ఖాకీవనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
[[ఖాకీవనం]] నవలను ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, నిర్వాహకుడు [[కె.ఎన్.వై.పతంజలి]] రచించారు.
== రచన నేపథ్యం ==
ఖాకీవనం ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు కె.ఎన్.వై.పతంజలి తొలి నవల. ఈ నవల [[చతుర మాసపత్రిక]] [[1980]] నవంబరు సంచికలో మొదట ముద్రణ పొందింది. [[2012]] నవంబరులో [[మనసు ఫౌండేషన్]] ప్రచురించిన పతంజలి సాహిత్యం తొలిసంపుటంలో చోటుచేసుకుంది.<br />
ఈ నవలలోని వివరాలలో అధికభాగం వివిధ దిన, వారపత్రికల నుండి సేకరించిన యదార్థాలే గానీ కల్పితాలు కావని రచయిత పేర్కొన్నారు. ఈ అంశాన్ని గురించి చెప్తూ ''ఈ నవలలోని కథ సౌలభ్యం కోసం తెలుగు దేశంలోనే జరిగినట్లుగా వ్రాయబడింది. పాత్రలను కూడా తెలుగువారిగానే పరిచయం చేయటం జరిగింది... అయితే. వాస్తవంలో ఈ కథ తెలుగు దేశానికే పరిమితం కాదు. భారతదేశంలో ఎక్కడనయినా ఈ సంఘటనలు జరిగి ఉండవచ్చు. పాత్రలు ఏ ప్రాంతానివైనా కావచ్చు'' అంటారు గ్రంథకర్త నవల చివర ప్రచురించిన నోట్ లో.<ref>పతంజలి సాహిత్యం:కె.ఎన్.వై.పతంజలి:మనసు ఫౌండేషన్ ప్రచురణ:పే.74</ref>
=== అంకితం ===
"https://te.wikipedia.org/wiki/ఖాకీవనం" నుండి వెలికితీశారు