బృహదీశ్వర దేవాలయం (తంజావూరు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎చిత్ర మాలిక: WLM2013చిత్రం చేర్చు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{Infobox temple
| name =
| image = Big_Temple-Temple tanjore.jpg
| image_alt =
| caption = బృహదీశ్వరాలయం
Line 41 ⟶ 40:
| website =
}}
[[దస్త్రం:Big_Temple-Temple.jpg|right|thumb|250px|బృహదీశ్వరాలయం]]
 
'''బృహదీశ్వర ఆలయం''' ([[తమిళ భాష|తమిళం]]: பெருவுடையார் கோவில்; '''పెరువుదైయార్ కోయిల్'''<ref>{{cite web| title= Bragatheeswarar Temple, The Big Temple|url=http://www.thanjavur.com/bragathe.htm|publisher=thanjavur.com| accessdate=2007/09/29}}</ref>బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది [[తమిళనాడు]] లోని [[తంజావూరు]] లో కలదు. ఇది శైవాలయం ([[శివాలయం]]). దీనిని 11వ శతాబ్దంలో [[చోళులు]] నిర్మించారు. ఈ దేవాలయం [[యునెస్కో]] చే [[ప్రపంచ వారసత్వ ప్రదేశం]] గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
==ఆలయ విశేషాలు==
 
దీనిని చోళ రాజు [[రాజ రాజ చోళుడు]] నిర్మించాడు. ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..
 
 
రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు [[గంగైకొండ చోళ పురం]]లో మరో [[బృహదీశ్వరాలయాన్ని]] నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి [[గంగైకొండ చోళ పురం]] అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం [[తంజావూరు]]లోని [[బృహదీశ్వరాలయం]] కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.