పానగల్: కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
పంక్తి 16:
పానగల్ గ్రామానికి చాలా పురాతనపు కథ ఒకటి ప్రచారంలో ఉంది. బాలా నాగమ్మను మాయల పకీర్ అపహరించి ఈ గ్రామంలో ఉన్న కొండ పై ఉంచి దాచినట్టు ఇక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు. పానగల్ గ్రామానికి అనుకొని బండపల్లి గ్రామం ఉంది. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి, వేరుసెనగలు ఎక్కువగ పండిస్తారు. కొల్లాపూర్ కి వెళ్ళే మార్గంలో ఉంది కాబట్టి బస్సు సౌకార్యం ఉంది.
rajakiya nayakulu ekkuvaga dochukuntunna anni vanarula jilla nedu abivridi leka ela undi
 
పాన్‌గల్ ఖిల్లా
 
ఈవారం డిస్కవరీనేత్రం దృష్టిసారించిన ప్రాంతం.. పాన్‌గల్! పాలమూరుజిల్లాలో కొలువైన ఈ ఖిల్లా పేరువినగానే గుర్తుకొచ్చేవి గట్లు!దానిమీదుగా నిత్యం ప్రయాణించే బాటసారులకు అదో సాధారణ గుట్ట మాత్రమే! అందుకే దాని ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం ఆ చుట్టుపక్కలవాళ్లక్కూడా తెలియదు! ఆ గట్ల వెనకాలే ఉన్న బాలపీర్లను దర్శించుకునే ప్రజలు సైతం... ఈ ఖిల్లాను దర్శించుకున్న దాఖలాల్లేవ్!
ఇది కొంచెం ఆశ్చర్యమే! కళ్లముందు కనిపిస్తూనే కడుపులో బోలెడంత చారివూతక రహస్యాన్ని దాచుకున్న బర్లగట్టు ఉరఫ్ ఖిల్లాగట్టు ఉరఫ్ పాన్‌గల్ గట్టు గుట్టువిప్పే కథనం ఇది....
 
చుట్టూ నాలుగు పెద్ద దుర్గాలు... ఆ దుర్గాల మధ్య మైదానం.. నవాబులు నివసించడానికి ఏర్పాటు చేసుకున్న కోటలు... ఇక్కడ విస్తరించిన పచ్చిక, పెద్దపెద్ద చెట్లు, గుట్టలు, కాలుష్యం లేకుండా వీచే చల్లని గాలి సందర్శకులను ఆహ్లాద పరుస్తాయి. గుట్టపైకి ఎక్కి చూస్తే నలుదిక్కులా ఊర్లు అగుపిస్తాయి. పాములా పాకిపోతున్నట్లు రహదారుల ఆకారం గోచరిస్తుంది. గుండాల్లోని చల్లనినీరు దాహార్తిని తీర్చడమే కాదు స్వస్థతనూ చేకూరుస్తుంది. కారణం అందులో వనకమూలికలుండడం! తీర్థయావూతపూందుకు కాళ్లకు కాసింత పనిచెప్పి ఇక్కడికి వస్తే మనసు కుదుటపడుతుందనే అనుభూతి కలుగుతుంది.
kota
చారివూతక సంపద
ఒకప్పుడు ఇక్కడ యుద్ధాలు జరిగాయి అనడానికి ఆధారాలుగా పెద్దపెద్ద ఫిరంగులున్నాయి... శిల్పసంపద... పూజించుకునేందుకు దేవుళ్లు... శిథిలావస్థలో ఉన్న ఉయ్యాల, కోటలు... ఇవన్నీ గతవైభవ దీప్తులే! మిగిలిన చారివూతక సంపదలే! చనిపోయిన వారిని ఖననం చేసిన స్మశానం కూడా నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నది. చనిపోయిన వారిని వరుసగా ఖననం చేసినట్లు ఇక్కడున్న ఆనవాళ్లను చూస్తే అర్థమవుతుంది. ముండ్లగవిని అనే ప్రధానద్వారం ఈనాటికీ దర్జాగా నిలబడి ఉన్నది. ఈ కట్టడానికి పెద్దపెద్ద బండరాళ్లనుపయోగించారు. దీని గోడలపై సింహం, గజ, లత శిల్పాకృతులున్నాయి! ఇలాంటి అమూల్యమైన సంపదనంతా తన గర్భంలో దాచుకున్న ఈ ఖిల్లా సముద్రమట్టానికి 1800 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది!
శిలా శాసనాలు
ఈ ఖిల్లాపై తెలుగు, కన్నడ, కొంత ఉర్దూ లిపిలో ఓ శిలా శాసనం లభ్యమైంది. అయితే ఇది శిథిలమై చదవడానికి అనువుగా లేదు. ఆ శాసనంపై ఉన్న ఆధారాలతో అది భైరాన్‌ఖాన్ మూడో శాసనమని మాత్రం అవగతమవుతున్నది. దీన్ని చిన్నమంత్రి అనే రచయిత చెక్కినట్లు తెలుస్తున్నది. ‘‘స్వస్తీశ్రీ జయభ్యుదయ శాలివాహన వర్షంబులు 1540 అగుననేడి చాంద్రమాన రౌద్రినామ మహామండలేశ్వర సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్‌షా వారి సుబేదారుడు భైరాన్‌ఖాన్ ముక్తి పానుగంటి బాలల్లా మీద బురుజు కట్టించి ఈ సుభాకొండలోని కుమ్మరివీధిలో నడ బావిని తవ్వించి రాతి కట్టడంతోపాటు సున్నపుగచ్చు వేయించి ఆ చంద్రార్కరము నిలుచునట్లు ప్రతిష్ఠ చేసె’నని ఆ శాసన సారాంశం.
fire
ఇక్కడి శిల్పాలపై ఏనుగు, నెమళ్ల చిత్రాలు చెక్కి ఉన్నాయి. క్రీ.శ 1604లో రాజమాత నివసించేందుకు వీలుగా భవంతిని నిర్మించినట్లు తెలుస్తున్నది. 1786లో నైజాం వంశీయులైన నిజాంఆలీఖాన్ బహదూర్ కోటలో కొంత కాలం నివసించినట్లు తెలుస్తున్నది. అలంపూర్, జటవూపోలు, నందివడ్డెమాన్, కోయిలకొండ, ఖిల్లా ఘనపురం కేంద్రాలుగా పాలన జరిగినప్పుడు ఇక్కడ నవాబులు కూడా వైభవంగా పాలించారు.
రామగుండం
ఖిల్లాలో పడమటి దిశగా ఒక పుష్కరిణి ఉన్నది. దాన్ని రామగుండం అంటారు. ఇప్పటికీ ఆ పుష్కరిణిలో నీటిమట్టం ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉంటుంది. ఆ పక్కన ఓ చిన్నగుడిలో సీతమ్మ, రాముల వారి పాదాలను చెక్కారు. ఈ ఖిల్లాలో సీతమ్మ గుండం కూడా ఉన్నది. ఇక్కడ కూడా నీటిమట్టం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ ఏకాదశినాడు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు వచ్చి రామగుండంలో స్నానాలు ఆచరించి సీతమ్మ పాదాలకు మొక్కులు చెల్లించుకుంటారు.
యుద్ధాలు
ఇక్కడ రెండు సార్లు యుద్ధాలు జరిగినట్లు చారివూతక ఆధారాలు చెప్తున్నాయి. 13వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్, కులీకుతుబ్‌షా విజయనగర సేనలను ఓడించారని పలువురు చెబుతారు. మరోసారి క్రీ.శ. 1417లో గోల్కొండ పరిపాలకుడు ఫిరోజ్‌షా ఓడిపోయినట్లు ‘ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం’ అనే గ్రంథంలో ఉన్నది. ఇక్కడ ఉన్న పది బురుజులపై ఫిరంగులు ఏర్పాటు చేయగా కొన్ని శిథిలం అయ్యాయి. ప్రస్తుతం నాలుగు ఫిరంగులు మాత్రమే కనిపిస్తాయి. ఈ ఖిల్లాపై లభించిన చిన్న ఫిరంగులను నాగర్‌కర్నూలు, గోపాల్‌పేట, వనపర్తి, పాన్‌గల్ పోలీస్‌స్టేషన్లలో ఉంచారు.
stone
గుప్తనిధుల కోసం తవ్వకాలు
రాజుల పాలనలో దాచి ఉంచిన నగలు, బంగారం, వజ్రాలు దొరుకుతాయనే అత్యాశతో ఖిల్లాపై ఉన్న కట్టడాలను కొందరు నిరంతరం తవ్వుతూనే ఉన్నారు. దీంతో శిల్పాలు, విలువైన కట్టడాలు శిథిలమయ్యాయి. పడమటి వైపున ఓ ఫిరంగిని అలాగే కిందికి తోసేసినట్లు కనిపిస్తున్నది. చుట్టుపక్కల పండే వేరుశనగపై దాడి చేసే పందులు, ఎలుగుబంట్లు ఇక్కడ ఆవాసం ఏర్పర్చుకున్న గుర్తులు ఉన్నాయి. ఆ మధ్య కాలంలో పేరెన్నికగన్న పాన్‌గల్ మియ్యాసావ్ తన దోపిడీకి ఈ ఖిల్లానే వేదికగా చేసుకున్నాడు.
పరిరక్షిస్తే..
పాన్‌గల్ ఖిల్లాపై ఉన్న చారివూతక సంపదను పరిరక్షించి, పచ్చదనాన్ని కాపాడి, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నది. కాని 1997లో అప్పటి జిల్లా కలెక్టర్ పి. కృష్ణయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. పురావస్తు, పర్యాటక, అటవీ శాఖలు ఈ ఖిల్లాపై దృష్టి నిలిపినట్లు కనిపించదు. ప్రభుత్వం నిధులు కేటాయించి ఈ గట్టును అభివృద్ధి చేస్తే బాగుంటుందనే భావన స్థానికుల్లో బలంగా ఉన్నది.
water
 
వెళ్లొచ్చు ఇలా...
మహబూబ్‌నగర్‌కు 80 కిలోమీటర్ల దూరంలో, వనపర్తి, కొల్లాపూర్ దారిలో ఈ పాన్‌గల్ ఖిల్లా ఉన్నది. ఇక్కడికి వెళ్లడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. పాన్‌గల్‌లోని ప్రతి ఇంటి నుంచి కూడా ఈ ఖిల్లా కనిపిస్తుంది. తగిన ఏర్పాట్లతో పైకి ఎక్కాల్సి ఉంటుంది. తెలిసిన వారు వెంటరావడం తప్పనిసరి. ఇక్కడ సంచరించే అడవి జంతువుల పట్ల జాగ్రత్త వహించాలి.
అలువాల తిరుపతయ్య
 
==బార్హా షరిఫ్ దర్గా==
"https://te.wikipedia.org/wiki/పానగల్" నుండి వెలికితీశారు