబాద్ నగరంలో ఒక ఉన్నత కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించారు. ఆయన తల్లి ఫక్రున్నీసా బేగం. ఆమెకు సరోజినీ నాయుడు సాంగత్యంలో దేశభక్తికై ఉద్యమించడం అలవాటు ఐంది.విదేశి వస్త్రాలను పరశురామ ప్రీతి చేసిన హైదరాబాద్ మొదటి మహిళగా నాయకుల, ప్రజల గౌరవం ఆమె పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రు, ఆజాద్ మొదలైన అగ్రనాయకులు ఆమెను 'అమ్మా జాన్' అని పిలిచేవారు. ఆమె ముగ్గురు కుమారులూ ఉన్నత విద్యావంతులే. దేసభాక్తులే. నగరంలోని మతశక్తుల నుండి తప్పించుకోవడంలో వారెన్నో అపాయాలను గురైనారు. సోదరులలో జ్యేష్టుడైన బడరుల్ హసన్ 1925 సంవత్సరంలో గాంధీజీ నడిపిన 'యంగ్ ఇండియా' పత్రికను ఎడిట్ చేసారు.
==చదువు==
కేంబ్రిడ్జ్ సీనియరు పరీక్షలో ఉత్తీర్ణుడైన అబిద్ హసన్ 1931లో సబర్మతి ఆశ్రమం చేరుకొని దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించారు. సఫ్రాని అప్పటి స్వాతంత్రోద్యమ విషయాలపై మాట్లాడుతూ 'హిందువులకే గాంధీజీ ఆశ్రమం అంకితం కారాదు. సర్వమత సామాన్యాయ ప్రార్ధనలుండాలి' అని సూచించారు. ఆ తరువాత ప్రార్ధనలలో మార్పు వచ్చింది. 'రఘుపతి రాఘవ రాజారాం - ఈశ్వర్ - అల్లా తెరేనాం' అనే ప్రార్ధనా గీతాన్ని రూపొందించారు. అబిద్ హసన్ జైలు నుంచి విడుదల కాగానే జర్మని వెళ్లి ఇంజనీరింగ్ చదువుకున్నారు. విద్య సమాప్తమవుతున్న దశలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమయింది. అక్కడే పరిచయం ఐన మేజర్ స్వామితో అక్కడే ఉండిపోవలసి వచ్చింది. అబిద్ హసన్ జర్మని, ఫ్రెంచ్, ఇంగ్లీష్, అరబిక్, సంస్కృతం, పర్షియన్, హిందీ, ఉర్దూ, తెలుగులలో నిష్ణాతుడు.
"https://te.wikipedia.org/wiki/అబిద్_హసన్_సఫ్రాని" నుండి వెలికితీశారు