భారత [[పార్లమెంటు]] (సన్సద్hindi:संसद) లో దిగువ [[సభ]]ను '''లోక్సభ''' (Loksabha) అంటారు. లోక్సభ సభ్యులను ప్రజలే ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ప్రజల ప్రత్యక్ష ప్రాతినిధ్యం ఉండే సభ కనుక ఇది '''ప్రజల సభ''' (House of the People) అయింది. [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]] ప్రకారం లోక్సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండవచ్చు. అందులో 530 మంది రాష్ట్రాల నుండి ఎన్నికైన సభ్యులు కాగా, 20 మంది కేంద్రపాలిత ప్రాంతాల నుండి, మిగిలిన ఇద్దరు [[రాష్ట్రపతి]] చే నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు. ప్రస్తుతం 545 మంది సభ్యులు ఉన్నారు - వీరిలో 530 మంది రాష్ట్రాల నుండి , కేంద్రపాలిత ప్రాంతాల నుండి 13 మంది, ఇద్దరు నామినేట్ చెయ్యబడ్డ ఆంగ్లో ఇండియన్ సభ్యులు ఉన్నారు.