గోదావరి కథలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
గోదావరి కథలు పుస్తకాన్ని బి.వి.ఎస్.రామారావు వ్రాశారు. ఈ పుస్తకం గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల చుట్టూ అల్లుకున్న కథల సంకలనం.
[[File:Papikondalu 03.jpg|thumb|పాపికొండల వద్ద గోదావరి పై సూర్యాస్థమయం]]
== రచన నేపథ్యం ==
1980 ప్రాంతాల్లో వివిధ తెలుగు వార, మాస పత్రికల్లో బి.వి.ఎస్.రామారావు వ్రాసిన పలు కథలను ఈ సంకలనంగా ప్రచురించారు. పోలవరం, భద్రాచలం నుంచి గోదావరి పాయలు సముద్రంలో కలిసేవరకూ ఉన్న వివిధ ప్రాంతాలలో నదితో జీవితాన్ని పెనవేసుకున్న వారి జీవితాలను ఈ కథల్లో చిత్రీకరించారు. అన్ని కథలకూ గోదావరి నది నేపథ్యంగా అమరడం, రచయితకు గోదావరి పట్ల అభిమానం ఉండడం వంటి కారణాలతో సంకలనానికి గోదావరి కథలు అని పేరుపెట్టారు. సుప్రసిద్ధ చిత్రకారుడు, దర్శకుడు [[బాపు]] ఈ కథలకు బొమ్మలు వేశారు. చాలా కథలకు బాపు రెండు, మూడు బొమ్మలు వేయడంతో వాటన్నిటినీ చేర్చి మరీ ప్రచురించారు. ఈ కథాసంకలనాన్ని అక్టోబర్, 2012లో ఎమెస్కో బుక్స్ ప్రచురణ సంస్థ ప్రచురించింది. రామారావు తనకు ఆప్తమిత్రులు, దర్శక నిర్మాతలుగా, చిత్రకార రచయితలుగా సుప్రసిద్ధులైన ద్వయం బాపు-రమణలకు ''గోదారితల్లిని ఆటలతో పాటలతో అర్చించిన పాగోజీ బాపు తూగోజీ రమణలకు మూడో పూజారి సీతారాముడు ఇస్తున్న తీర్థప్రసాదాలు ఈ గోదావరి కథలు '' అంటూ అంకితం చేశారు. ఈ పుస్తకానికి ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ, సుప్రసిద్ధ కథకుడు, సంపాదకుడు పురాణం సుబ్రహ్మణ్యశర్మ ముందుమాటలు వ్రాశారు.
"https://te.wikipedia.org/wiki/గోదావరి_కథలు" నుండి వెలికితీశారు