చిల్లర దేవుళ్ళు (నవల): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== ఇతివృత్తం ==
చిల్లర దేవుళ్లు కథాకాలం 1936-42 ప్రాంతంలోనిది. కథాస్థలం తెలంగాణాలోని ఓ చిన్న పల్లెటూరు. నవల ప్రారంభంలో సారంగపాణి అనే సంగీత ఉపాధ్యాయుడు బతుకుతెరువు కోసం విజయవాడ నుంచి ఆ ఊరికి వస్తాడు. ఊరి నడుమ దేశ్‌ముఖ్ రామారెడ్డి [[గడీ]] ఉంటుంది. అది ఊరి మొత్తానికీ ఏకైక భవంతి కాగా కరణం వెంకట్రావుతో పాటుగా మరికొందరికి మాదిరి ఇళ్ళు ఉంటాయి. మిగతా ఊరందరివీ గుడిసెలు. నిజాం పాలనలో లభించిన విపరీతమైన అధికారాలతో దొర, కరణం ఊరిని పరిపాలిస్తూ ఉంటారు. సంగీతం పట్ల ఆసక్తి ఉన్న దొర పాణికి తన గడీలో ఆశ్రయమిస్తాడు. రోజూ పాణి పాట వింటూ, అతనికి ఊళ్ళో రెండు మూడు సంగీత పాఠాలు ఏర్పాటుచేస్తాడు.
<!-- కథాస్థలం తెలంగాణలోని ఓ కుగ్రామం. సంగీతోపాధ్యాయుడు సారంగపాణి బ్రతుకుతెరువు వెతుక్కుంటూ విజయవాడ నుంచి ఆ ఊరికి చేరుకోడం కథా ప్రారంభం.