ఔరంగజేబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 49:
 
[[షాజహాన్]] మరియు [[ముంతాజ్ బేగం]]ల మూడవ కొడుకు [[గుజరాత్]] రాష్ట్రం లో [[దాహోడ్]] నగరంలో 1618 నవంబరు 3న పుట్టాడు. పూర్తి పేరు: అబూ ముజఫ్ఫర్ మొహియుద్దీన్ మహమ్మద్ ఔరంగజేబ్ ఆలంగిర్. తన ఆఖరి 27 సంవత్సరాలు దక్కన్లో యుధ్ధాలు చేస్తూ గదిపిన ఔరంగజేబు 1707 మార్చి 3న మరణించాడు. ఆతని సమాధి [[మహారాష్ట్ర]]లో ఖుల్దాబాద్ గ్రామంలో వుంది.
 
== పరిపాలన ==
[[షాజహాను]] కాలమునకు మొగలుసామ్రాజ్యము సర్వవిషయములందు పరమావధిని గాంచినది. ఔరంగజేబు మహాపరాక్రమశాలియు, రాజనీతిజ్ఞుడును అయియుండినను మతావేశపిశాచమునకు లోనయ్యెను. దేశమునందధీక్ సంఖ్యాకులుగనున్న హిందువుల ఆదరసౌఖ్యములపైననే మొగలుసామ్రాజ్యసౌధము నిర్మింపబడవలెనను అక్బరుచక్రవర్తి ఆదర్శమును, హిందువులయెడ ఆతడు చూపిన మతసహిష్ణుతయు, వారి విజ్ఞానమున ఆతడొసంగిన ప్రోత్సాహమును ఔరంగజేబుచే తారుమారు చేయబడినవి. తన సామ్రాజ్యమునందెల్లరును సున్నీమతానుయాయులుగ నుండవలెననియు, రాజ్యాంగమంతయు ఖొరానునందలి విధులననుసరించియే నిర్వహింప బడవలెననియు ఈతడు కృతనిశ్చయుడయ్యెను. ఈ చక్రవర్తి ఆగ్రహము హిందువుల దేవాలయములపైన, హిందూ విజ్ఞానముపైనను ప్రసరించెను. 1669లో ఈతని ఆజ్ఞచే హిందూ విద్యావిధానములగు దేవాలయములెన్నియో నాశనమొనర్పబడినవి. అందు [[కాశీ]] క్షేత్రమందలి విశ్వనాధాలయమును, మధురాక్షేత్రమున [[రజాబీర్ సింగు]]చే ముప్పదిమూడులక్షలు వ్యయపరచి కట్టింపబడి, సుందరశిల్పములతో అద్వితీయమని పేరుగాంచిన [[కేసవదేవాలయము]]లు ముఖ్యమైనవి.
ఈసందర్భమున ఎందరొ పండితులును, ఎన్నియో గ్రంధములు నశించబడినవి. ఆతని ఈ దుష్ప్రవర్తనచే హిందూ వాజ్మయమునకును, భారతీయ సారస్వత గౌరవమునకును తీరనిలోటు సంభవించినది.
 
ఈచక్రవర్తి మతావేశము హిందూవిద్యకెంత కీడును కలిగించెనో మహమ్మదీయ విద్య కంత అభ్యుదయమును చేకూర్చెను. అనేక స్థలములందు పాథశాలలను, కళాశాలలను నిర్మించి సుప్రసిద్ధ పండితులను ఉపాధ్యాయులుగా నియమించి వారికిను విద్యార్ధులకు కూడా వేతనములను, భరణములను ఏర్పరచెను.ఫిరోజ్ షా తుగ్లక్ వలే ఈతడును బానిసుల ఉద్ధరణకు పాలుపడెను. గుజరాత్తులో బోహ్రాలను బానిసలకు ఈతడు విద్య నేర్పించెను. పాదుషాల గ్రంధాలయములకు పెక్కు గ్రంధములు చేర్చబడినవి. విద్యా విషయమందున ఈతని కొన్ని అభిప్రాయములు మిక్కిలి కొనయాడతగినవి. మేధాశక్తిని మాత్రము పెంపొందించు వ్యాకరణ తత్వ శాస్త్రములకు సామాన్య విద్యా ప్రణాలికంత ప్రాముఖ్యముండరాదనియు, ప్రపంచ జ్ఞానమును అభివృద్దిపరుచు చరిత్రము, భూగోళము, భాషలు మున్నగు వానిలో ప్రత్యేక భొధన అవసరమని ఈతడు తలంచెను. జీవితమందలి వివిష సమస్యలను ఎదుర్కొని వానిని జయప్రధముగ చాటుట అవసరమగు పాటవమును ఇచ్చుచుండెను, భావి జీవితమున వారు తాము గైకొను వృత్తులతొ సన్నిహిత సంబంధమును కల్గియుండు విద్యయే పాఠశాలలో బోఢింపవలెనని ఈతడు తలంచెను.
 
నిరాడంబరమగు జీవితమును, నిరంతరము ఆధ్యాత్మిక చింతనమును జీవిత పరమావధులను ఖురానువాక్యములను ఈతడు ఆచరణలోనికి తెచ్చెను. మొగలుల ఆస్థానమున స్థిరముగ నాటియున్న ఆడంబర, శృంగార, రాజస చిహ్నములగు లలిత కళలను, శిల్పమును, గానమును, అలంకారములను దూరముగ తరిమివైచెను. ఇంతకు పూర్వము రోజుకొక మాదిరి నూతనకావ్యాభరణములతో మరియుచి, ఘడియకొక నూతన శిల్పనాట్యమొనర్చుచు, విశ్వమోహనగతులను వివహిరించుచుండిన మొగలుసామ్రాజ్యరమణి హఠాతుగా సర్వనాశనమునొంది పాలకులినివలెనే పరివ్రాజకావస్థ నొంది నిస్తేజమయ్యెను.
 
== వింతలూ విశేషాలు ==
* ఔరంగజేబు అలహాబాద్‌ లోని సోమేశ్వరనాథ్‌ ఆలయానికి స్థలాన్నీ, ఉజ్జయని మహాకేశ్వర, చిత్రకూట బాలాజీ, గౌహతి ఉమానంద్‌, శత్రుంజయ జైన్‌ దేవాలయాలకూ, అనేక గురుద్వారాలకూ నిధులనూ ఇచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/ఔరంగజేబు" నుండి వెలికితీశారు