బలి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) −వర్గం:విశ్వాసాలు; + 4 వర్గాలు; ±వర్గం:హిందూ సాంప్రదాయాలు→వర్గం:సాంప్రదాయాలు (హాట్కేట్ ఉప... |
చి విక్షనరీకి తరలింపు మూస |
||
పంక్తి 1:
{{విక్షనరి వ్యాసం}}
{{అయోమయం}}
==భాషా విశేషాలు==
Line 6 ⟶ 7:
==అబ్రహాం సంప్రదాయంలో బలి==
*[[
మొక్కుల రూపంలో వేల పొట్టేళ్లను ఒంటెలను పశువులను బలి చేస్తున్నారు.జంతువులను చంపండి నరకండి కొయ్యండి బలి ఇవ్వండి లాంటి సందేశాలు హిందూ,క్రైస్తవ మతాల లేఖనాల్లో కూడా ఉన్నాయి.అయితే నాగరికత పెరిగేకొద్దీ అలాంటి హింసా ప్రబోదాత్మక వాక్యాలను ఆయా మతాలలోని అహింసావాదులు పాటించటం మానేశారు.బుద్ధుడి అహింసా సిద్ధాంతం దెబ్బకు హిందూ పూజారులు యాగపశువుల్ని వదిలేసి శాకాహారులైతే,పౌలు ప్రభావంతో క్రైస్తవులు జంతుబలుల బదులు హృదయబలి కి మళ్ళారు.మాంసాహారం అవసరమే కానీ దేవుళ్ళు దేవతల పేరుతో జంతువులను బలి చేయటం ఆపి,మన ఆహారం కోసం మాత్రమే వాటిని వాడుకుంటే చాలు.బలి కోరే దేవుళ్ళ మీద భక్తి కంటే భయమే ఎక్కువ కలుగుతుంది.బలికి ప్రత్యామ్నాయం ఉపవాస ప్రార్ధనే అని నా అభిప్రాయం.బలిదానం ఇవ్వలేనివారు హజ్ కాలంలో మూడురోజులు, ఇంటికి తిరిగొచ్చిన తరువాత ఏడురోజులు చొప్పున మొత్తం పదిరోజులు ఉపవాసం ఉండాలి.(బఖరా 2:196).జంతువులను బలి ఇవ్వలేని కాబేతరులకు అల్లాహ్ ఇచ్చిన ఉపవాసప్రార్ధనోపాయం అందరికీ ఫలదాయకమేనని నా నమ్మకం.జంతుబలి కంటే ఉపవాస ప్రార్ధన మేలైనది. జంతువును ఆహారంకోసం కోసుకు తినటం వేరు,ఆచారం కోసం మనకు ఏ కీడూ చెయ్యని జంతువులను బలిచేయటం వేరు.దేవుడి పేరు చెప్పుకొని మాంసాన్ని హాయిగా ఆరగించేది మాత్రం మనమే."వాటి రక్తమాంసాలు అల్లాను చేరవు.కేవలం మీ భయభక్తులు మాత్రమే చేరతాయి"(హజ్ :37) ఇబ్రాహీము గారు తన కొడుకుకు బదులుగా బలి ఇవ్వటానికి దేవుడు స్వర్గం నుంచి గొర్రెను పంపాడు.అది ఇహలోక గొర్రె కాదు.మేలుకొలుపులూ మనకోసమే చక్రపొంగలీ మనకోసమే అన్నట్లు 'దేవుడికి బలి ఇచ్చాం' అనేకంటే 'పండగ పూట కోసుకుతిన్నాం' అని చెప్పుకోవటం సమంజసం.పండుగ సంప్రదాయం కోసం జంతువులను బలి ఇచ్చి మనుషులు తమ పాపాలు పొయ్యాయని తమంతట తామే అనుకుంటున్నారు.బలైన జంతువుకున్న ఒక్కో వెంట్రుకకు బదులుగా ఒక్కో పుణ్యం లభిస్తుందట.ఖుర్బానీ మొదటి రక్తపు బొట్టు బదులు మన గతపాపాలు క్షమించబడతాయట.జంతుబలి ద్వారా పాపాలు పోతుంటే ఏటేటా ఖుర్బానీ ఇవ్వకుండా ఎవరైనా ఆగుతారా? ఖుర్బానీ జంతువుల్ని చాలా ప్రేమగా చూడాలట.పుష్టిగా మేపాలట.ఎందుకో?.పైగా మన స్వహస్తాలతో దాన్ని కొయ్యాలట.మాంసం కొట్టు కెళ్ళి కొనుక్కొచ్చుకొని తింటాం గానీ మనల్నే కొయ్యమంటే కొయ్యగలమా?మన వల్లకాదు. దయ కంటే పుణ్యం లేదు,నిర్దయ కంటే పాపంలేదు.వీలైతే చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయటం,పక్షికి గుప్పెడు గింజలు చల్లడం,పశువుకి నాలుగు పరకలు వేయడం,ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం మానవాళికి మంచిది.అల్లా అనంత కరుణామయుడు,అపార కృపాశీలుడు కాబట్టి జంతువులను తనకు బలి ఇవ్వకపోయినా ఏమీ ఆగ్రహించడనే అనిపిస్తుంది.
Line 12 ⟶ 13:
*అన్ని మతాలలో బలులున్నాయి. బలి అనేది ఒక [[మూఢ నమ్మకం]]. ఊళ్లో పశువులకు జబ్బులు తగులుతున్నాయి. వీటికి క్షుద్రదేవతలు కారణమని, ఆ దేవతల్ని వూళ్లోకి రాకుండా చెయ్యలంటే బలులివ్వాలంటారు. మేకను ఒక పెద్ద రాయి మీద మెడ ఆనేటట్టు పట్టుకుని ఒక్క దెబ్బతో తల నరుకుతారు. పంది తల మాత్రం బయట కుండేటట్టు పాతేసి, గేదెలు, ఎద్దులు, గిత్తలు, దూడలు, ఆవుల చేత తొక్కిస్తారు. పంది ముట్టెమీద పశువులు పడటంతో గింజుకుంటు తల పక్కకి వాలి ఘోరంగా నెత్తురు కారుతూ చనిపోతుంది.
==బలులు మహాపాపం==
*[[దేవత]]ల [[జాతర]] లో మూగజీవుల [[మేక]]పోతుల గొంతు కొరికి నరికి చంపుతారు. ఇది తామసిక మనస్తత్వం. భగవంతునికి ఈ బలి వల్ల ప్రీతి కలుగుతుందనే [[మూఢ నమ్మకం
==ఎవరిని గాయపరచినా [[జగజ్జనని]] ని గాయపరచినట్లే==
*కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు.అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది.కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లవు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.
|