బ్రహ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
||
పంక్తి 11:
తొల్లి కల్పావసానమున సమస్తము జలార్ణవము అయి అంతట అంధకారబంధురముగ ఉండువేళ ఆజలమధ్యమున శ్రీమన్నారాయణమూర్తి వటపత్రశాయియై యోగనిద్రను తేలుచు ఉండి వరాహరూపమును ఒంది తన దంష్ట్రాగ్రమున భూమిని జలమునందుండి పైకి ఎత్తి నిలుపఁగా ఇతఁడు ఆపంకజోదరుఁడు అగు నారాయణుని గర్భమున ప్రవేశించి అందు ఉండు బ్రహ్మాండముల తత్వమును ఎఱిఁగి ఆదేవుని నాభికమలమునందుండి వెడలివచ్చి జగత్సృష్టి ఒనర్ప ఆరంభించెను. కనుక ఇతనికి పంకజభవుఁడు అను నామము కలిగెను.
ఇతఁడు [[చతుర్ముఖుఁడు]]. తొలుత ఇతనికి అయిదు ముఖములు ఉండెను. ఒక కాలమునందు [[త్రిమూర్తులు]] కొలువుతీరి ఉండఁగా అచ్చటికి పార్వతీదేవి వచ్చి పంచముఖులు అగు శివబ్రహ్మలు ఇరువురిని చూచి ఇతఁడు శివుఁడు ఇతఁడు బ్రహ్మ అని తెలిసికోలేక పిమ్మట శివుని కనుసైఁగచేత ఎఱిఁగి చేరఁబోయెను. అప్పుడు [[శివుఁడు]] తన భార్యకు ఇంత భ్రమపుట్టుటకు కారణము బ్రహ్మకును అయిదు తలలు ఉండుటయె కదా అని అతనితలలో ఒకటిని శివుఁడు తీసివేసెను. అంత బ్రహ్మ అలిగి శివుఁడు కాపాలికత్వమును చెంది భిక్షాటనము చేయునట్లు శపించెను. ఆబ్రహ్మహత్యాపాపము పోవుటకై విష్ణువుయొక్క ఉపదేశమున శివుఁడు తీర్థయాత్ర చేసెను. అటుల యాత్రచేయుచు
ఇతని వ్యాపారము సృష్టిచేయుట. తొలుత ఇతనికి అనేకులు మానసపుత్రులు కలిగిరి. వారిలో తొమ్మండ్రు ప్రజాసృష్టికి కారణభూతులు అయి నవబ్రహ్మలు లేక నవ ప్రజాపతులు అనఁబడిరి. వారు మరీచి, అత్రి, అంగిరసుఁడు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, భృగువు, వసిష్ఠుఁడు, దక్షుఁడు అనువారు. తక్కిన మానసపుత్రులలో సనకుఁడు, సనందనుఁడు, సనత్సుజాతుఁడు, సనత్కుమారుఁడు, [[బుభుఁడు]], [[నారదుఁడు]], [[హంసుఁడు]], [[అరుణి]], [[యతి]] మొదలు అగువారు ముఖ్యులు. వీరు అందఱును ఊర్ధ్వరేతస్కులు అయి సృష్టియందు ఇచ్ఛలేక జన్మము మొదలు జ్ఞానులై తిరుగుచు ఉందురు.
బ్రహ్మయొక్క ఛాయవలన [[కర్దముఁడు]] పుట్టెను. భ్రూమధ్యమువలన అర్ధనారీశ్వరుఁడు అగు రుద్రుఁడు పుట్టెను.
ఈ ప్రజాపతుల యొక్కయు, మహర్షుల యొక్కయు ఉత్పత్తి పలువిధములుగ చెప్పుదురు. శ్రీమద్భాగవతమున ఉన్నరీతిని బ్రహ్మయొక్క అంగుష్ఠమున దక్షుఁడును, నాభిని పులహుఁడును, కర్ణముల పులస్త్యుఁడును, త్వక్కున భృగువును, హస్తమున క్రతువును, ఆస్యమున
== బ్రహ్మ మానస పుత్రులు ==
|