రామ్మోహన్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం: Raja_Ram_Mohan_Roy.jpg|right|thumb|225px|[[బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనము]] నకు పితామహునిగా భావించబడే రాజా రామ్మోహన్ ]]<!-- FAIR USE of mig_21_guwahati.jpg: see image description page at http://en.wikipedia.org/wiki/Image: Raja_Ram_Mohan_Roy.jpg for rationale -->
'''రాజా రామ్మోహన్ రాయ్''' ( బెంగాలీ: রাজা রামমোহন রায়; ) ([[మే 22]], [[1772]] – [[సెప్టెంబరు 27]], [[1833]]) బ్రహ్మ సమాజ్, భారతదేశము లో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంభింchaduప్రారంభించాడు. ఆతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్యా రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది. ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటిష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన [[సతీసహగమనం|సతీసహగమనాన్ని]] రూపుమాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి, దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 
1828 లో ఇంగ్లాండు కు వెళ్ళక ముందు [[ద్వారకా నాథ టాగూర్]] తో కలసి బ్రహ్మసమాజ్ ను ప్రారంభించెను. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్ లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణ లకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, [[బెంగాల్ రెనసాన్స్]] లో ఒక ముఖ్యుడిగా భావింపబడెను.
"https://te.wikipedia.org/wiki/రామ్మోహన్_రాయ్" నుండి వెలికితీశారు