తెన్నేటి హేమలత: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
నవంబరు 15, 1935 న [[విజయవాడ]] లో నిభనుపూడి విశాలాక్షి మరియు నారాయణ రావు దంపతులకు జన్మించారు. ఆమెకు జానకి రమాకృష్ణవేణి హేమలత అని నామకరణం చేసారు. ఐదవ తరగతి వరకూ బడిలో చదువుకుని, ఆపైన [[తెలుగు]], [[సంస్కృతం]] మరియు [[ఆంగ్లం]] ఇంటి వద్దనే చదువుకున్నారు. తొమ్మిదోయేట ఆమెకు తెన్నేటి అచ్యుతరామయ్య తో [[వివాహం]] జరిగింది. ఆ సమయానికి అతడు ఆమెకన్నా ఏడేళ్ళు పెద్దవాడు మరియు ఒక దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నారు. ఈమె తండ్రి తన 32వ యేట, ఈమె చాలా చిన్నపుడే మరణించారు, అప్పుడు ఈమె తల్లి గర్భవతి.
1955లో విజయవాడలోని [[ఆకాశవాణి|ఆకాశవాణి కేంద్రం]] నుండి అనౌన్సర్ గా ఈవిడ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. మొదట్లో [[రేడియో నాటకాలు|రేడియో నాటకాల్లో]] పని చేసి ఆపై సినిమాలలో కూడా నటించి, మాటలు వ్రాయటం మొదలుపెట్టారు. ఈవిడ మొదటి రేడియోనాటకం ''శిలాహృదయం'' (రాయి లాంటి మనస్సు). ఇది 1952 లో [[డెక్కన్ రేడియో]] లో ప్రసారం చేసారు. ఈమె [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]] అభిమాని, ఆయన [[సంగీతం]] కూర్చిన కొన్ని రాగాలకు సాహిత్య రచన కూడా చేసారు.
భర్త ఆరోగ్యం క్షీణించడం ఒక పక్క, మరో పక్క ఇద్దరు పిల్లలు(మొదటి కొడుకు తెన్నేటి నారాయణరావు 1956 లో, రెండో కొడుకు తెన్నేటి మోహనవంశీ 1963 లో) [[సిజేరియన్ ఆపరేషన్]] ద్వారా పుట్టడంతో తీవ్రమయిన మానసిక క్షోభకు గురై, అదే విధంగా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులకు గురయారు. జీవితంలో మొదటి నుండి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడానని('''అంతరంగ చిత్రం''')లో ఆవిడ చెప్పుకున్నారు. 1997 లో 65 యేట ఆమె కన్ను మూసారు.
 
==సాహితీ వ్యాసంగం==
లత తన నవల ''[[గాలిపడగలు-నీటి బుడగలు]]'' లో [[వేశ్య]] ల దుర్భర బ్రతుకు చిత్రించారు. వారు మగాళ్ళ వద్ద అనుభవించే హింస మరియు వారికి సంక్రమించే వ్యాధుల గురించి చర్చించారు. <ref>[http://englishthulika.wordpress.com/2008/04/11/tenneti-hemalata-an-invincible-force-in-telugu-literature/ తెన్నేటి హేమలత గురించిన ఒక వ్యాసం]</ref> ఎంత నిరసన వ్యక్తమయినా, ఆమె ఇదే విషయాన్ని తన ''రక్త పంకం'' అనే నవలలో మరింత లోతుగా విశ్లేషించారు.
[[మోహనవంశీ]] మరియు [[అంతరంగ చిత్రం]] అనే నవలలలో ఈమె జీవితానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెలుస్తాయి. 1980 లో ఈమె '''రామాయణ విషవృక్ష ఖండన''' అనే పుస్తకాన్ని [[రంగనాయకమ్మ]] [[రామాయణ విషవృక్షం|రామాయణవిషవృక్షానికి]] విమర్శ-గ్రంథంగా వ్రాసిందివ్రాసారు. [[రామాయణ విషవృక్షం]], కవిసమ్రాట్ [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[రామాయణ కల్పవృక్షం|రామాయణ కల్పవృక్షానికి]] విమర్శ అని చాలాకొందరి మంది నమ్ముతారువాదన. [[ప్రియతముడు]] అనే నవల [[హైదరాబాదు]] ఆరవ [[నిజాము]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్|మీర్ మహ్బూబ్ ఆలీ ఖాన్]] జీవితం ఆధారంగా వ్రాసినదివ్రాసారు.
లత ప్రకారం, ఆవిడ మాటల్లోనే, "నేను 105 [[నవల]] లు, 700 [[రేడియో నాటకం|రేడియో నాటకాలు]] , 100 [[కథ|చిన్నికథలు]] , పది [[రంగస్థలం|రంగస్థల నాటకాలు]] , 5 సంపుటాల [[సాహిత్యం|సాహిత్య వ్యాసాలు]] , రెండు సంపుటాల [[సాహిత్య విమర్శ|సాహిత్య విమర్శలు]] మరియు ఒక సంపుటి "లత వ్యాసాలు" , ఇంకా 25 చరిత్రకందని ప్రేమకథలు అనే [[కవిత]] లు వ్రాసాను."
 
పంక్తి 82:
==బయటి లింకులు==
* [http://archive.is/wmcgR ''గాలిపడగలు నీటి బుడగలు'' కి ఆంగ్లానువాదం [[నిడదవోలు మాలతి]] ద్వారా]
* "[http://tethulika.wordpress.com/2010/01/11/%E0%B0%B2%E0%B0%A4-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/"]
 
== మూలాలు ==
{{reflist}}
* ''అంతరంగ చరిత్రం'', లత, వంశీ ప్రచురణలు, విజయవాడ, 1965.
* "http://tethulika.wordpress.com/2010/01/11/%E0%B0%B2%E0%B0%A4-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0/"
[[వర్గం:1935 జననాలు]]
[[వర్గం:1997 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/తెన్నేటి_హేమలత" నుండి వెలికితీశారు