తెలంగాణ విముక్తి పోరాట కథలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
తెలంగాణా విముక్తి పోరాట కథలు సంకలనాన్ని పోరాట కథలతో పాటు సాయుధ పోరాటాన్ని ప్రతిబింబించిన ఆనాటి చిత్రాలు, ఛాయాచిత్రాలు జతచేశారు. తెలంగాణా సాయుధ పోరాటంతో అవినాభావ సంబంధాన్ని కలిగిన బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ పోరాటాన్ని చిత్రీకరిస్తూ వేసిన చిత్రాలు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ సునీల్ జెనా ఆ సమయంలో నైజాంలో విస్తృతంగా తీసిన ఫోటోలు సంకలనంలో ఉపయోగించారు. తెలంగాణా పోరాటాన్ని నేపథ్యంగా స్వీకరించి తీసిన సినిమా [[మా భూమి]] స్టిల్స్‌ని, ప్రముఖ చిత్రకారులు చంద్ర, మోహన్‌లు వివిధ సందర్భాల్లో గీసిన బొమ్మలను కూడా వాడారు.
== కథల వివరాలు ==
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ప్రచురితమైన కథలు ఎక్కువ సంఖ్యలో, అనంతర కాలంలో ప్రచురితమైనవి కొద్ది సంఖ్యలో ఈ సంకలనంలో చేరాయి. 1944లో ప్రచురించిన భాస్కరభట్ల కృష్ణారావు '''దావత్''', 1945లో వెలువడ్డ వట్టికోట ఆళ్వారుస్వామి '''చిన్నప్పుడే''', పొట్లపల్లి రామారావు '''న్యాయం''' కథలు, 1946లో ప్రచురితమైన కథల్లో వేనేపల్లి ఆంజనేయులు రచించిన '''పాడియావు''', ఆవుల పిచ్చయ్య రాసిన '''ఈతగింజిచ్చి తాటిగింజ లాగిన జమీందార్''', '''ఊరేగింపులు''', '''దౌరా''', లింగమూర్తి సింగరాజు రాసిన '''మనకే విజయం''', పి.వెంకటేశ్వరరావు రచన చేసిన '''దొరోరి పుణ్యాన బిచ్చం''', '''రహీంభాయి''', '''అదిపంట కాదా''', '''దొంగలు దొంగలు ఊళ్ళుపంచుకున్నారు''' కథలు సంకలనంలో చేరాయి.
 
== మూలాలు ==