వీరుడొక్కడే: కూర్పుల మధ్య తేడాలు

దస్త్రం ఎగుమతి చేసాను
కథ జతచేయబడింది
పంక్తి 18:
 
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా శివ దర్శకత్వంలో తెలుగులోకి విడుదలయిన అనువాద చిత్రం "'''వీరుడొక్కడే'''". తమిళంలో వీరం పేరుతో ఈ సినిమాను నిర్మించిన [[విజయా పిక్చర్స్]] తెలుగులో కూడా విడుదల చేసింది. [[అజిత్ కుమార్]], [[తమన్నా]] జంటగా నటించిన ఈ సినిమాకి [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతదర్శకుడిగా, వెట్రి ఛాయాగ్రాహకుడిగా, కాశీ విశ్వనాథన్ ఎడిటర్ గా పనిచేసారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో మార్చి 21, 2014న భారిగా విడుదలయ్యింది.
 
== కథ ==
వీరవరం అనే ఊరిలో వీరేంద్ర ([[అజిత్ కుమార్]]) మార్కెట్ యార్డ్ లో ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు. వీరేంద్రకి ధర్మ, ఫణీంద్ర, గజేంద్ర, ఉపేంద్ర అనే నలుగురు తమ్ముళ్ళు ఉంటారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగుట్టుకున్న ఆ అన్నాతమ్ముళ్ళు పంచపాండవులుగా ఎదుగుతారు. ఈ ఐదుగురు పంచ పాండవులను సపోర్ట్ చేయడానికి లాయర్ అయిన బెయిల్ పెంచలయ్య సపోర్ట్ గా ఉంటాడు. వీరేంద్ర పెళ్లి చేసుకుంటే వచ్చే అమ్మాయి తన అన్నదమ్ములను విడగొడుతుందని భావించి పెళ్లి చేసుకోకుంటా ఉంటాడు. కానీ తన తమ్ముళ్ళు మాత్రం ప్రేమలో ఉంటారు. వారి పెళ్లి జరగాలంటే తన అన్న పెళ్లి జరగాలని ఆలోచించి వీరేంద్ర చిన్నప్పుడు గోమతిదేవి అనే అమ్మాయిని ప్రేమించాడని తెలుసుకుంటారు. కాని వెళ్ళి చూస్తే ఆమెకి పెళ్ళైపోయింది. తిరిగొచ్చాక ఆ ఊరుకి వచ్చిన గోమతిదేవి ([[తమన్నా]])తో తన అన్న ప్రేమలో పడేలా ప్లాన్ చేస్తారు. చివరికి వారనుకున్నట్టుగానే వీరేంద్ర – గోమతిదేవి ప్రేమలో పడతారు. గొడవలంటే అస్సలు ఇష్టంలేని గోమతిదేవి తండ్రిని ఒప్పించడానికి గొడవలన్నీ వదిలేసి వెళ్ళే సమయంలో వీరేంద్రకి నాగరాజు(అతుల్ కులకర్ణి) గోమతిదేవి ఫ్యామిలీని చంపాలని ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. అసలు నాగరాజు ఎవరు? గోమతి దేవి ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఈ విషయం తెలిసిన వీరేంద్ర ఏం చేసాడు? వీరేంద్ర – గోమతి దేవి చివరికి కలిసారా? లేదా? అనేది మిగిలిన కథ.
"https://te.wikipedia.org/wiki/వీరుడొక్కడే" నుండి వెలికితీశారు