ఆచంట సాంఖ్యాయన శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి లింకులు మెరుగు చేయి |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 38:
మహోపాధ్యాయ '''ఆచంట వేంకట సాంఖ్యాయన శర్మ''' ([[అక్టోబర్ 19]], [[1864]]-[[1933]]), తెలుగు, సంస్కృత, ప్రాకృత, ఆంగ్ల భాషా పండితుడు. తొలితరం తెలుగు కథకుడు. ఈయన 1903లో వ్రాసిన లలిత తొలి తెలుగు కథల్లో ఒకటిగా భావించబడింది. అయితే ఆధునిక కథాలక్షణాలు ఆ రచనకు ఉన్నాయా లేదా అన్న ప్రశ్న కొంత సంశయానికి దారితీసింది<ref> అచ్చమాంబ: మనకు తెలియని మన చరిత్ర -ఆంధ్రజ్యోతి, వివిధ మార్చి 15, 2010</ref>. సాహితీ పరిశోధకుడు [[ఆరుద్ర]] సాంఖ్యాయనశర్మ వ్రాసిన విశాఖ (1904) కథే తెలుగుకథలలో మొదటిదని, [[గురజాడ అప్పారావు]] దిద్దుబాటు కథలని తులనాత్మకంగా పరిశీలించి నిరూపించాడు<ref>
</ref>. కానీ, [[బండారు అచ్చమాంబ]] 1898-1904 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రకటించిన 10 కథానికలు వెలువడటంతో సాంఖ్యాయన శర్మ తొలి తెలుగు కథకుడు కాదని తేలింది.<ref>తొలినాటి తెలుగు కథానికల కథ- సూర్యా పత్రిక జాల స్థలి, పరిశీలించిన తేది: 2010-08-06 </ref>
1890లలో ఆచంట సాంఖ్యాయన శర్మ తన రచనలలో విస్తృతంగా విజ్ఞానశాస్త్ర విషయాలకు ప్రాచుర్యం కల్పించాడు
సాంఖ్యాయన శర్మ 1864లో మద్రాసు ప్రెసిడెన్సీలోని విశాఖపట్నంలో విద్యాధికులైన నియోగి బ్రాహ్మణ కుటుంబంలో నరసమాంబ, బాపిరాజు దంపతులకు జన్మించాడు.<ref>http://www.maganti.org/PDFdocs/achanta.pdf</ref> సాంఖ్యాయన శర్మ 1903లో కల్పలత అనే పత్రికను స్థాపించాడు. తెలుగులో ఇదే మొదటి శాస్త్ర విజ్ఞాన విషయాలపై వచ్చిన పత్రిక. ఈ పత్రిక రెండున్నర సంవత్సరాలే నడిచినా, విడుదలైన 30 సంచికలు చాలా అమూల్యమైనవి. ఇందులోని విషయాలన్నీ ఆయనే స్వయంగా వ్రాసేవాడు. ఈ పత్రికలో శాస్త్ర విషయాలతో పాటు లఘ కథానికలు, ఆధునిక కవిత్వం మొదలైన ఇతర సాహితీ రచనలు కూడ ప్రచురించబడేవి. సాంఖ్యయన శర్మ కథలు లలిత, విశాఖ మరియు అపూర్వోపన్యాసం మొదలైన ఈ పత్రికలో ప్రకటించినవే.<ref>[http://www.sundarayya.org/eap/EAP287/Note%20on%20the%20List%20of%20Journals%20to%20be%20done%20in%20the%20project.doc List of Telugu Journals published prior to 1947]</ref>
|