ఇంద్రగంటి శ్రీకాంత శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇంద్రగంటి శ్రీకాంత శర్మ''' ప్రముఖ తెలుగు కవి.
==జీవిత విశేషాలు==
తూర్పు గోదావరి జిల్లా [[రామచంద్రపురం]]లో శ్రీకాంతశర్మ [[మే 29]] [[10441944]] న జన్మించారు. సుప్రసిద్ధకవి [[ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి]] వీరి తండ్రి. ఎం. ఏ. పట్టభద్రులై [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో (విజయవాడ) సబ్-ఎడిటర్ గా 1969-76 మధ్య పనిచేశారు. అభ్యుదయ కవిగా శర్మ ప్రసిద్ధులు.
 
1976లో [[ఆకాశవాణి]] విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్ (Scripts) గా శర్మ చేరారు. తెలుగు ప్రసంగాల శాఖకు [[ఉషశ్రీ]]కి సహాయకులుగా సంస్కృత కార్యక్రమాలు నిర్వహించారు. శర్మ చక్కని రూపకాలు రచించారు. వీరు రచించిన అమరారామం రూపకం 1981 లో జాతీయ స్థాయిలో బహుమతి పొందింది. 1986లో ' వర్షానందిని ', ' నేను కాని నేను ' బహుమతులు జాతీయస్థాయిలో అందుకోవడం విశేషం 1994లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా నిజామాబాద్ కేంద్రంలో చేరారు. 1995లో స్వచ్చంద పదవీ విరమన చేసి [[ఆంధ్రప్రభ]] సచిత్ర వారపత్రిక సంపాదకులుగా చేరారు.
 
కవిగా రచయితగా శ్రీకాంతశర్మ లబ్ధప్రతిష్టులు. వీరి రచనలు అలనాటి నాటకాలు శిలామురళి, పొగడపూలు, ఆలొచన, గాధావాహిని, సాహిత్య పరిచయం ప్రసిద్ధాలు. రూపక రచయితగా, గేయ రచయితగా శ్రీకాంతశర్మ శ్రోతలకు పరిచితులు. కొన్ని సినీ గీతాలు కూడా శర్మ వ్రాశారు. శర్మ స్నేహశీలి. వీరికి నూతలపాటి గంగాధరం సాహితీ పురస్కారం, ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు లభించాయి.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}