సాయంకాలమైంది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 10:
"మార్పు కొందరిని భయపెడుతుంది. కొందరిని జోకొడుతుంది. కొందరిని ఆనందింపజేస్తుంది" ఇవి కూడా నవలలో వాక్యాలే. ఈ మార్పే 'సాయంకాలమైంది' నవలలో కథా వస్తువు. ప్రాణం కన్నా సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మిన్నగా భావించే ఓ శ్రీవైష్ణవ కుటుంబంలో నాలుగు తరాల కాలంలో అనివార్యంగా వచ్చి పడిన మార్పుని వ్యాఖ్యాన సహితంగా చిత్రించిన నవల ఇది. కథాస్థలం విజయనగరం జిల్లాలో, గోస్తనీ నదీ తీరంలో ఉన్న పద్మనాభం అనే పల్లెటూరు. స్వస్థలం కాకినాడ సమీపంలో ఉన్న సర్పవరం అగ్రహారంలో ఆచారం సాగడంలో జరిగిన చిన్న పొరపాటు, పండితుడైన కుంతీనాధాచార్యుల వారిని కుటుంబ సహితంగా పద్మనాభం తరలి వచ్చేలా చేస్తుంది.
 
పద్మనాభంలో కుంతీమాధవ స్వామి, కొండమీది అనంతపద్మనాభ స్వామి ఆలయాల్లో అర్చకత్వం మొదలుపెడుతుంది ఆ కుటుంబం. కుంతీనాధా చార్యుల కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు తండ్రి ఇష్టానికి విరుద్ధంగా ఆయుర్వేద వైద్యం చేయడం మొదలుపెట్టి, కేవలం సంప్రదాయాన్ని నిలబెట్టడం కోసం అనివార్య పరిస్థితిలో ప్రాణత్యాగం చేస్తారు. పెద్ద తిరుమలాచార్యుల కుమారుడు సుభాద్రాచార్యులుసుబాధ్రాచార్యులు నూటికి నూరుపాళ్ళు తాతకి తగ్గ మనవడు. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని కొనసాగించడాన్ని మించినదేదీ లేదాయనకి. భర్తకి తగిన భార్య వరదమ్మ. పద్మనాభం అనే ఓ చిన్న పల్లెటూరినే తమ ప్రపంచంగా చేసుకున్న ఆ దంపతుల కొడుకు చిన్న తిరుమలాచార్యులు ఉద్యోగం కోసం విదేశాలకి వలస వెళ్ళిపోగా, కాలేజీలో చేరిన కూతురు ఆండాళ్ళు - కుండలు చేసుకుని జీవించే సానయ్య కొడుకు కూర్మయ్యని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. ఈ విపర్యయాలకి ఆ వృద్ధ దంపతులు ఎలా స్పందించారన్నది తర్వాతి కథ.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/సాయంకాలమైంది" నుండి వెలికితీశారు