గ్రంథాలయ ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
1911లో రామమోహన గ్రంథాలయాన్ని [[అయ్యంకి వెంకటరమణయ్య]] స్థాపించారు. ఆయన 1914లో విజయవాడ ఆంధ్రదేశ గ్రంథ భాండాగార ప్రతినిధులతో గ్రంథాలయ మహాసభలు నిర్వహించారు. 1915లో భారతదేశంలోని తొలి గ్రంథాలయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. సంఘం తరఫున ''ఇండియన్ లైబ్రరీ జర్నల్''ను ప్రారంభించారు. ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటుచేయడం, ప్రజలకు అక్షరజ్ఞానం కల్పించడం వంటివి ఇందులో భాగం. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రంథాలయ సంఘాల కార్యదర్శులు 1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను నిర్వహించారు. ఈ క్రమంలో కొత్త గ్రంథాలయాలను ప్రారంచించారు. మూసివేయబడిన గ్రంథాలయాలు ఎన్నో పునరుద్ధరించారు. 1920, 1934ల్లో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉద్యమనిర్వహణలో భాగంగా గ్రంథాలయ సంఘాల ప్రతినిధులు ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామంలోనూ పర్యటించారు.
== ఉద్యమ నేతలు ==
ఎందరో గ్రంథాలయోద్యమ నేతలు ప్రజా ఉద్యమాలలో పాల్గొని ప్రజలను చైతన్యవంతం చేశారు. కొందరు యువకులు గ్రంథాలయాల ద్వారా పుస్తక విజ్ఞానాన్ని తద్వారా జరుగుతున్న అన్యాయాలను అర్థం చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉద్యమాలలో నాయకులుగానూ ఎదిగారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/గ్రంథాలయ_ఉద్యమం" నుండి వెలికితీశారు