ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
'''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ''' (ఐఐటీ)లు (Indian Institute of Technology [[హిందీ]]: भारतीय प्रौद्योगिकी संस्थान) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో పదహారు ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
 
వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, [[ఖరగ్ పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు [[యునెస్కో]], [[జర్మనీ]], [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో [[హైదరాబాద్]], [[రాజస్తాన్]], [[భువనేశ్వర్]], [[పాట్నా]], [[గాంధీనగర్]], [[పంజాబ్]] లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రం [[మండి]]లో మరియు [[ఇండోర్]]లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి. 2012 లో [[వారాణసి]] లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి ఐఐటీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) వారాణసి గా మార్చబడింది.
 
ఐఐటిలలో చదివిన విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండి, ఆయా రంగాలలో తమదైన ముద్ర వేశారు. వీటికున్న స్వయంప్రతిపత్తి అధికారం వలన ఇవి ఇతర భారతీయ యూనివర్సిటీల్లో ఇచ్చే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (BE) కాక (B.Tech) డిగ్రీని బ్యాచిలర్ విద్యార్థులకు అందజేస్తాయి. ఐఐటీలు విజయవంతం కావడంతో, వీటిని పోలిన ఐఐఎమ్ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్), ఎనైటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఐఐఐటీ మొదలైన సంస్థలు కూడా ప్రారంభించేందుకు వీలు కలిగింది.