తనకు ముందున్న వ్యాకరణ శాస్త్ర వేత్తల మార్గం లో నడుస్తూ ,బుద్ధి కుశలత తో కొత్త సంవిదానాలను కానీకన పెట్టాడు పాణిని .బోధనలో సౌకర్యం కోసం ‘’వ్రుత్తి ‘’కూడా రాశాడంటారు .శబ్ద ఉచ్చారణ కోసం సూత్రాలతో ఒక శిక్షా గ్రందాన్నీ రాశాడు .ఇది కాల గర్భం లో కలిసి పొతే స్వామి దయా నంద సరస్వతి మొదలైన వారు ప్రాచీన గ్రంధాలను ఆధారం గా చేసుకొని ఉద్దరించారు .ఇందులో ఎనిమిది ప్రకరణ లున్నాయి .పాణిని ‘’జాంబవతీ పరిణయం ‘’అనే మహా కావ్యాన్ని కూడా రాశాడు .’’ద్విరూప కోశంఅనే చిన్న పుస్తకం ,’’పూర్వ పాణినీయం ‘’పేరు తో 24సూత్రాల గ్రంధమూ రాశాడు ..అష్టాధ్యాయి లో శివ సూత్రాలలో ధ్వనుల పుట్టుక ఉచ్చారణ విధానం సూత్రా బద్ధం చేశాడు .ధాతు పా ఠం లో క్రియల మూలాల గురించి వివరించాడు .