మంగంపేట (ఓబులవారిపల్లె): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
* ఈ గ్రామం రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత నాణ్యవంతమైన ముగ్గురాయి నిక్షేపాలున్న గ్రామం ఇది. స్వాతంత్ర్యానికి పూర్వం అగ్రహారంగా ఉన్న ఈ వూరు, 1954 లో ఖనిజాన్ని కనుగొన్న తరువాత పంచాయతీగా రూపొందింది. ఆ తరువాత కాలక్రమేణా పారిశ్రామికవాడగా అభివృద్ధి చెందుచున్నది. రోజుకు ఒకటిన్నర కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మంగంపేట పరిధిలోనే ఉన్నది. [1]
* ఈ గ్రామపరిధిలోని కొత్తమంగంపేటలోని ఆరవ వీధిలో నూతనంగా నిర్మించిన రామాలయాన్ని, 8 సెప్టెంబరు, 2013న ప్రారంభించారు. [2]
* మంగంపేట గ్రామంలో 2014,ఫిబ్రవరి-15 శనివారంనాడు, శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునహ్ ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్ధం, చిట్వేలి-మంగపేట దారిన వెళ్తుఇన్నప్పుడు, శ్రీ ఖడ్గతిక్కన ప్రతిష్ఠించినట్లు చెప్పబడుతున్న ఈ ఆలయం శిధిలావస్తకు చేరుకున్నది. తాజాగా గ్రామస్తులు పునరుద్ధరించి, "నీరుంపల్లి ఆంజనేయస్వామి" గా పునహ్ ప్రతిష్ఠ చేశారు. ఆఖరిరోజు మంగళవాయిద్యాలు, వేదమంత్రాలతో స్వామివారికి గణపతి పూజ, ఇతర ప్రత్యేకపూజలు జరిపారు. అనంతరం భక్తులందరికీ తీర్ధప్రసాదాలు అందజేశారు. 17 ఉదయం ధ్వజస్థంభం ఏర్పాటు, నాగప్రతిష్ఠ నిర్వహిస్తారు. [3]
*
 
 
[1] ఈనాడు కడప జులై 25, 2013. 8వ పేజీ.
[2] ఈనాడు కడప సెప్టెంబరు 8, 2013. నాల్గవ4వ పేజీ.
[3] ఈనాడు కడప; 2014,ఫిబ్రవరి-16; 4వ పేజీ.