గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
ప్రజలను విజ్ఞానవంతులను చేసి చైతన్యవంతులను చేసేందుకు గ్రంథాలయ ఉద్యమం ఉపయోగపడింది. గ్రంథాలయోద్యమ పితామహునిగా పేరొందిన [[అయ్యంకి వెంకటరమణయ్య]] ఉద్యమాన్ని ప్రారంభించారు. గ్రంథాలయోద్యమం ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం ద్వారా [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్య]], [[తెలంగాణా సాయుధ పోరాటం]] ఉద్యమాలలో భాగం వహించింది.
== ఉద్యమ క్రమం ==
1911లో రామమోహన గ్రంథాలయాన్ని [[అయ్యంకి వెంకటరమణయ్య]] స్థాపించారు. ఆయన 1914లో విజయవాడ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంధాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం 'నేషనల్ లైబ్రరీ వీక్ (National Library Week)' ను నిర్వహిస్తుంది.
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు
ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ద్రించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం వీరు పర్యటించారు.
== మూలాలు ==
|