భువనగిరి కోట: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 14:
[[నల్గొండ జిల్లా]] శాసనాల సంపుటిలోని 26వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ.1105లో [[కొలనుపాక]] లో వుంటున్న పారమార జగద్దేవుని కాలంలో ధక్కన నాయకుని కొడుకు బమ్మదేవరనాయకుడు ఆలేరు-40 కంపణంలోని గోష్టీపాళులో సోమేశ్వర దేవునికి సకలదేవరభోగాలతో (మఠం అనుసంధానం) మఠ విద్యార్థులకు భోజన వసతికిచ్చిన దానం తెలుపబడింది.
34వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ. 1111లో [[భువనగిరి]] లోని సోమేశ్వరదేవునికి భువనగిరి దండనాయకుడైన లక్ష్మీదేవుడు ‘నందాదివిగె’(perpetual lamp)కానుకగా యిచ్చినట్లుంది. 39 వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ. 1123లో సోమేశ్వరదేవునికి భువనగిరి సర్వాధ్యక్ష దండనాయకుడు కేసియరసరు (సుంక సాహనవెగ్గడ) నూనెగానుగలవారి నుండి బకాయీకానుకలను ఇప్పించినట్లున్నది.
46వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్ల విక్రమాదిత్యుని కాలంలో క్రీ.శ. (తెలియదు) దండనాయకుడు సొద్దలయ్య (భీమనారాయణ దండనాయుడు ప్రతిష్టించిన) భీమనారాయణ దేవుడికిచ్చిన కానుకల గూర్చి చెప్పబడింది.49వ శాసనంలో పశ్చిమ చాళుక్యరాజైన ప్రతాపచక్రవర్తి జగదేకమల్లుని కాలంలో క్రీ.శ.1146లో తన సేనాధిపతి( పేరు లేదు) దేవునికి యిచ్చిన కానుకల గూర్చి చెప్పబడింది. భువనగిరికి చెందిన ఖాజీ ఇంటిదగ్గర రాయిమీద ‘వెలమ సింగనాయక..... అనవోతానాయకుని’ పేర్లున్నాయి.
▲తాజాకలంః కరీంనగర్ రామడుగు వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట. ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది.
మౌఖిక కథనాల ప్రకారం భువనగిరిలో కోట కట్టాలనుకున్న త్రిభువనమల్లునికి స్థానికులైన గొల్ల దంపతులు ఈ కొండను చూపించారట. అరణ్యంలో తీగెలతో కప్పబడివున్న ఈ కొండ కోట నిర్మణానికి అనుకూలంగా భావించి దుర్గం నిర్మించి ఆ బోనయ్య, గిరమ్మ దంపతుల పేరు మీదనే పట్టణానికి నామకరణం చేసాడట చక్రవర్తి త్రిభువనమల్లుడు. చాళుక్యుల పిదప కాకతీయులీ దుర్గాన్ని ఏలారని చెపుతారు.
కొండపైన ఒక శివాలయం
|