దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
{{Template:భారతీయ పురస్కారాలు, పతకాలు}}
 
'''దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు''' ([[ఆంగ్లం]]: Dadasaheb Phalke Award) [[భారతీయ సినిమా]]కు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే [[దాదాసాహెబ్ ఫాల్కే]] జన్మశతి సందర్భంగా [[1963]] లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే [[జాతీయ సినిమా పురస్కారాలు|జాతీయ సినిమా అవార్డుల]] తోపాటు ఇస్తారు.
== చరిత్ర ==
నేడు మన బారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి ఆనందాన్ని, ఆటవిడుపునూ అందిస్తోన్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేర్గాంచిన వారు శ్రీ దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే. నాసిక్‌కు 30కిలోమీటర్ల దూరంలోని త్రియంబకేశ్వర్‌లో జన్మించారు. బొంబాయిలోని జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మరియు బరోడాలోని కళాభవన్‌లలో ఆయన విధ్యాభ్యాసం చేశారు.
 
'''దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు''' ([[ఆంగ్లం]]: Dadasaheb Phalke Award) [[భారతీయ సినిమా]]కు గణనీయమైన సేవ చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చే పురస్కారం. భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే [[దాదాసాహెబ్ ఫాల్కే]] జన్మశతి సందర్భంగా [[1963]] లో ఈ పురస్కారం ఏర్పాటు చేయబడింది. ఒక సంవత్సరానికి సంబంధించిన పురస్కారం మరుసటి ఏడాది చివర్లో ఇచ్చే [[జాతీయ సినిమా పురస్కారాలు|జాతీయ సినిమా అవార్డుల]] తోపాటు ఇస్తారు.
 
1896లో ఆయన బొంబాయిలోని వాట్సన్ హోటల్‌లో ఏసుక్రీస్తు చరితం పై ప్రదర్శించబడిన సినిమాను చూడటం జరిగింది. ఆ ప్రభావంతో ఆయన హైందవ దేవతలను చూపుతూ సినిమాలు తియాలన్న సంకల్పానికి వచ్చారు. 1913లో ఆయన తీసిన రాజా హరిశ్చంద్ర సినిమాతో మొదలైన ఆయన సినీ జీవితం 19 సంవత్సరాలు సాగింది. సినీ నిర్మాతగా, దర్శకుడుగా, స్క్రీన్‌ప్లే-రచయితగా ఈ కాలంలో ఆయన 95 చిత్రాలను, 26 లఘుచిత్రాలను రూపొందించారు. తాను ఎంతో ధనం సంపాదించినా అదంతా కూడా ఆయన సినీపరిశ్రమకు తిరిగివెచ్చించారు. సినిమా పరిశ్రమలోని వాణిజ్య పరమైన విషయాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు. భారతదేశంలో చలనచిత్ర పరిశ్రమ అబివృద్ధి చెందడానికి ఆయన ఎంతో కృషిచేశారు.
 
భారతీయ సినిమాకు పితామహుడుగా భావించబడే దాదాసాహెబ్ ఫాల్కే శతజయంతి సందర్భంగా 1969 లో దాదాసాహెబ్ ఫాల్కె పురస్కారాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతీయ చిత్ర వికాసంలో ఎనలేని కృషి చేసి, అద్భుత ప్రతిభా పాటవాలను కనబరిచే అతి కొద్ది మంది వ్యక్తులకు మాత్రమే లభించే గౌరవం ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.
 
నటీనటులు, సంగీత దర్శకులు,ఛాయాగ్రాహకులు, నేపథ గాయకులు, పాటల రచయితలు, దర్శకులు, నిర్మాతలు ఇలా ఒకరని కాదు చలనచిత్రాబివృద్ధికై విశిష్టంగా కృషి చేసిన ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే. కానీ అంతటి విశిష్ట సేవ చేసిన వారు చాలా అరుదుగానే ఉంటారు. అందుకే చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పొందే బిరుదు ఈ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్.
 
మొట్టమొదటి సారిగా 1969 లో ప్రకటించిన ఈ పురస్కారాన్ని ప్రఖ్యాత నటీమణి దేవికా రాణి కి అందచేశారు.
 
ఆ తర్వాత కాలంలో పృధ్వీ రాజ్ కపూర్, రూబీ మేయర్స్, బి.యన్ సర్కార్ లాంటి ప్రముఖులకు ఈ అవార్డ్ అందచేశారు. కానీ మొట్టమొదటగా ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారు మాత్రం బియన్ రెడ్డిగా పిలవబడే బొమ్మిరెడ్డి నరసింహా రెడ్డి. తెలుగు వారే కాదు భారతదేశం గర్వించదగ్గ సినిమాలైన “మల్లీశ్వరి”, “బంగారు పాప” లాంటి అత్యుత్తమ సినిమాలు రూపొందించిన బి.యన్.రెడ్డి సోదరుడైన మరో బియన్ రెడ్డి కూడా ఈ పురస్కారాన్ని పొందడం విశేషం.
 
నిజానికి బియన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. ఇద్దరు తెలుగు బియన్ లు ఈ అవార్డ్ అందుకోగా మరో బియన్ అయిన బి యన్ సర్కార్ మరియు బియన్ అనదగిన నితిన్ బోస్ కూడా ఈ పురస్కారం అందుకొన్నారు.
 
బియన్ రెడ్డి ల తో పాటు ఈ అవార్డు అందుకొన్న తెలుగు వారిలో ఎల్వీ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు గార్లు ఉన్నారు.
 
ప్రముఖ దర్శకులైన సత్యజిత్ రే, అదూర్ గోపాల కృష్ణన్, మృణాళ్ సేన్, శ్యాం బెనగల్, తపన్ సిన్హా, శాంతారాం, హృషికేష్ ముఖర్జీలు ఈ పురస్కారం అందుకొన్నారు. కేవలం దర్శకులే కాకుండా శివాజీ గణేశన్, దిలీప్ కుమార్, రాజ్ కుమార్ లాంటి నటులు కూడా ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.
 
నేపథ్యగాయకులైన మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోంస్లే కూడా ఈ అవార్డు గ్రహీతలే.
 
యాశ్ చోప్రా, అక్కినేని నాగేశ్వరరావు, జావేద్ అక్తర్, జగ్జిత్ సింగ్, ఆశా పరేఖ్ లు జ్యూరీ మెంబర్స్ గా వ్యవరిస్తున్న ఈ పురస్కారాన్ని గత సంవత్సరం శతాధిక చిత్ర నిర్మాత, గిన్నిస్ బుక్ రికార్డ్ ల్లోకి ఎక్కిన డాక్టర్ డి రామానాయుడు గారికి అందచేశారు.