రాజా రాధా రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
రాజా రెడ్డిగారు [[1943]] అక్టోబర్ 6న [[ఆదిలాబాద్]] జిల్లా నర్సాపూర్ గ్రామంలో సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. రాధారెడ్డిగారు [[1952]]వ సంవత్సరం ఫిబ్రవరి 15న జన్మించారు. వీరిది బాల్య వివహం. వీరువురు వేదాంతం ప్రహ్లాద శర్మ గారి దగ్గర శిష్యరికం చేసారు. ఏలూరు లోని కళాక్షేత్రంనందు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించారు.
==నృత్యప్రదర్శనలు==
రాజా రెడ్డిగారికి చిన్ననాటి నుండి కూచిపూడి భాగవతం పైన ప్రత్యేక శ్రద్ధ. ఏలూరులో చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇచ్చిన తరువాత 1967 వ సంవత్సరం ప్రభుత్వ స్కాలర్షిప్ సహాయంతో ఢిల్లీలోని మాయారావ్ కళాశాలనందు కూచిపూడి నృత్యనభ్యసించారు. తరువాత భారతదేశములోనే కాకా [[అమెరికా]], [[క్యూబా]], [[రష్యా]], [[ఫ్రాన్స్]] ఇలా ప్రపంచమంతటా నృత్యప్రదర్శనలిచ్చారు. కృష్ణాసత్యలుగా శివపార్వతులుగా ఈ దంపతుల లయబద్ధ నృత్యానికి నాటి ప్రధాని [[ఇందిరాగాంధీ]]నే కాక క్యూబా అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో వంటివారి నుండి ప్రశంసలు అందాయి. సంప్రదాయ నృత్యరీతులకు పెద్దపీట వేస్తూనే కూచిపూడి నృత్యానికి ఆధునిక సొబగులద్దారు.
 
==నాట్య తరంగిణి==
తమ నాట్యప్రదర్శనలతో కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన వీరు [[న్యూ ఢిల్లీ]]నందు నాట్య తరంగిణి అను కాళాశాలను ఏర్పరిచి భావితరాలకు శిక్షణ ఇస్తున్నారు. వీరివద్ద కూచిపూడి అభ్యసించిన [[కౌసల్యా రెడ్డి]], [[యామినీ రెడ్డి]] మరియు [[భావనా రెడ్డి]]లు ప్రముఖ కూచిపూడి కళాకారులుగా వెలుగొందుతున్నారు. [[కూచిపూడి]] సాంప్రదాయ ఒరవడిని కొనసాగిస్తూ ఇప్పటికీ దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/రాజా_రాధా_రెడ్డి" నుండి వెలికితీశారు