జి. వి. సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం''' సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు.
== వ్యక్తిగత జీవితం ==
==బాల్యం==
[[ప్రకాశం జిల్లా]] ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, సరస్వతమ్మలకు [[1935]] , [[సెప్టెంబర్ 10]] న జన్మించారు. రాఘవయ్య గారు సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు. ఆయన తల్లిదండ్రులు దానధర్మాలు చేసి దాతలుగా పేరుపొందారు. మేనమామ శనగల రామదాసు కుమార్తె, సంగీత విద్వాంసురాలు సుశీలను 1950 మే 18న వివాహం చేసుకున్నారు. పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నతోద్యోగాలను పొందారు.
 
== విద్యాభ్యాసం, వృత్తి ==
జి.వి.సుబ్రహ్మణ్యం [[పర్చూరు]] గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు. నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. డిగ్రీలో ఉండగానే బిరుదు వెంకటశేషయ్య వద్ద అలంకారశాస్త్ర విషయాలను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎంఫిల్ చదివిన జి.వి.సుబ్రహ్మణ్యం విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచారు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచినవారికి ఉద్యోగం కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు. 1975 నుంచి 1995 వరకు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్ గా, ఆచార్యునిగా, 1995 నుంచి 1998 వరకు అతిథి ఆచార్యునిగా, 1998 నుంచి 2000 వరకు యు.జి.సి.ఎమెటరస్ స్కాలర్ గా పనిచేశారు. 1979లో ''ప్రథమాంధ్ర మహాపురాణము - ప్రబంధ కథామూలము'' అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.
"https://te.wikipedia.org/wiki/జి._వి._సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు