ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
 
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది.<ref>[http://www.andhrajyothy.com/vividhaNewsShow.asp?qry=2010/mar/15/vividha/15vividha1 అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర] -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]], సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు.<ref>[http://webcache.googleusercontent.com/search?q=cache:AiPplJ-Z3H8J:andhraprabha.in/specialstories/article-59651+%E0%B0%86%E0%B0%9A%E0%B0%82%E0%B0%9F+%E0%B0%B8%E0%B0%BE%E0%B0%82%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8+%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE&cd=4&hl=en&ct=clnk&gl=in&client=firefox-a తెలుగు సాహిత్య విమర్శలో విభిన్న ధోరణులు] - ఆంధ్రప్రభ డిసెంబరు 21, 2009</ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06 </ref>
 
1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు.<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=main119.htm విజ్ఞానశాస్త్రంతెలుగు రచయితలు] - చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం)</ref> సుజన ప్రమోదిని, కల్పలత వంటి పత్రికలు నడిపిన సాంఖ్యాయనశర్మ శతావధానాలు కూడా చేశాడు<ref>[http://www.eenadu.net/sahithyam/display.asp?url=panchatantram12.htm తెలుగు కథా ప్రస్థానానికి దర్పణం కథామంజరి] - -చీకోలు సుందరయ్య (ఈనాడు సాహిత్యం)</ref>